Publish Date:Jan 30, 2025
ఆంధ్రప్రదేశ్ కొత్త డీజీపీగా హరీశ్ గుప్తాను నియమిస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత డీజీపీ ద్వారకా తిరుమలరావు పదవీకాలం ఈ నెల 31వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో హరీశ్ గుప్తాను కొత్త డీజీపీగా నియమించింది. ఈయన గతంలో కూడా ఒక సారి రాష్ట్ర డీజీపీగా పని చేశారు. గత ఏడాది ఎన్నికల సమయంలోనూ హరీశ్ గుప్తాను ఎన్నికల సంఘం డీజీపీగా నియమించిన సంగతి తెలిసిందే. ఆ తరువాత కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తరువాత ద్వారకా తిరుమలరావును డీజీపీగా నియమించింది.
ఇప్పుడు మళ్లీ రాష్ట్ర ప్రభుత్వం హరీష్ గుప్తాను డీజీపీగా ఎంపిక చేసింది. 1992 బ్యాచ్కు చెందిన ఈయన ప్రస్తుతం విజిలెన్స్ డీజీగా ఉన్నారు. ఒక సారి డీజీపీగా పని చేసిన అధికారికి మరోసారి డీజీపీగా బాధ్యతలు అప్పగించడం చాలా చాలా అరుదుగా జరుగుతుంటుంది. ఈ కారణంగా ఏపీ డీజీపీగా హరీష్ కుమార్ పగ్గాలు చేపట్టనుండటం ప్రత్యేకతను, ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రస్తుతం కొత్తగా డీజీపీ బాధ్యతలు చేపట్టనున్న హరీష్ కుమార్ గుప్తాను గత ఎన్నికల సమయంలో ఎన్నికల సంఘం ఏపీ డీజీపీగా ఎంపిక చేసింది. అప్పటి వరకూ రాష్ట్ర డీజీపీగా ఉన్న కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిని తప్పించి హరీష్ కుమార్ ను ఎంపిక చేసింది. దీంతో హరీష్ కుమార్ 2024 మే 6 నుంచి 2024 జూన్ 19 వరకు ఆయన డీజీపీగా ఉన్నారు.
హరీష్ కుమార్ గుప్తా 1992 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారి. జమ్మూ కాశ్మీర్ కు చెందిన ఈయన కెరీర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఖమ్మం జిల్లా ఏఎస్పీగా మొదలైంది. ఆ తరువాత ఆయన మెదక్, పెద్దపల్లి లలొఏఎస్పీగా పని చేశారు. అదనపు ఎస్పీగా కరీంనగర్లో పని చేశారు. కృష్ణా, నల్గొండ జిల్లాల్లో ఎస్పీగా పని చేసిన ఆయన ఆ తరువాత సీఐడీలో ఎస్పీగా పని చేశారు.
ఇక 2017 నుంచి 2019 వరకు లా అండ్ ఆర్డర్ విభాగంలో అడిషనల్ డీజీగా పని చేసిన హరీష్ కుమార్ గుప్తా ఆ తరువాత పోలీసు రిక్రూర్మెంట్ బోర్డు చైర్మన్గాను, హోం శాఖ ముఖ్య కార్యదర్శిగాను పని చేశారు. ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం డీజీగా ఉన్నారు. ఈ మధ్యలో ఆయన హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో సౌత్జోన్ డీసీపీగా పని చేశారు. తర్వాత విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మంట్ విభాగానికి డీఐజీగా కూడా విధులు విర్వర్తించారు. అలాగే గుంటూరు రేంజ్ ఐజీగాను బాధ్యతలు నిర్వర్తించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ap-new-dgp-harish-kumar-gupta-career-progressed-like-39-192063.html
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.