ఆంధ్రప్రదేశ్ పోలీసులకు ఏ నిబంధనలూ వర్తించవా.. ప్రభుత్వానికీ, తమకూ వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే సహించరు. అలా యిష్టారీతిగా వ్యవహరించడానికి ప్రభుత్వం వారికి లైసెన్స్ యిచ్చేసిందా? ఏమైనా తేడా జరిగితే కోర్టుల్లో చూసుకుందాం అన్న బరోసా యిచ్చేసిందా? అంటే రాష్ట్రంలో జరగుతున్న సంఘటనలూ, నెలకొన్న వాతావరణం చూస్తే ఔననే అనాల్సి వస్తోంది. తాజాగా ఏకంగా ఒక సీఐ కోర్టు నియమించిన అడ్వొకేట్ కమిషన్ గా నియమించిన లాయర్ ను చితక బాదారు. వివరాలిలా ఉన్నాయి.
ఒక వ్యక్తి అక్రమ నిర్బంధం విషయంలో ఏపీ హైకోర్టు నియమించిన అడ్వొకేట్ కమిషన్ అడ్వకేట్ ఉదయ సింహారెడ్డి, తన కోర్టు సిబ్బందితో వెళ్లారు. అక్రమ నిర్బంధంలో ఉన్న వ్యక్తి పీఎస్ లో చిత్రహింసలకు గురయ్యాడని గుర్తించిన జ్యుడీషిల్ అధికారి ఉదయ సింహ అతడిని మరుసటి రోజు కోర్టులో హాజరు పర్చాల్సిందిగా అక్కడి పోలీసులకు చెప్పారు. అలాగే అందుకు సంబంధించిన నివేదికను హైకోర్టుకు సమర్పించనున్నట్లు తెలిపారు. ఈ దశలో పోలీసు స్టేషన్ లో ఉన్న సీఐ యిస్మాయిల్ పోలీసు సిబ్బంది లాయర్ ఉదయ సింహారెడ్డి, ఆయనతో వెళ్లిన యిద్దరు కోర్టు సిబ్బంది దాడి చేసి కొట్టారు. ఈ విషయంపై ఆయన కోర్టును ఆశ్రయించారు. దీనిపై ఏపీ హైకోర్టు సుమో పిల్ నమోదు చేసింది.
ఆ కేసు సోమవారం (మే 8) విచారణకు వచ్చింది. ఈ కేసు విచారణ ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా హిందూపురం సీఐ యిస్తాయిల్ పై పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు నియమించిన కమిషన్ పై చేయి చేసుకోవడానికి సీఐకి ఎంత ధైర్యం అని వ్యాఖ్యానించింది. కోర్టు పాలనా విధులకు ఆటంకం కలిగించడమేనని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు. తక్షణమే సిఐ యిస్మాయిల్ పై కోర్టు ధిక్కరణ కింద అభియోగాలు నమోదు చేయాల్సిందిగా ఆదేశించింది.
కాగా ఏపీలో ప్రభుత్వం కోర్టు ధిక్కరణకు పాల్పడడాన్ని పెద్ద సీరియస్ గా తీసుకోని పరిస్థితి కనిపిస్తోంది. అందుకే పెద్ద సంఖ్యలో అధికారులపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. యిటీవలే కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారంటూ యిద్దరు ఆర్టీసీ అధికారులకు కోర్టు జైలు శిక్ష , జరిమానా కూడా విధించింది. యిప్పుడు సీఐ ఏకంగా కోర్టు నియమించిన జ్యుడీషియల్ అధికారిపైనే చేయి చేసుకోవడం సంచలనంగా మారింది.
యిప్పటికే న్యాయమూర్తుల్ని బూతుల్ని తిట్టిన కేసు సీబీఐ దర్యాప్తులో నత్తనడకన సాగుతోంది. మొత్తం మీద ఏపీలో అరాచకం రాజ్యమేలుతోందన్న పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా జ్యుడీషియల్ అధికారిపై సీఐ చేయిచేసుకున్నసంఘటనలో హై కోర్టు సీరియస్ అయ్యింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ap-police-wount-leave-judicial-officers-also-39-154972.html
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద, పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్షిప్ కాంక్లేవ్లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.