ఆలయాల పేరుతో డేంజర్ గేమ్! ఏపీని కాపాడుకున్న చంద్రబాబు 

Publish Date:Feb 6, 2021

Advertisement

ఆలయాలపై  దాడుల వెనక రాజకీయ కుట్ర ఉందా? ఒక పార్టీని బలహీనం చేయాలనే వ్యూహం ఉందా?  ఏపీలో  కొంత కాలంగా  జరిగిన వరుస పరిణామాలతో ఇవే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే తాజాగా జరుగుతున్న పరిణామాలతో ఆ అనుమానాలు నిజమేనని భావించాల్సి  వస్తోంది. వైసీపీ సర్కార్ వచ్చాకా ఆలయాలపై వరుసగా దాడులు జరిగాయి. వందలాది ఆలయాలను దండుగులు టార్గెట్ చేశారు. అంతర్వేది రథం దగ్ధం, కనకదుర్గ అమ్మవారి వెండి రథం సింహాలు మాయం వంటి ఘటనలు జరిగాయి. రామతీర్థంలోని కోదండ రామాలయంలో రాముడి విగ్రహాన్ని ముక్కలు చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఆలయాలపై దాడులతో జనాల్లో కూడా అలజడి వచ్చింది. ఆ సమయంలోనే దీనివెనుక రాజకీయ కోణం ఉందన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. రామతీర్థం ఘటనపై సీరియస్ గా స్పందించింది టీడీపీ. చంద్రబాబు రామతీర్థం వెళ్లి ధ్వంసమైన విగ్రహాన్ని పరిశీలించారు. ఆ తర్వాత రాష్ట్రంలో ఆలయాలపై దాడులు ఒక్కసారిగా ఆగిపోయాయి. అంతకు ముందు రోజూ ఏదో ఒక చోట ఆలయాలపై దాడులు జరగగా.. చంద్రబాబు  రామతీర్థం వెళ్లిన తర్వాత ఆగిపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 

ఆలయాలపై జరిగిన దాడుల ఘటనలపై జగన్ సర్కార్ స్పందించిన తీరు అనుమానాలకు తావిచ్చింది. రథాలు తగలబడితే తేనేటీగలు కారణమని, ఆలయాలపై దాడులు జరిగితే పిచ్చోడి చర్య అని, విగ్రహాల విధ్వంసం గుప్తనిధుల వేటగాళ్ల పనేనని వైసీపీ ప్రభుత్వం వివరణ ఇస్తూ వచ్చింది.  ఆంజనేయ స్వామి చెయ్యి విరిగితే రక్తం వస్తుందా? రాముడి విగ్రహం తల తెగిపడితే ప్రాణం పోతుందా? అని  మంత్రి కొడాలి నాని లాంటి వారు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. దీంతో విభజించు.. ఓట్లు పట్టు అనే సిద్ధాంతంతో టీడీపీ టార్గెట్ గా బీజేపీ, వైసీపీ గేమ్ ఆడుతున్నాయనే చర్చ వచ్చింది. ఆలయాలపై దాడులు జరుగుతుండటంతో హిందువుల్లో వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఇదే అదనుగా  హిందుత్వ పార్టీగా ముద్రపడిన బీజేపీ.. హిందువులకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోందనే  అనుమానాలు వచ్చాయి. మతాలుగా ఓట్లను చీల్చి, వాటిని రెండు పార్టీలు పంచుకొని  ఏపీలో టీడీపీని నిర్వీర్యం చేసే ప్రయత్నం జరుగుతుందని రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడ్డారు. 

తెలంగాణలోని గ్రేటర్ ఎన్నికల్లో మత రాజకీయాలే రాజ్యమేలాయి. బీజేపీ, ఎంఐఎం పార్టీలు హిందూ, ముస్లిం అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాయి. మత పరమైన విమర్శలతో గ్రేటర్ ఎన్నికల్లో రెండు పార్టీలు లబ్దిపొందాయి. ఎప్పటిలానే మెజారిటీ ముస్లిం ఓట్లు ఎంఐఎంకు పడగా.. బీజేపీ అనూహ్యంగా  35 శాతానికి పైగా ఓట్లు సాధించింది. మత పరమైన వ్యాఖ్యలతో ఇతర పార్టీలకు వెళ్లాల్సిన హిందూ ఓట్లను రాబట్టడంలో బీజేపీ సక్సెస్ అయింది. అదే సమయంలో గ్రేటర్ లో గతంలో బలంగా ఉన్న కాంగ్రెస్, టీడీపీ లు పూర్తిగా వెనకబడి పోయాయి. ఓటర్లు మత పరంగా చీలడం వల్లే కాంగ్రెస్, టీడీపీకి భారీగా నష్టం జరిగిందని ఫలితాల తర్వాత తేలింది. గ్రేటర్ ఎన్నికల వ్యూహాన్నే ఏపీలో వైసీపీతో కలిసి బీజేపీ అమలు చేస్తుందని అంటున్నారు. గ్రేటర్ లో ఎలాగైతే మెజారిటీ ముస్లిం ఓటర్లు ఎంఐఎం వైపు ఉంటారో.. అలాగే ఏపీలో మెజారిటీ క్రిస్టియన్, ముస్లిం ఓటర్లు వైసీపీ వైపు ఉంటారు. ఇక్కడ కూడా బీజేపీ బలపడాలంటే హిందూ ఓట్లను తన వైపు తిప్పుకోవాలి. అదే జరిగితే ఏపీలో టీడీపీ భవిష్యత్ ప్రశ్నార్థకమే. ఈ ప్రయత్నమే  ఏపీలో జరిగిందని అంటున్నారు.  

