Publish Date:Jul 19, 2016
జులై 22 ఏపీకి రాష్ట్రానికి అత్యంత కీలకమైన రోజు. ఆరోజు ఏం జరగుతుంది.. ఆరోజు ఏపీ ప్రజలకు ఊరటనిస్తుందా.. లేక ఇంకా అంధకారంలోకి పడేస్తుందా.. ఇంతకీ ఆరోజున ప్రత్యేకత ఏంటని అనుకుంటున్నారా.. ఏంటంటే ఏపీకి ప్రత్యేక హోదాపై ఓటింగ్ జరిగే రోజు. కేవీపీ రామచంద్రరావు ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ ప్రైవేట్ మెంబల్ బిల్లు ప్రవేశ పెట్టారు. అయితే ఇప్పుడు దానిపై ఓటింగ్ 22వ తేదిన జరగనుంది దీంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఇప్పటికే ఏపీ ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసిన సంగతి తెలిసిందే. మరి ఇలాంటి తరుణంలో ఓటింగ్ జరగనుంది. మరి ఈ ఓటింగ్లో ఏపీ ఓడిపోతుందా.. లేక గెలుస్తుందా.. అసలు బీజేపీ ఎలా వ్యవహరిస్తుంది అన్న సందేహాలు వినిపిస్తున్నాయి. మొత్తం 245 మంది సభ్యులు గల రాజ్యసభలో ఎన్డీఏకు 72 మంది సభ్యులున్నారు. యూపీఏ తరఫున 66 మంది ఉండగా.. ఇంకా పలు పార్టీలకు చెందిన పలువురు నేతలు ఉన్నారు. మరి ఈనేపథ్యంలో అందరూ ఏపీ ప్రత్యేక బిల్లుకు ఓటింగ్ వేస్తారా లేదా అన్నది ప్రశ్నార్ధకంగా మారింది.
ఇప్పటికే రాష్ట్రాన్ని విడగొట్టి పాపం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడైనా ఏపీ ప్రత్యేక హోదా బిల్లుకు ఓటింగ్ వేస్తే పాప ప్రక్షాళన చేసుకున్నట్టు. అలా చేస్తే కనీసం ఇప్పుడైనా కాంగ్రెస్ ను ఏపీ ప్రజలు గుర్తించే అవకాశం ఉంటుంది. ఇక ఆరుగురు సభ్యులు సైతం టీడీపీ నేతలు ఎలాగూ ఓటు వేయాల్సిందే. కాంగ్రెస్ పార్టీ ఓట్లు, టీడీపీ నేతలు.. ఇంకా పలు పార్టీలకు చెందిన నేతలు కూడా ఏపీ కి బిల్లుకు మద్దతు పలికి ఓట్లు వేస్తే గెలిచినట్టే. మరి ఏం జరుగుతుందో తెలియాలంటే 22 వరకూ ఆగాల్సిందే.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ap-special-status-39-63973.html
ప్రజాధనం దుబారాను నియంత్రించాల్సిన బ్యూరోకాట్లు, అఖిల భారత సర్వీసు అధికారులైన ఐఏఎస్ లు ఆ దిశగా ఎటువంటి ప్రయత్నం చేయకుండా కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తూ.. ఏలిన వారు అంటే అధికారంలో ఉన్న వారి అడుగులకు మడుగులొత్తుతూ.. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేయడం అధికార దుర్వినియోగమే ఔతుందన్నారు.
మెజారిటీ ఉందికదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే అంగీకరించేది లేదన్నారు. మోడీ సర్కార్ పేదల పట్ల కక్ష సాధింపుధోరణితో వ్యవహరిస్తోందనీ, అందుకే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తోందనీ విమర్శించారు.
సీమ లిఫ్ట్ పై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సీమకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనీ, తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి సీమ లిఫ్ట్ పై చేసిన వ్యాఖ్యల ఆధారంగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలోని ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) ప్రధాన కార్యాలయాంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించడం కలకలం రేపింది. కాగా ఈడీ దాడులపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయన పుట్టిన రోజు సందర్భంగా బహిరంగంగా జంతువులను వధించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు వైసీపీ కార్యకర్తలపై జంతు హింస చట్టం కింద కేసులు నమోదైన సంగతి విదితమే. ఇప్పుడు జగన్ తాజాగా ఈ కేసులు ఎదుర్కొంటున్న తన పార్టీ మద్దతుదారులకు పార్టీ లీగల్ సెల్ అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ నెల 16న పోలింగ్ స్టేషన్ల వివరాలతోపాటు ఫొటోతో కూడిన ఓటర్ల తుది జాబితాను ఆయా వార్డుల్లోని పోలింగ్ స్టేషన్ల వారీగా ప్రచురించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే జనాభా ప్రాతిపదికన వార్డులు, డివిజన్లు, ఆయా మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల రిజర్వేషన్లను ఖరారు చేయనున్నట్లు తెలిపారు.
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సవాల్ విసిరారు
ప్రజాసమస్యలపై అధికారులతో చర్చిస్తారు. క్షేత్ర స్థాయిలో పరిశీలన కూడా చేస్తారు.
ఆయన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో శుక్రవారం జరగనున్న సంక్రాంతి సంబరాల్లో పవన్ కల్యాణ్ స్థానికులతో కలిసి పాల్గొంటారు.
ఈ భేటీలో చంద్రబాబు అమరావతి చట్టబద్దత, పోలవరం, బడ్జెట్ కేటాయింపులు, ఉపాధి హామీ పథకంలో వెసలుబాటు వంటి పలు అంశాలను ప్రస్తావించారు. వాటితో బాటుగా కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో టీడీపీకి ఒక బెర్తు సైతం డిమాండ్ చేశారు.
తెలుగువన్ ఎండి రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ లు తాజాగా వ్యవస్థల పతనం, అందుకు కారణాలపై తమ ఆవేదనను సూటిగా ఎలాంటి శషబిషలూ లేకుండా వ్యక్త పరిచారు.
మోకిల నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ కారు మీర్జాగూడ వద్ద అదుపు తప్పి తొలుత డివైడర్ ను ఆ తరువాత చెట్టును ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతులు, క్షతగాత్రులు అందరూ విద్యార్థులే.
ఇటీవల అనారోగ్యంతో మరణించిన టీడీపీ నేత అప్పలనాయుడు కుటుంబాన్ని మంత్రి లోకేష్ పరామర్శించారు.
ఐదేళ్ల పాటు ఢిల్లీలో చక్రం తిప్పారు. కవిత ఎడ్యుకేటెడ్ కావడం, హిందీ కూడా బాగానే మాట్లాడగలగడంతో జాతీయ స్థాయి ప్రతినిథిగా ఉండేవారు. అయితే కవిత రెండో సారి ఎంపీగా గెలవలేక పోయారు