Publish Date:Jul 14, 2022
జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ రోడ్లపై విపక్షాలు చేస్తున్న విమర్శలను పట్టించుకోలేదు..పొరుగు రాష్ట్రం మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఎదురుదాడికి దిగారు. అన్నీ అబద్ధాలు, అసత్య ప్రచారాలంటూ దుమ్మెత్తి పోశారు. పైపెచ్చు వారం వారం రోడ్ల పరిస్థితిపై జగన్ సమీక్షలు నిర్వహించారు. అద్దాల్లాంటి రోడ్లు.. సాఫీ ప్రయాణం అంటూ గప్పాలు కొట్టుకున్నారు.
నాలుగు రోజులు వానలు పడ్డాయో లేదో ఏపీలో రోడ్ల బండారం బయట పడిపోయింది. ఈ మూడేళ్లలో చిన్న గుంత కూడా పూడ్చలేదని రుజువై పోయింది. ఇటీవలే చేసిన సమీక్షలో జూలై 15 నాటికి రోడ్లపై ఒక్క గుంత కూడా ఉండదని జగన్ ఆర్భాటంగా ప్రకటన కూడా చేశారు. నిజమే కాబోలు అనుకునే వారికి దిమ్మ తిరిగేలా వాస్తవ పరిస్థితి ఉంది. ఆయన చెప్పిన జూలై 15 వచ్చేసింది. నిజమే రోడ్లపై ఒక్క గుంత లేదు. బోలెడు గుంతలు ఉన్నాయి. ఇంచుమించు అడుగుకో గుంత ఉందంటే అతిశయోక్తి కాదు.
వర్షాలకు ఆ గుంతలు ఈత కొలనులను తలపిస్తున్నాయి. దాదాపు అన్ని పట్టణాలు, నగరాలు, పల్లెల్లో రోడ్ల పరిస్థితి ఇదే. ఎవరైనా హఠాత్తుగా చూస్తే ఇక్కడ రోడ్డేది.. అన్నీ నీటి కొలనులేగా అంటారు. ఆ గంతల రోడ్లపైనే, ఈ నీటి తటాకాల్లోనే అత్యంత ప్రమాకర పరిస్థితుల్లో వాహనదారులు ప్రయాణించాల్సి వస్తోంది. రోడ్లా..ఈత కొలనులా అంటూ నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో ఏపీలో రోడ్ల దుస్థితిపై ఫొటోలు పెట్టి మరీ ట్రోల్ చేస్తున్నారు. పోనీ ఇప్పుడైనా జగన్ సర్కార్ ఈ రోడ్ల మరమ్మతులు చేపడుతుందా అంటే ఆ అవకాశమే కనిపించడం లేదు. ఎందుకంటే ఇప్పటికే కాంట్రాక్టర్లకు కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. దీంతో పనులు చేయిద్దామని ప్రభుత్వం ఒక వేళ పొరబాటున అనుకున్నా.. చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాని పరిస్థితి ఏపీలో ఉంది. వైసీపీ నేతలే ప్రభుత్వ కాంట్రాక్టులా అయ్యబాబోయ్ అని పారిపోతున్న పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఏపీ రోడ్లను ‘ఏ దేవుడూ’ బాగు చేయలేడు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ap-roads-look-like-swimming-pools-25-139761.html
తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఏబీ వెంకటేశ్వరరావు తమిళనాడులో ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలను.. ముఖ్యంగా విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ సాధించిన విజయాలను ఏబీ వెంకటేశ్వరరావు ఆసక్తికరంగా విశ్లేషించారు. ఎవరూ ఊహించని మార్పులు రాజకీయాల్లో సంభవిస్తాయని, ప్రజలు మార్పును కోరుకున్నప్పుడు అసాధ్యం సుసాధ్యం అవుతుందని అన్నారు.
టీవీకే నేత ఆదవ అర్జునకు, వీసీకే అధినేత తిరుమావళవన్ స్వయంగా మద్దతు లేఖను అందజేశారు. ఈ కీలక పరిణామంతో అసెంబ్లీలో టీవీకే కూటమి సంఖ్యా బలం ఇప్పుడు 118కి చేరింది.
అధికారులు సచివాలయంలోని ఏసీ గదులలో కూర్చుని పని చేసే విధానానికి స్వస్థి చెప్పారు. అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ప్రసంగిస్తూ.. పౌరుల ఫిర్యాదులను నేరుగా క్షేత్రస్థాయిలో పరిష్కరించడానికి అధికారులు తమ కార్యాలయాలను విడిచిపెట్టి ప్రజల వద్దకు వెళ్లాలని ఆదేశించారు.
సువేందు అధికారి రాజకీయ నేపథ్యాన్ని పరిశీలిస్తే.. కాంగ్రెస్ సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన సువేందు, రాజకీయ ఓనమాలు అక్కడే నేర్చుకున్నారు. ఆయన తాత కెనరామ్ అధికారి స్వాతంత్ర్య సమరయోధుడు కాగా, తండ్రి శిశిర్ అధికారి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా రాణించారు. సువేందు అధికారి మమతా బెనర్జీ స్థాపించిన తృణమూల్ కాంగ్రెస్లో చేరి ఆ పార్టీలో కీలక నేతగా ఎదిగారు.
కరీంనగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై జరిగిన దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకత్వం బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో . శనివారం ( మే 9) ఉదయం నుండే నగరంలోని ప్రధాన కూడళ్లలో పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిరసనలో పాల్గొనకుండా పోలీసులు ఆయన ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీనిపై బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ముఖ్యంగా పార్టీలో అభిషేక్ బెనర్జీ పెత్తనం పెరగడం వల్లే సువేందు అధికారి వంటి బలమైన నేతలు టీఎంసీని వీడారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకులను కాదని, కార్పొరేట్ తరహా రాజకీయాలకు అభిషేక్ బెనర్జీ ప్రాధాన్యత ఇవ్వడం తృణమూల్కు ప్రతికూలంగా మారిందంటున్నారు.
ఆంధ్రోళ్లను తిట్టి ఓట్లు దండుకున్న బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి పాల్పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత ఎన్నికల ఫలితాలు కేరళలో పెను మార్పులకు నాంది పలికాయి. యూడీఎఫ్ స్పష్టమైన మెజారిటీ సాధించడంతో.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుగుతోంది. కేసీ వేణుగోపాల్ అనుభవం, రాహుల్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యం ఆయనకు ప్రధాన బలంగా మారాయి.
టీవీకే అధినేత విజయ్కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైనదిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూటమి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవకాశం వచ్చినా వారు వదిలిపెట్టినట్టే కనిపించదు. మొన్న కోట వినుత ఘటన, నిన్న అరవ శ్రీధర్ వ్యవహారం, ఇవాళ వర్మ ఇష్యూ.. ఇలా సమయం దొరికినపుడల్లా ఆయా అంశాలను బాగా హైలెట్ చేసి.. కూటమిలో ఏదో ఒక చిచ్చు రాజేయాలని చూస్తోంది వైసీపీ అధినాయకత్వం.