సమరానికి సిద్ధం...!

Publish Date:Jul 20, 2018

Advertisement

లోక్‌సభలో అధికార, ప్రతిపక్షాల మధ్య సమరానికి రంగం సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా లక్ష్యంగా.... దేశంలో పేరుకుపోయిన ఇతర సమస్యలనూ ప్రస్తావించేందుకు ప్రతిపక్షాలు సమాయత్తం అవుతున్నాయి. తెలుగుదేశం పార్టీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై చర్చకు కేంద్రం అనూహ్యంగా అంగీకారం తెలిపింది. ఎవరూ ఊహించని ఈ పరిణామానికి బీజేపీ వ్యూహాతక్మంగా తెర తీసింది. తొలుత పది రోజుల్లో అవిశ్వాసంపై నిర్ణయం తీసుకుంటానన్న స్పీకర్ సుమిత్రా మహాజన్ కేవలం 24 గంటలలోపే శుక్రవారం నాడు చర్చకు అనుమతించడం ప్రజాస్వామ్యానికి శుభసూచకం. భవిష్యత్‌లో ఎప్పుడైనా ఇలాంటి సమస్య ఎదురైతే నేటి అంశాన్ని విపక్షాలు పాలకపక్షం ముందు చూపించి న్యాయం చేయమని కోరే అవకాశం ఉంది.  విపక్షాల గొంతు నొక్కేందుకు అధికార పక్షం చేసే యత్నాలకు ఇలాంటి సంఘటనలు అడ్డుకట్ట వేస్తాయి.

 

 

సరే, యుద్ధం ప్రారంభమైంది. సమర సమయం కూడా నిర్ణయం అయిపోయింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై లోక్‌సభ వేదికగా చర్చ ప్రారంభమవుతుంది. మొత్తం ఏడు గంటల పాటు ఆంద్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై వివిధ పార్టీలు సభలో చర్చిస్తాయి. లోక్‌సభలో పార్టీల బలాబలాలను బట్టీ ఆయా పార్టీలు మాట్లాడే సమయాన్ని కూడా కేటాయించారు. సభ నియమాల ప్రకారం ఇది పద్దతే అయినా.... సమస్య పరంగా చూస్తే మాత్రం ఈ సమయ పాలన ఆంధ్రప్రదే‌శ్‌కు రుచించదు. ప్రత్యేక హోదాపై అట్టుడికిపోతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలను లోక్‌సభలో వెల్లడించేందుకు రాష్ట్రం నుంచి తెలుగుదేశం పార్టీకి దక్కిన సమయం కేవలం 13 నిమిషాలు.

ఈ కాస్త సమయంలోనే మొత్తం ఆవేదనంతా సభలో చెప్పుకోవాలి. అయితే ఇదే అంశంపై చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన సమయం 38 నిమిషాలు. విభజన ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు దూరమైన కాంగ్రెస్ పార్టీ తిరిగి ఆ ప్రజలకు చేరువయ్యేందుకు ఈ సమయాన్ని ఉపయోగించుకోవాలని చూడడం మంచి పరిణామం. ఇక మరో తెలుగు రాష్ట్రం తెలంగాణ లోక్‌సభ సభ్యులకు ఇచ్చిన సమయం 9 నిమిషాలు. ఈ సమయంలో వారు ప్రత్యేక హోదా కంటే కూడా తమ రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలపైనే ప్రస్తావిస్తారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రతిప‌క్ష వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ స‌భ్యులు రాజీనామా చేయ‌డంతో వారు స‌భ‌కు వ‌చ్చే అవ‌కాశం లేదు. 

 

 

ఈ ఏడు గంటల చర్చ అనంతరం అధికార పక్షానికి సమాధానం ఇచ్చుకునే సమయం చర్చకు కేటాయించిన సమయంలో సగం కంటే ఎక్కువే. అంటే ప్రతిపక్షాలు గంట సేపు సమస్యపై ప్రస్తావిస్తే అధికార పార్టీ మాత్రం దానికి మూడు గంటలకు పైగా సమాధానం ఇస్తుంది. దీనినే వడ్డించే వారు మనవారైతే అంటారు. అవిశ్వాసంపై విజయం అధికార పక్షానిదే అని తేలిపోయింది. సభలో వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. అధికార పక్షానికి మిత్రపక్షాలైన తెలంగాణ రాష్ట్ర సమితి, అన్నాడిఎంకే, బిజేడీ వంటివి అవిశ్వాపానికి వ్యతిరేకంగా మాట్లాడతాయి.

 

 

ఇందులో అన్నాడిఎంకే అయితే తమ సభ్యులు విధిగా సభకు హాజరుకావాలనే విప్‌ను కూడా జారీ చేయలేదు. పైగా ఇది ఆంధ్రప్రదేశ్ సమస్య. దీంతో మాకేంటి అని ఆ పార్టీ ముఖ్యమంత్రి పళని స్వామి ప్రకటించారు. ఇంచుమించు ఇదే ప్రకటనను తెలంగాణ రాష్ట్ర సమితి కూడా చేసింది. దీంతో ఈ రెండు పార్టీలూ అధికార పక్షం వైపు చేరిపోయినట్లే. ఇక ఒడిషాలోని బిజేడీ అయితే తాము ఓటింగుకు దూరం అని ప్రకటించింది. శివసేనతో బిజెపి అధ్యక్షుడు అమిత్ షా నెరపిన దౌత్యం ఫలించినట్లు కనిపించడం లేదు. ముందు సరే అన్నా... అర్ధరాత్రి శివసేన పులి ప్లేటు మార్చింది. 

 

 

ఓటింగ్‌పై అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుంటామని ప్రకటించింది. ఇక అవిశ్వాసానికి మద్దతుగా తీర్మానం పెట్టిన తెలుగుదేశం, దానికి సహకరిస్తున్న కాంగ్రెస్ ఓటు వేస్తాయి. వీరికి మద్దతుగా వామపక్షాలు, మమతా బెనర్జీ, అమ్ ఆద్మీ వంటి పార్టీలు బాసగా నిలుస్తాయి. అయితే వీరి సంఖ్యాబలం తక్కువ కాబట్టి తీర్మానం వీగిపోవడం ఖాయంగానే కనిపిస్తోంది. అవిశ్వాస తీర్మానం పెట్టిన తెలుగుదేశం పార్టీ ముందుగా చర్చను ప్రారంభిస్తుంది. ఇందులో కూడా ఆ పార్టీ కాస్త ఇబ్బంది పడింది. ముందుగా తీర్మానం ప్రవేశపెట్టిన కేశినేని నాని మాట్లాడతారని ప్రకటించారు. అనూహ్యంగా ఆయన స్ధానంలో గల్లా జయదేవ్ వచ్చారు.

దీంతో నాని అనుచరుల్లో కోపం, అసహనం ప్రారంభమైంది. కేశినేని నాని కూడా పైకి తమ నాయకుడు చెప్పినట్లే చేస్తామని ప్రకటించినా లోలోపల ఆయన ఇబ్బంది పడుతున్నారు. ఇక సభకు  రానని భీష్మించుకున్న అనంతపురం ఎంపీ జె.సీ.దివాకర్ రెడ్డి అలక వీడారు. ఆయన అనుకున్నది సాధించుకుని శుక్రవారం సభకు హాజరవుతానని ప్రకటించారు. అంతే కాదు... కేంద్రం వైఖరికి నిరసనగా ఆయన రాజీనామా కూడా చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై నేడు తేలనుంది. ఈ అంశపై చర్చ అనంతరం ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆదరిస్తారో... ఎవరిని తిరస్కరిస్తారో  తేలిపోతుంది.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.