ఏపీ లిక్కర్ టెండర్ స్కామ్..నిందితులకు రిమాండ్..!

Publish Date:Jul 21, 2026

Advertisement

 

ఏపీలో సంచలనం రేపిన మద్యం రవాణా టెండర్ స్కాం కేసు దర్యాప్తులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితులైన ఏ1 దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి, ఏ4 కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఏ8 కారుమూరి సునీల్‌లను సిట్ అధికారులు విజయవాడ ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు.ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ముగ్గురికి ఆగస్టు 3 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

ఇప్పటికే మరో కేసులో చంచల్‌గూడ జైలులో ఉన్న ఈ ముగ్గురు నిందితులను సిట్ అధికారులు పీటీ (ప్రిజనర్ ట్రాన్సిట్) వారెంట్‌పై విజయవాడకు తీసుకొచ్చారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం వారిని ఏసీబీ ప్రత్యేక కోర్టులో ప్రవేశపెట్టారు. విచారణ సందర్భంగా సిట్ తరఫు న్యాయవాదులు కోర్టుకు కీలక వివరాలు వెల్లడించారు. మద్యం రవాణా టెండర్ల ప్రక్రియలో నిబంధనలను ఉద్దేశపూర్వకంగా మార్చి, కొందరు సంస్థలకు అనుకూలంగా వ్యవహరించారని, బినామీ సంస్థలకు అక్రమంగా టెండర్లు కట్టబెట్టినట్లు ఆరోపించారు.

రవాణా ఛార్జీలను అనుచితంగా పెంచడం వల్ల ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ.192 కోట్ల మేర నష్టం వాటిల్లిందని సిట్ తన రిమాండ్ నివేదికలో పేర్కొంది. ఈ అక్రమాల కారణంగా ప్రభుత్వానికి భారీ ఆర్థిక నష్టం జరిగిందని, పలువురు అధికారులు, ప్రైవేటు వ్యక్తుల పాత్రపై దర్యాప్తు కొనసాగుతోందని సిట్ కోర్టుకు వివరించింది. అలాగే ఆర్థిక లావాదేవీలు, టెండర్ల మంజూరు ప్రక్రియ, నిధుల బదిలీలపై మరింత లోతుగా విచారణ చేపడుతున్నట్లు తెలిపింది.

మరోవైపు, నిందితుల తరఫు న్యాయవాదులు రిమాండ్ అవసరం లేదని, తమ క్లయింట్లపై చేసిన ఆరోపణలకు తగిన ఆధారాలు లేవని వాదించారు. అయితే ఇరుపక్షాల వాదనలు పరిశీలించిన ఏసీబీ ప్రత్యేక కోర్టు ముగ్గురిని ఆగస్టు 3 వరకు జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపాలని ఆదేశించింది. ఈ కేసులో మరికొందరి పాత్రపై కూడా సిట్ దర్యాప్తు కొనసాగిస్తున్న నేపథ్యంలో, రానున్న రోజుల్లో మరిన్ని కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు.

AP Liquor Transport Tender Scam, AP SIT, Vijayawada ACB Court, Judicial Remand, PT Warrant, Donthireddy Vasudeva Reddy, Kasireddy Rajasekhar Reddy, Karumuri Sunil, Liquor Tender Irregularities, Tender Scam Andhra Pradesh

By
en-us Political News

  
అలాగే బహ్రెయిన్‌లోని దిగ్గజ సంస్థ అయిన అమెజాన్ ప్రధాన డేటా సెంటర్‌ను కూడా ధ్వంసం చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. తమ దేశ పౌర వసతులపై అమెరికా దళాలు జరిపిన దాడులకు తగిన రీతిలో జవాబు చెప్పడానికే ఈ సాంకేతిక కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు పేర్కొంది. అయితే ఈ ఆరోపణలు, క్షిపణి దాడి ఘటనను అమెజాన్ కానీ, బహ్రెయిన్ ప్రభుత్వం కానీ ధ్రువీకరించలేదు.
బాబాయ్ త్వరగా కోలుకోవాలంటూ జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియాలో చేసిన పోస్టు క్షణాల్లో వైరల్ అయ్యింది. బాబాయ్ పట్ల ఎన్టీఆర్ చూపించిన ఈ ప్రేమాభిమానాల పట్ల నందమూరి అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఏడాది దావోస్ లోని ప్రపంచ ఆర్ధిక సదస్సులో కుదుర్చుకున్న మరో ఒప్పందం ఇవాళ సాకారమైంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో గత కొన్ని నెలలుగా తీవ్ర సంచలనం సృష్టిస్తున్న ముంబై నటి కాదంబరి జత్వాని వ్యవహారం
తన ఆరోగ్యం, ఆసుపత్రి అనుభవాల గురించి తాజాగా నెట్టింట షేర్ చేసిన పోస్టు ఆయన అభిమానులను, సినీ వర్గాలనూ కలవరానికి గురి చేసింది. ఆసుపత్రి వాతావరణం, శస్త్రచికిత్స, అనంతరం ఐసీయూలో వైద్యుల నిరంతర పర్యవేక్షణ వంటి కష్టతరమైన దశలను ఆయన తన పోస్టులో పేర్కొన్నారు.
హైదరాబాద్‌లోని గోల్కొండ కోటలో జరుగుతున్న శ్రీ జగదాంబికా అమ్మవారి బోనాల మహోత్సవాల సందర్భంగా హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీసులు విస్తృత స్థాయిలో ట్రాఫిక్ బందోబస్తు చేపట్టారు.
ప్రధాని ఇంటి ఎదుట బైఠాయించిన రాహుల్, ఖర్గే..!
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో జాతీయ రాజకీయం అత్యంత ఆసక్తికరమైన మలుపు తిరిగింది.
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఛలో సంసద్ పార్లమెంట్ మార్చ్ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
ఉత్తరాంధ్ర ప్రాంత ప్రగతికి ఊపిరి పోసేందుకు తమ జీవనాధారమైన భూములను ప్రభుత్వం సేకరించడానికి సహకరించిన రైతులకు కృతజ్ఞతగా, గౌరవంగా భోగాపురం విమానాశ్రయం నుంచి ఉచితంగా ఒకసారి విమానంలో ప్రయాణించే అవకాశం కల్పించారు. ఈ మేరకు ఆయన అధికార యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలిచ్చారు.
కాకినాడలో జరుగుతున్న NBK111 సినిమా షూటింగ్ సందర్భంగా గాయపడిన ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నంద మూరి బాలకృష్ణను రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఫోన్‌లో పరామర్శిం చారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పొగాకు రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ముడి పొగాకు (HSN 2401)పై ప్రస్తుతం అమలులో ఉన్న 40 శాతం జీఎస్టీని 28 శాతానికి తగ్గించాలని
ట్రైనీ ఐపీఎస్‌కి న్యాయం జరగాలి..విచారణ పూర్తికాకముందే దోషిగా ప్రకటించడం సరికాదు..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.