ఎవరీ హరీష్ కుమార్ గుప్తా.. ఈసీ ఆయన్నేఏపీ డీజీపీగా ఎందుకు నియ‌మించింది?

Publish Date:May 6, 2024

Advertisement

ఆంధ్రప్రదేశ్ నూత‌న‌ డీజీపీగా హ‌రీశ్ కుమార్ గ‌ప్తాను ఎన్నిక‌ల సంఘం నియ‌మించింది. ఆయన సోమవారం (మే6) బాధ్యతలు చేపట్టారు. ఏపీ డీజీపీగా కొన‌సాగుతున్న రాజేంద్ర‌నాథ్ రెడ్డిపై ఎన్నిక‌ల సంఘం ఆదివారం బ‌దిలీ వేటు వేసిన విష‌యం తెలిసిందే. ఆయ‌న అధికార వైసీపీ పార్టీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని విప‌క్షాల నుంచి ఈసీకి అనేక ఫిర్యాదులు వెళ్లాయి. ఫిర్యాదుల‌పై విచార‌ణ జ‌రిపిన ఈసీ.. రాజేంద్ర‌నాథ్ రెడ్డి డీజీపీగా కొన‌సాగితే ఏపీలో ఎన్నిక‌లు ప్ర‌శాంత వాతావ‌ర‌ణంలో జ‌ర‌గ‌వ‌ని భావించి ఆయ‌న‌పై బ‌దిలీ వేటు వేసింది. కొత్త డీజీపీగా హ‌రీశ్ కుమార్ గుప్తాను నియ‌మించింది. ఆయ‌న సోమ‌వారం (మే6)సాయంత్రం ఏపీ నూత‌న డీజీపీగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. అయితే అసలు హ‌రీశ్ కుమార్ గుప్తా ఎవ‌రు? ఆయన ఏ రాష్ట్రానికి చెందిన వ్య‌క్తి. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఐపీఎస్ అధికారుల్లో సీనియారిటీ లిస్ట్ లో హ‌రీశ్ ఆరో స్థానంలో ఉన్నారు. తొలి ఐదుగురిని కాద‌ని ఈసీ హ‌రీశ్ కుమార్ గుప్తానే ఎందుకు నూత‌న డీజీపీగా ఎంపిక చేసింది అనే చ‌ర్చ ఏపీ అధికార వ‌ర్గాల్లో జ‌రుగుతున్నది. ప్ర‌స్తుతం ఏపీలో ఉన్న ప‌రిస్థితుల నేప‌థ్యంలో హ‌రీశ్ కుమార్ గుప్తా అయితేనే ఎన్నిక‌ల‌ను ప్ర‌శాంత వాతావ‌ర‌ణంలో స‌మ‌ర్ధ‌వంతంగా నిర్వ‌హించ‌గ‌ల‌ర‌ని ప‌లు అంశాల‌ను బేరీజు వేసుకొని ఈసీ ఓ నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే హ‌రీశ్ కు ఏపీ నూత‌న డీజీపీగా బాధ్య‌త‌లు అప్ప‌గించింది. 

ఏపీ నూత‌న డీజీపీగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన హ‌రీశ్ కుమార్ గుప్తా 1992 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారి. ఆయ‌న జ‌మ్మూ అండ్ కాశ్మీర్ కు చెందిన వ్య‌క్తి. ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు చెందిన సీనియ‌ర్ ఐపీఎస్ అధికారుల లిస్టులో మొద‌టి స్థానంలో ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు ఉన్నారు. కానీ, ఆయ‌న స‌స్పెన్షన్ పై క్యాట్ విచార‌ణ‌ జరుగుతోంది. దీంతో ఆయ‌న పోస్టింగ్ కు అవ‌కాశం లేకుండా పోయింది. రెండో స్థానంలో ద్వార‌కా తిరుమ‌ల‌రావు ఉన్నారు. తొలుత ఆయ‌న్నే నూత‌న డీజీపీగా ఈసీ ఎంపిక చేస్తుంద‌ని అంద‌రూ భావించారు. కానీ, అంద‌రి అంచ‌నాల‌ను త‌ల‌కిందులు చేస్తూ హ‌రీశ్ కుమార్ గుప్తాను ఏపీ నూత‌న డీజీపీగా ఈసీ నియ‌మించింది. హ‌రీశ్ కుమార్ గుప్తా ఎవ‌రు? ఆయ‌న గ‌తంలో ఎక్క‌డెక్క‌డ ప‌నిచేశారు.. ? ఏపీలో ఏఏ విభాగాల్లో ఆయ‌న ప‌నిచేశార‌నే విష‌యాల‌ను చూస్తే.. 

