Publish Date:Jun 13, 2023
ఏపీలో ఓ మంత్రి కి ఘోర పరాభవం ఎదురైంది. జీతాలు చెల్లించడం లేదంటూ ఏకంగా మంత్రి ఛాంబర్ కు సిబ్బంది తాళాలు వేసిన ఘటన చోటుచేసుకుంది. ఈ వ్యవహారం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన చర్చకు కారణమైంది. విషయం తెలిసి అధికార వైసీపీలోని కీలక నేతలు కూడా షాక్ కు గురయ్యారు. బిల్లులు చెల్లించలేదంటూ గ్రామాల్లోని సచివాలయాలకు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు తాళాలు వేసి, సిబ్బంది తమ నిరసన తెలపడం అప్పుడప్పుడు జరిగే విషయం. కానీ, జీతాలు చెల్లించ లేదంటూ ఏకంగా ఒక మంత్రి కార్యాలయానికి అక్కడ పనిచేసే సిబ్బంది తాళాలు వేశారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని సెక్రటేరియట్ లో చోటు చేసుకోగా, బీసీ సంక్షేమ, సినిమాటోగ్రఫీ, ఐ అండ్ పిఆర్ శాఖామంత్రిగా వ్యవహరిస్తున్న చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు ఈ పరాభవం ఎదురయింది. ఏపీ సెక్రటేరియట్ లోని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పేషీకి సిబ్బంది తాళం వేసి మూసి వేశారు. సచివాలయంలో పనిచేస్తున్న సిబ్బంది ఈ పని చేయడం గమనార్హం.
ఈ శాఖ పరిధిలో పని చేస్తున్న సిబ్బందికి ఎనిమిది నెలలుగా జీతాలు లేవంటూ ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఈ పని చేశారు. డిసెంబర్ నెల నుంచి జీతాలు చెల్లించకపోవడంతో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు విధులకు హాజరు కావడం లేదు. ఇప్పుడు ఏకంగా మంత్రి పేషీకి తాళం కూడా వేసి తమ నిరసనను తెలియజేశారు. సాధారణంగా మంత్రి పేషీ రోజూ తెరిచేవారు. అధికారులు సిబ్బంది వచ్చి తమ విధులను నిర్వర్తించేవారు. అయితే, ఎనిమిది నెలలుగా జీతాలు కూడా చెల్లించకపోవడంతో మనస్థాపానికి గురైన అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు.. మంత్రి చాంబర్ కు తాళం వేశారు. జీతాలు విషయం గురించి అధికార యంత్రాంగానికి, మంత్రికి ఎన్నిసార్లు చెప్పినా ఏమాత్రం స్పందించకపోవడంతో ఉద్యోగులు తీవ్రమైన మనస్థాపానికి గురై ఈ పని చేసినట్లు తెలుస్తోంది. తొమ్మిది నెలల నుంచి జీతాలు చెల్లించకపోవడంతో తాము ఎలా బతకాలో అర్థం కావడం లేదని, ఇప్పటికైనా తమ ఆవేదనను అర్థం చేసుకోవాలంటూ ఉద్యోగులు బావురుమంటున్నారు.జీతాలు చెల్లించక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న తాము మరో దారి లేక విధులకు హాజరు కావడం మానేశారు సదరు ఉద్యోగులు. డ్యూటీకి రాని సంగతి తెలిసినా అధికార యంత్రాంగం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో.. మంత్రి చాంబర్ కు తాళం వేసి వెళ్లిపోయారు. మంత్రి పేషీకి వేసిన తాళం ఎక్కడ ఉందో కూడా తెలియని పరిస్థితి నెలకొనడంతో పని చేయడానికి వచ్చిన ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో మంత్రి క్యాంపు కార్యాలయం వద్ద విధులు నిర్వహించే పరిస్థితి ఉద్యోగులకు ఏర్పడింది. ఏకంగా సెక్రటేరియట్ లోని మంత్రి పేషీ మూతపడడం ప్రస్తుతం సంచలనంగా మారింది. పరిపాలనకు సంబంధించిన అనేక కార్యక్రమాలు ఆగిపోయాయి. ఈ వ్యవహారంపై మంత్రితోపాటు ప్రభుత్వ ఉన్నతాధికారుల స్పందన ఎలా ఉండబోతుందనే విషయంపై సర్వత్రా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ap-minister-chamber-closed-for-not-pay-salalies-staff-39-156756.html
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద, పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్షిప్ కాంక్లేవ్లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.