Publish Date:Mar 17, 2024
ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్ పాలన అంతం కోరుకుంటున్నారా? వచ్చే ఎన్నికలలో వారు అన్ కండీషనల్ గా ఎన్డీయే కూటమికే ఓటు వేయాలన్న నిర్ణయానికి వచ్చేశారా? అంటే చిలకలూరి పేటలో ఆదివారం (మార్చి 17) సాయంత్రం జరిగిన ప్రజాగళం సభ తరువాత మోడీ వరుస ట్వీట్లు చేస్తే ఔననే అనిపిస్తున్నది. నిజం. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రధాని మోడీ ప్రజాగళం సభలో ప్రసంగించిన తరువాత గంటల వ్యవధిలోనే తన ఎక్స్ ఖాతా వేదికగా వరుస ట్వీట్లు చేశారు.
అభివృద్ధి కోసం, అవినీతి రహిత పాలన కోసం ఏపీ జనం ఈ సారి ఎన్నికలలో ఎన్డీయే కూటమికే ఓటు వేయాలన్న నిర్ణయానికి వచ్చేశారని ఆయన పేర్కొన్నారు. అంతకు ముందు ప్రజాగళం సభలో ఆయన తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు, జనసేనాని పవన్ కల్యాణ్ లతో కలిసి వేదిక పంచుకున్నారు. ఆ సభలో ఆయన మాట్లాడుతూ గత ఐదేళ్ల జగన్ పాలన మొత్తం అవినీతి మయం అని విమర్శించారు. ప్రజలు జగన్ పాలనను అంతం చేసి ఎన్డీయేకు పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. అయితే సభ ముగిసిన తరువాత గంటల వ్యవధిలోనే ఆయన తన ఎక్స్ ఖాతాలో వరుస పోస్టింగులు పెట్టడం విస్తుగొలిపింది. సభకు వచ్చిన ప్రజాస్పందనకు ముగ్ధుడైన మోడీ.. ఏపీ ప్రజలు జగన్ పాలనకు తెరదించడానికి నిర్ణయం తీసేసుకున్నారని ఫిక్స్ అయ్యారని బీజేపీ శ్రేణులే కాదు, ఆయన పోస్టులు చూసిన పరిశీలకులు సైతం చెబుతున్నారు.
ప్రజాగళం సభ ముగిసిన అనంతరం మోడీ చేసిన ట్వీట్లు ఇలా ఉన్నాయి.
మొదటి ట్వీట్ లో ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు ఎన్డీయేకు మద్దతుగా నిలవాలని నిర్ణయించేసుకున్నారు. ఎన్డీయే అభివృద్ధి అజెండాకే వచ్చే ఎన్నికలలో ఓటు వేయాలని డిసైడైపోయారు. పల్నాడులో ప్రజాగళం సభ అదే చెప్పిందని పేర్కొన్నారు. ఆ తరువాత కొద్ది సేపటికే మరో ట్వీట్ చేసిన ప్రధాని ఆ ట్వీట్ లో చిలకలూరి పేట సభ ఘన విజయం ఎన్డీయేకు ప్రజా మద్దతును ఎలుగెత్తి చాటింది. తెలుగుదేశం, జనసేన, బీజేపీలు మాత్రమే అభివృద్ధి చేయగలవనీ, వైసీపీ అవినీతి, దుష్టపాలనకు వ్యతిరేకంగా జనం ఆ జగన్ ప్రజావ్యతిరేక పాలనకు చరమగీతం పాడాలన్న నిశ్చయంతో ఉన్నారనీ పేర్కొన్నారు. ఇక ఆ తరువాత చేసిన ట్వీట్ లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ప్రజలు ఎన్డీయే ఎంపీలు, ఎమ్మెల్యేలనూ అధికసంఖ్యలో ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు.
ఆ తరువాత కొద్ది సేపటికే తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కు నివాళులర్పిస్తూ చేసిన ట్వీట్ లో ఏపీ పురోగతి కోసం ఎన్టీఆర్ దార్శనికతను కొనియాడారు. ఆయన ఆశయాల సాధనకు ఎన్డీయే పని చేస్తుందని హామీ ఇచ్చారు. ఆ తరువాతి ట్వీట్ లో ఆయన ఏపీ ప్రజలు వైసీపీని ఓడించాలి, ఎన్డీయేకు ఓటు వేయాలన్న విషయాలలో స్పష్టంగా ఉన్నారని పేర్కొన్నారు. ఆ తరువాత అవే ట్వీట్లను ప్రధాని మోడీ తెలుగులో కూడా పోస్టు చేశారు. మొత్తం మీద చిలకలూరి పేట సభకు వచ్చిన ప్రజాస్పందన సందేహాలకు అతీతంగా వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలన్న ప్రజా నిర్ణయాన్ని నిర్ద్వంద్వంగా చాటిందని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ap-people-decided-to-vote-out-jagan-25-172276.html
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్కతాలోని కాళీఘాట్లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.