1992లో ఐపీఎస్ అధికారిగా ఆయ‌న బాధ్య‌త‌లు స్వీక‌రించారు. 
1994లో ఖ‌మ్మం జిల్లా అడిష‌న‌ల్ ఎస్పీగా ప‌నిచేశారు.
 1995లో మెద‌క్ జిల్లా ఏఎస్పీగా ప‌నిచేశారు.
 1996లో క‌రీంన‌గ‌ర్ జిల్లా ఏఎస్పీగా ప‌నిచేశారు.
1999లో   తొలిసారి ఆయ‌న‌కు ప‌దోన్న‌తి ల‌భించింది. కృష్ణా జిల్లా ఎస్పీగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన ఆయ‌న 2002 సంవ‌త్స‌రం వ‌ర‌కు అక్క‌డే  ప‌నిచేశారు.
 2002 సంవ‌త్స‌రంలో యూస‌ఫ్ గూడ‌లోని ఫ‌స్ట్ బెటాలియ‌న్ సూప‌ర్ క‌మాండెంట్ గా వెళ్లారు. 
ఆరు నెల‌ల త‌రువాత 2002లోనే సీఐడీ ఎస్పీగా ప‌నిచేశారు. 
2004లో హైద‌రాబాద్ సౌత్ జోన్ డీసీపీగా ప‌నిచేశారు. 
2006 నుంచి 2011 సంవ‌త్స‌రం వ‌ర‌కు న‌ల్గొండ జిల్లా ఎస్పీగా ప‌నిచేశారు. 
2011 నుంచి 2012 వ‌ర‌కు విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ డీఐజీగా ప‌నిచేశారు.
 2012 నుంచి 2016 వ‌ర‌కు గుంటూరు రేంజ్ ఐజీగా ప‌నిచేశారు. 
2016లో టెక్నిక‌ల్ స‌ర్వీస్ ఐజీ కొన్నాళ్లు.. లా అండ్ ఆర్డ‌ర్ ఐజీగా కొన్నాళ్లు ప‌నిచేశారు. 
2019లో  వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత లా అండ్ ఆర్డ‌ర్ అడిష‌న‌ల్ డీజీగా ప‌నిచేశారు. 
2022లో ఎస్ఎల్‌పీఆర్‌బి  చైర్మ‌న్ బాధ్య‌త‌లు చేప‌ట్టిన ఆయ‌న కొద్ది నెల‌ల‌కే రైల్వేలో అడిష‌న‌ల్ డీజీపీగా ప‌నిచేశారు. 
2023 మే నెల‌లో హోంశాఖ కార్యదర్శిగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు.

 2024 మే 6న ఏపీ నూత‌న డీజీపీగా హ‌రీశ్ కుమార్ గుప్తాకు బాధ్య‌త‌లు అప్ప‌గిస్తూ ఈసీ ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఆయ‌న వెంట‌నే డీజీపీగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు.

