Publish Date:Jul 14, 2022
జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ రోడ్లపై విపక్షాలు చేస్తున్న విమర్శలను పట్టించుకోలేదు..పొరుగు రాష్ట్రం మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఎదురుదాడికి దిగారు. అన్నీ అబద్ధాలు, అసత్య ప్రచారాలంటూ దుమ్మెత్తి పోశారు. పైపెచ్చు వారం వారం రోడ్ల పరిస్థితిపై జగన్ సమీక్షలు నిర్వహించారు. అద్దాల్లాంటి రోడ్లు.. సాఫీ ప్రయాణం అంటూ గప్పాలు కొట్టుకున్నారు.
నాలుగు రోజులు వానలు పడ్డాయో లేదో ఏపీలో రోడ్ల బండారం బయట పడిపోయింది. ఈ మూడేళ్లలో చిన్న గుంత కూడా పూడ్చలేదని రుజువై పోయింది. ఇటీవలే చేసిన సమీక్షలో జూలై 15 నాటికి రోడ్లపై ఒక్క గుంత కూడా ఉండదని జగన్ ఆర్భాటంగా ప్రకటన కూడా చేశారు. నిజమే కాబోలు అనుకునే వారికి దిమ్మ తిరిగేలా వాస్తవ పరిస్థితి ఉంది. ఆయన చెప్పిన జూలై 15 వచ్చేసింది. నిజమే రోడ్లపై ఒక్క గుంత లేదు. బోలెడు గుంతలు ఉన్నాయి. ఇంచుమించు అడుగుకో గుంత ఉందంటే అతిశయోక్తి కాదు.
వర్షాలకు ఆ గుంతలు ఈత కొలనులను తలపిస్తున్నాయి. దాదాపు అన్ని పట్టణాలు, నగరాలు, పల్లెల్లో రోడ్ల పరిస్థితి ఇదే. ఎవరైనా హఠాత్తుగా చూస్తే ఇక్కడ రోడ్డేది.. అన్నీ నీటి కొలనులేగా అంటారు. ఆ గంతల రోడ్లపైనే, ఈ నీటి తటాకాల్లోనే అత్యంత ప్రమాకర పరిస్థితుల్లో వాహనదారులు ప్రయాణించాల్సి వస్తోంది. రోడ్లా..ఈత కొలనులా అంటూ నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో ఏపీలో రోడ్ల దుస్థితిపై ఫొటోలు పెట్టి మరీ ట్రోల్ చేస్తున్నారు. పోనీ ఇప్పుడైనా జగన్ సర్కార్ ఈ రోడ్ల మరమ్మతులు చేపడుతుందా అంటే ఆ అవకాశమే కనిపించడం లేదు. ఎందుకంటే ఇప్పటికే కాంట్రాక్టర్లకు కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. దీంతో పనులు చేయిద్దామని ప్రభుత్వం ఒక వేళ పొరబాటున అనుకున్నా.. చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాని పరిస్థితి ఏపీలో ఉంది. వైసీపీ నేతలే ప్రభుత్వ కాంట్రాక్టులా అయ్యబాబోయ్ అని పారిపోతున్న పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఏపీ రోడ్లను ‘ఏ దేవుడూ’ బాగు చేయలేడు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ap-roads-look-like-swimming-pools-25-139761.html
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.
ఈ అరెస్టు పై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. హరీష్ రావు అరెస్టు సందర్భంగా పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. గురుకులాల్లో అవినీతి, రాష్ట్ర అప్పులపై గన్ పార్క్ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్.. బీఆర్ఎస్ నేతలు హరీశ్రావు, కేటీఆర్లకు సవాల్ విసిరారు.