జైలుకు ఏపీ మ‌హేష్ బ్యాంక్ డైరెక్ట‌ర్లు

Publish Date:Aug 31, 2022

Advertisement

కోర్టు ధిక్కరణ నేరం రుజువవడంతో హైదరాబాద్‌లోని ఏపీ మహేశ్‌ బ్యాంకు ఎండీ,సీఈవో సహా 11 మందికి హైకోర్టు జైలు శిక్ష విధించింది. 15 రోజుల సాధారణ జైలు శిక్ష, రూ.2 వేలు జరిమానా విధిస్తూ జస్టిస్‌ పి.నవీన్‌రావు ధర్మాసనం   తీర్పు వెలువరించింది. ఏపీ మహేశ్‌ కోఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంకు సొసైటీకి ఎన్నికలు నిర్వహించే విషయంలో సొసైటీకి చెందిన రెండు వర్గాల మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. ఓటర్ల జాబితా రూపకల్పనలో అక్రమాలు జరిగాయని, ఎన్నికల నిర్వహణను నిలిపేయాలని పలువురు కోర్టును ఆశ్రయించారు. 
విచారణ చేపట్టిన హైకోర్టు గత ఏడాది జనవరిలో కామన్‌ ఆర్డర్‌ జారీ చేసింది. ఎన్నికల ఫలితాలు ప్రకటించవచ్చనీ.. అయితే తదుపరి ఆదేశాలు జారీచేసే వరకు కొత్తగా ఎన్నికైన డైరెక్టర్లు ఎటువంటి విధానపరమైన నిర్ణయాలూ తీసుకోరాదని తెలిపింది. అయితే హైకోర్టు తీర్పునకు విరుద్ధంగా రూ.100 కోట్ల మేర రుణాలు జారీ చేశారని.. పేర్కొంటూ బ్యాంకు షేర్‌హోల్డర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ కోర్టు ధిక్కరణ వ్యాజ్యం దాఖలు చేసింది. వాదనలు విన్న ధర్మాసనం డైరెక్టర్ల బోర్డు కోర్టు ధిక్కరణ నేరానికి పాల్పడినట్లు నిర్ధారించింది. కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లు తేలినందున వారికి 15 రోజుల సాధారణ జైలుశిక్ష, రూ.2 వేల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది.

ఇప్పటి వరకూ వ్యక్తుల ఖాతాలపై దాడి చేసి దోచుకున్న నేరగాళ్లు ఏకంగా బ్యాంక్‌ సర్వర్‌నే హ్యాక్‌ చేశారు. మహేష్‌ కో-ఆపరేటివ్‌ బ్యాంకు సర్వర్‌ను హ్యాక్‌ చేసి రూ.12.90 కోట్లు లాగేశారు. బ్యాంకు సాంకేతిక సిబ్బంది స్పందించే లోపు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. బ్యాంకు మెయిన్‌ సర్వర్‌ను హ్యాక్‌ చేసిన సైబర్‌ నేరగాళ్లు దోచుకున్న మొత్తాన్ని 100 వేర్వేరు ఖాతాలకు బదిలీ చేసేశారు. ఈ కేసుని సవాల్ గా తీసుకున్న పోలీులు.. నిధులు కాజేసిన ప్రధాన సూత్రధారిని గుర్తించారు. నైజీరియా నుంచే బ్యాంకు సర్వర్లను హక్ చేసి డబ్బు కొట్టేసినట్లు కనుగొన్నారు. భారత్‌లో ఉండి నైజీరియన్ కి సపోర్ట్ చేసిన కీలక సూత్రధారి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 సైబర్ నేరగాళ్లు డబ్బుని బదిలీ చేసిన ఖాతాలన్నీ ప్రస్తుతం ఫ్రీజ్ అయి ఉన్నాయి. కోర్టులో కేసు నడుస్తోంది. అయితే కోర్టు అనుమతి లేకుండా బ్యాంకు లావాదేవీలు జరిపినట్లు కోర్టు దృష్టికి వచ్చింది. దీన్ని న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది. కోర్టు ఆదేశాలు ఉల్లంఘించినందుకు బ్యాంకు చైర్మన్ తో పాటు 10 మంది డైరెక్టర్లకు జైలు శిక్ష విధిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