By
en-us Political News

  
వైసీపీ మాచర్ల సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మరో మూడు కేసుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మంగళవారం (మే28) షరతులతో కూడిన బెయిలు మంజూరు చేసింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసిన సంఘటనపై ఆయనపై నమోదైన కేసులో ఇప్పటికే హైకోర్టు కండీషన్డ్ బెయిలు మంజూరు చేసిన సంగతి తెలిసిందే.
వైసీపీలో వున్న ప్రతి అడ్డమైన వాడికీ ఒక దిక్కుమాలిన ముహూర్తం దొరికింది. ప్రతివాడూ ఆ ముహూర్తానికి జగన్ ప్రమాణ స్వీకారం వుంటుందని చెబుతూ నోటి తుత్తర తీర్చుకుంటున్నారు. ఆ బ్యాచ్‌లో ఇప్పుడు గోరంట్ల మాధవ్ కూడా చేరాడు.
మరికాసేపట్లో పేలి పోతుంది అంటూ పోలీస్ కంట్రోల్ రూమ్ కి అగంతకుడు ఫోన్ కాల్ చేశాడు. ప్రజా భవన్‌కు బాంబు బెదిరింపు కాల్ రావడంతో అప్రమత్తమైన పోలీసులు, బాంబ్ స్వ్కాడ్ బృందాలు హుటాహుటీన చేరుకుని తనిఖీలు చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడి తెలంగాణ డిప్యూటీ భట్టి విక్రమార్క నివాసం ఉంటున్నారు. బాంబు బెదిరంపుతో సిబ్బంది అప్రమత్తం అయ్యారు. సిబ్బంది సహా అందరినీ భవన్ నుంచి ఖాళీ చేయించి బాంబ్‌ స్క్వాడ్‌ తనిఖీలు జరుపుతోంది.  మరోవైపు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఫోన్‌ చేసిన ఆగంతకుడిని ట్రేస్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
సీఎస్ జవహర్ రెడ్డి నిబంధనలకు నిలువుపాతరేసి.. అడ్డగోలుగా జగన్ తో అంటకాగిన జవహర్ రెడ్డి ఇప్పుడు పూర్తిగా ఒంటరి అయిపోయారు. ఇటు అధికారులు, అటు ప్రభుత్వ పెద్దలు ఎవరకూ కూడా ఆయనకు మద్దతుగా నోరు మెదపడం లేదు.
మద్యం కుంభకోణం కేసులో నిందితులకు ఇప్పట్లో బెయిల్ లభించే అవకాశాలు కనిపించడం లేదు.బెయిల్ పొడిగింపు కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్‌కు చుక్కెదురైంది.
సార్వత్రిక ఎన్నికలు ముగింపు దశకు వచ్చాయి. వచ్చే నెల 1న జరిగే తుదివిడత పోలింగ్ తరువాత జూన్ 4న ఫలితాలు వెలువడటమే తరువాయి. ఇప్పటి వరకూ జరిగిన ఆరు విడతల పోలింగ్ తరువాత పరిశీలకులు, రాజకీయపండితులు ఒక అంచనాకు అయితే వచ్చేశారు.
ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమై స్ట్రాంగ్ రూంలలో భద్రంగా ఉంది. ఫలితాలు వచ్చే నెల 4న వెలువడతాయి. ఈ ఎన్నికలలో గెలిచి అధికారం చేపట్టబోయేది ఎవరు? పరాజయం పాలై ఇంటికి చేరేదెవరు అన్నది తేలడానికి మరో ఎనిమిది రోజులు మాత్రమే ఉంది.
వైసీపీ వర్గాలు కూడా వేణు స్వామి మీద గుర్రుగా వుండటంతో, ముఖ్యంగా వాళ్ళకి దొరక్కుండా వుండాలని వేణు స్వామి అబ్ స్కాండ్ అయినట్టు  తెలుస్తోంది. 
హైదరాబాద్ బిల్డర్ ఒకరు కర్ణాటకలో గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్ జీడిమెట్లకు చెందిన కుప్పాల మధు (48) బిల్డర్. ట్రావెల్స్ వ్యాపారం కూడా నిర్వర్తిస్తున్నారు. వ్యాపారం కోసం తరచూ బీదర్ వెళ్లేవారు. ఎప్పట్లానే ఈ నెల 24న కుటుంబ సభ్యులకు చెప్పి బీదర్  బయలుదేరాడు. ఈ క్రమంలో డ్రైవింగ్ కోసం చింతల్‌కు చెందిన రేణుక ప్రసాద్ (32), వరుణ్, లిఖిత్ సిద్దార్థరెడ్డిని వెంట తీసుకెళ్లారు.
సార్వత్రిక ఎన్నికలు చివరిదశకు వచ్చాయి. ఏడు దశల్లో భాగంగా ఇక చివరి దశ మాత్రమే మిగిలింది. చివరి దశ పోలింగ్ వచ్చే నెల 1న జరగనుంది. స్వతంత్ర్య భారత చరిత్రలో ఎటువంటి ట్రెండ్ లేకుండా జరుగుతున్న సాధారణ ఎన్నికలు ఇవేనని అంటున్నారు.
నేడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టీ రామారావు జయంతి . ఈ సందర్భంగా  వేడుకలకు ఘనంగా తెలుగు తమ్ముళ్లు, అభిమానులు ఏర్పాట్లు చేశారు. ఇక ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలకు టీడీపీ నిర్ణయం తీసుకుంది. 
సీఎస్ జవహర్ రెడ్డి పక్షపాత వైఖరి కారణంగా జూన్ 4న కౌంటింగ్ సజావుగా జరిగేనా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అక్రమాలకు పాల్పడటమే కాకుండా, జగన్ కు అనుకూలంగా వ్యవహరిస్తూ ఎన్నికల వ్యవస్థనే ఏపీ సీఎష్ జవహర్ రెడ్డి అపహాస్యం చేస్తున్నారని తెలుగుదేశం నేత కనకమేడల రవీంద్రకుమార్ ఆరోపించారు.
తెలుగుదేశం పార్టీ స్థాపించిన తొమ్మిది నెల‌ల స్వ‌ల్ప కాలానికే ప్ర‌భుత్వాన్ని ఏర్పాటుచేసి, ముఖ్య‌మంత్రి పీఠాన్ని అధిరోహించిన నాయ‌కుడు ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఒకే ఒక్క‌డు.. శకపురుషుడు.. నంద‌మూరి తార‌క‌రామారావు. 1982 మార్చి నెలాఖ‌రులో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఆయ‌న 1983 జ‌న‌వ‌రి తొలి వారంలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో విజ‌య దుందుభి మోగించి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసి చ‌రిత్ర సృష్టించారు. ఈ రోజు మంగళవారం మే 28 ఆయన 101 జయంతి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.