ఏపీలో జరుగుతున్న రాజకీయ కుట్రలను గమనించడం వల్లే కరోనాతో 9 నెలలుగా క్షేత్రస్థాయిలో పర్యటించని చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగారంటున్నారు. చంద్రబాబు రామతీర్థం వెళ్లడమే కాదు..  అక్కడ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. హిందూ నినాదం బలంగా వినిపించారు. హిందూ భక్తులమని చెప్పుకునే బీజేపీ నేతల కంటే తీవ్రంగా మాట్లాడారు టీడీపీ అధినేత. జగన్ రెడ్డి పాలనలో హిందూ ఆలయాలకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించిన చంద్రబాబు.. హిందూ ఆలయాల జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రామ తీర్థంలో చంద్రబాబు ప్రసంగం విన్న తర్వాత బీజేపీ నేతలే షాకయ్యారని చెబుతున్నారు. చంద్రబాబు హిందూ వాదం గట్టిగా వినిపించడంతో కమలనాధులు కలవరపడ్డారని తెలుస్తోంది. హిందూ ఆలయాలపై జరుగుతున్న దాడులను అస్త్రంగా మలుచుకుని బలపడాలని చూసిన తమకు చంద్రబాబు దెబ్బ కొట్టారనే చర్చ బీజేపీ నేతల్లో జరిగిందంటున్నారు. తమ కంటే హిందూ సమాజంలో చంద్రబాబే హీరోగా నిలిచారనే అభిప్రాయానికి వచ్చారట. అంతేకాదు చంద్రబాబు రామతీర్థం వెళ్లి రాగానే  ఆలయాలపై దాడులు ఆగిపోయాయి. దీంతో దాడుల వెనక రాజకీయ కుట్ర ఉందనే వాదన బలంగా వినిపిస్తోంది.   

 ఏపీలో  ఆలయాలపై జరుగుతున్న దాడులు, రాజకీయ పరిణామాలు ప్రమాదకరంగా ఉన్నాయని గ్రహించడం వల్లే   పీఠాధిపతులు, ఉత్తరాధికారులు సాధుసంతులు ఏకమయ్యారని తెలుస్తోంది.  ఆంధ్ర-తమిళనాడు సరిహద్దులోని పొన్పాడి గ్రామం శివారులోని కంచిపీఠానికి చెందిన ఓ ఆశ్రమంలో సనాతన ధర్మ పరిరక్షణ పేరిట బుధవారం సదస్సు జరిగింది. ఏపీ, తమిళనాడుకు చెందిన పీఠాధిపతులు, ఉత్తరాధికారులు సమావేశమై పలు నిర్ణయాలు తీసుకున్నారు. కంచికామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి, దక్షిణామ్నాయ శృంగేరి జగద్గురు పీఠాధిపతి భారతీతీర్థ మహాస్వామి ప్రతినిధి గౌరీశంకర్‌, హంపీ విద్యారణ్య మహాసంస్థాన పీఠాధిపతి విద్యారణ్య భారతి, పుష్పగిరి పీఠాధిపతి విద్యాశంకర భారతి, తుని సచ్చిదానం తపోవన పీఠాధిపతి సచ్చిదానంద సరస్వతి, అహోబిల మఠాధిపతి రంగనాథ యతీంద్ర మహాదేశికన్‌ స్వామి, ముముక్షుజన మహాపీఠాధిపతి ముత్తీవి సీతారాం,  తదితరులు పాల్గొన్నారు. ఏపీలో హిందూ సమాజంపై జరుగుతున్న దాడుల గురించి విస్తృతంగా చర్చించారు. కంచికామకోటి శంకర పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి స్వామి ఆధ్వర్యంలో తిరుపతి వేదికగా త్వరలోనే మహాసభ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 
  
 మొత్తంగా ఏపీలో ఆలయాలపై వరుసగా జరిగిన దాడుల వెనక రాజకీయ కుట్ర ఉందనే విషయం తాజా పరిమాణాలతో స్పష్టమవుతోంది. టీడీపీని టార్గెట్ చేయడానికి ఆలయాల పేరుతో ప్రమాదకరమైన గేమ్ ఆడారని తెలుస్తోంది. ఇప్పుడు అన్ని నిజాలు తెలుస్తుండటంతో ఏపీ ప్రజలు షాకవుతున్నారు. ఓట్ల రాజకీయం కోసం ఇంత నీచానికి దిగజారుతారా, ప్రజల మధ్య చిచ్చు పెడతారా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. మరోవైపు చంద్రబాబు సీరియస్ గా స్పందించడం వల్లే రాష్ట్రంలో శాంతి నెలకొందనే చర్చ కూడా జరుగుతోంది. చంద్రబాబు రామ తీర్థం వెళ్లి ఘాటుగా మాట్లాడకపోతే... రాష్ట్రం అత్యంత ప్రమాదకరస్థితికి వెళ్లేదనే అభిప్రాయం రాజకీయ నిపుణుల నుంచి వస్తోంది.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.