By
en-us Political News

  
రాష్ట్రంలో ఐఏఎస్ అధికారులకు ఆదర్శంగా నిలవాల్సిన‌ ఏపీ సీఎస్ జ‌వ‌హ‌ర్ రెడ్డి భూబ‌కాసురుడిలా మారారా? విశాఖలో దళితుల అసైన్డ్ భూములను జవహర్ రెడ్డి కుమారుడు అప్ప‌నంగా మింగేయాలని ప్రయత్నించాడా? 2వేల కోట్ల రూపాయల భూముల‌ను కాజేసేందుకు స్కెచ్ వేశారా? అంటే అవున‌నే స‌మాధానమే వినిపిస్తోంది. జ‌వ‌హ‌ర్ రెడ్డి మ‌రో నెల‌రోజుల్లో సీఎస్ ప‌ద‌వి నుంచి రిటైర్డ్ కానున్నారు.. ఈ క్ర‌మంలో సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌హాయ‌ స‌హ‌కారాల‌తో జ‌వ‌హ‌ర్ రెడ్డి కుమారుడు, ప‌లువురు వైసీపీ ముఖ్య‌నేత‌లు అసైన్డ్ భుముల‌ను కాజేసే ప్ర‌య‌త్నం చేసిన‌ట్లు విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.
గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. రాజ్‌కోట్‌లో వున్న టి.ఆర్.పి. గేమ్ జోన్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో 22 మంది ప్రాణాలు కోల్పోయారు.
రిజల్ట్స్ కౌంట్‌డౌన్ కొటేషన్-10
వీళ్ళంతా కవిత విషయంలో చాలా రిలాక్స్.గా వున్నారు. కానీ, ఒక్క మనిషి మాత్రం కవిత అరెస్టు అయినప్పటి నుంచి కుమిలిపోతూ వున్నారు. ఆమె ఎవరో కాదు.. కవిత మాతృమూర్తి శోభ!
సార్వత్రిక ఎన్నికలలో భాగంగా శనివారం (మే 25) జరిగిన ఆరో విడత పోలింగ్ లో కాంగ్రెస్ అగ్రనేతలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు అయినా ఇంకా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలు అపరిష్కృతంగానే ఉన్నాయి. ఆందోళ‌న‌క‌ర‌మైన విష‌యం ఏమిటంటే ప‌దేళ్ల త‌ర్వాత విభ‌జ‌న చ‌ట్టంలోని ప‌లు అంశాల‌కు కాలం చెల్లుతుంది. అయిదే ఏపీ నేత‌లు త‌మ‌కేమీ ప‌ట్ట‌న‌ట్లు త‌డిబ‌ట్ట వేసుకొని నిద్దుర‌పోతున్నారు.
ఈ సారి సార్వత్రిక ఎన్నికల ఫలితాల తరువాత కేంద్రంలో ఎన్డీయే కూటమి కొలువుదీరినా ప్రధానిగా మోడీకి గతంలో ఉన్నంత సీన్ ఉండదా? అంటే ఆర్ఎస్ఎస్ వర్గాల నుంచి ఔనన్న మాటే వినిపిస్తోంది. గత ఎన్నికలలో బీజేపీ సొంతంగా గెలుచుకున్న సీట్ల కంటే ఈ సారి ఏ మాత్రం తగ్గినా మోడీ రీప్లేస్ మెంట్ విషయంలో బీజేపీలో, బీజేపీ పొలిటికల్ మెంటార్ అయిన ఆర్ఎస్ఎస్ లో విస్తృత చర్చ జరగడం ఖాయంగా కనిపిస్తోంది.
వైసీపీ నాయకురాలు రోజా ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీలోకి జంప్ అవబోతున్నారు. జగన్ చెవిలో రోజాపువ్వు పెట్టి, తాను చంద్రముఖి-3లా మారి లక లక లక అనబోతున్నారు.
రాజకీయ నాయకులు అధికారం తలకెక్కి ప్రజలను విస్మరిస్తే.. ఎంతటి నాయకుడికైనా పరాభవం తప్పదు. ప్రతిష్ట మసకబారక తప్పదు. అధకారంలో ఉండగా తనను తాను కారణజన్ముడిగా మిలినిన మనుషులంతా మామూలు జీవులేనన్న భావన తలకెక్కి వారిని చులకనగా చూస్తే.. జనం తగిన బుద్ధి చెబుతారు.
హీరో అల్లు అర్జున్ నంద్యాల పర్యటన సందర్భంగా భారీ సంఖ్యలో అభిమానులు గుమికూడడంతో కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) సీరియస్ గా స్పందించింది. భారీ జనసమీకరణ జరుగుతోందని సమాచారం అందించలేదనే కారణంతో ఇద్దరు కానిస్టేబుల్స్ పై చర్యలకు ఆదేశించింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఓట్ల లెక్కింపు తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ఎవరు అధికారంలోకి వస్తారు. ఏ పార్టీ పరాజయాన్ని మూటకట్టుకుంటుంది అన్న చర్చలతో పాటు మరో వ్యక్తి గురించి కూడా రాజకీయ, సినీ వర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆ వ్యక్తే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.
పొలం పనులు చేస్తుండగా కంటపడిన వజ్రాన్ని రైతు భద్రంగా ఇంటికి తీసుకెళ్లాడు. విషయం తెలిసి వ్యాపారులు ఆయన ఇంటి ముందు క్యూ కట్టారు. ఆ వజ్రాన్ని సొంతం చేసుకోవడానికి వ్యాపారులు పోటీ పడడంతో వేలం నిర్వహించారు. ఇందులో పెరవల్లికి చెందిన ఓ వ్యాపారస్థుడు రూ.5 లక్షల నగదు, 2 తులాల బంగారం ఇచ్చి ఆ రైతు నుంచి వజ్రాన్ని సొంతం చేసుకున్నాడు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.