జగన్ కు జడ్ ప్లస్ కేటగిరి భద్రత?!

Publish Date:May 31, 2023

Advertisement

ఒక వైపు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ విపక్ష నేత నారా చంద్రబాబునాయుడికి జడ్ ప్లస్ కేటగిరి భద్రత ఎందుకు అని ప్రశ్నిస్తారు. ఆ బ్లాక్ కమెండోల భద్రతే లేకపోతే ఆయన ఎప్పుడో ఫినిష్ అయిపోయి ఉండేవారని హెచ్చరిస్తారు. మరో వైపు ముఖ్యమంత్రి జగన్ భద్రతకు ఐసీఎస్  వంటి ఉగ్ర సంస్థల నుంచి ముప్పు ఉందంటూ ఏపీ ఇంటెలిజెన్స్ అధికారులు ఆయనకు జడ్ ప్లస్ కేటగిరి భద్రత కల్పించాలని కేంద్రానికి లేఖ రాశారు.

 తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడి భద్రతకు ముప్పు అధికార వైసీపీ మూకల నుంచే ఉందని కళ్లెదుటే కనిపిస్తుండగా తమ్మినేని సీతారాం భద్రత తీసేయమని ఏపీ స్పీకర్ హోదాలో కేంద్రానికి సిఫారసు చేస్తానని వైసీపీ కార్యకర్తల సమావేశంలో చెప్పారు. ఇక ఐసీఎస్ వంటి ఉగ్రసంస్థల నుంచి ఎవరికైనా ముప్పు ఉంటే అది ముందుగా తెలిసేది కేంద్ర నిఘా సంస్థలకే కానీ ఏపీ ఇంటెలిజెన్స్ కు కాదు. అంతర్జాతీయ ఉగ్ర సంస్థల కదలికల గురించి తెలుసుకునేందుకు కేంద్ర నిఘా సంస్థలకు పటిష్టమైన అత్యున్నతమైన వ్యవస్థ ఉంది. ఆ నిఘా సంస్థల ద్వారానే రాష్ట్రాలకు అంతర్జాతీయ ఉగ్ర సంస్థల కదలికలకు సంబంధించిన సమాచారం అందుతూ ఉంటుంది. అటువంటిది జగన్ కు ఐసీఎస్ వంటి ఉగ్ర సంస్థల నుంచి ముప్పు ఉందంటూ.. కేంద్ర నిఘా సంస్థలకు కూడా తెలియని సమాచారాన్ని ఏపీ ఇంటెలిజెన్స్  కనిపెట్టేసి  జగన్ రెడ్డికి జడ్ ప్లస్ కేటగిరి భద్రత కల్పించాలని కేంద్రాన్ని కోరింది. 

అదే సమయంలో రాష్ట్రంలో పరిస్థితి చూస్తే జడ్ ప్లస్ కేటగిరి భద్రత ఆల్రెడీ ఉన్న  విపక్ష నేత నారా చంద్రబాబునాయుడి పర్యటన సందర్భంగా అధికార పార్టీ మూకలు దాడులకు సంబంధించి సమాచారం మాత్రం ఏపీ ఇంటెలిజెన్స్ కు అందదు. తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై దాడి గురించి కానీ, కుప్పం, నందిగామ, అనపర్తి సంఘటనలకు సంబంధించి ఏపీ ఇంటెలిజెన్స్ వైఫల్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలో నిఘా వైఫల్యాల గురించి పట్టించుకోని ఏపీ ఇంటెలిజెన్స్ అంతర్జాతీయ ఉగ్రవాదుల అనుపానులు గమనించి ఏపీ ముఖ్యమంత్రికి ఐసీఎస్ వంటి ఉగ్ర సంస్థల నుంచి ముప్పు ఉందంటూ ఆయన భద్రత రాష్ట్ర పోలీసుల వల్ల కాదు కనుక జడ్ ప్లస్ కేటగిరి భద్రత కల్పించాలని కేంద్రాన్ని కోరడం విడ్డూరంగా ఉంది.

  ముఖ్యమంత్రిగా జగన్ కు ఇప్పుడు ఉన్న భద్రత కారణంగా కిలోమీటర్ వరకూ ఆయన అనుమతించిన వారు తప్ప  ఇతరులు ఉండే అవకాశం లేదు.  అత్యున్నత స్థాయి ముప్పు ఉందని నివేదికలు ఉంటేనే జడ్ ప్లస్ భద్రత కల్పిస్తారు.  సీఎంలలో యోగి ఆదిత్యనాథ్, అరవింద్ కేజ్రీవాల్ లకు మాత్రమే జడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పించారు. ఇతర బీజేపీ సీఎంలకూ ఆ స్థాయి భద్రత లేదు.

By
en-us Political News

  
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విధానసౌధలో కేబినెట్ సమావేశం నిర్వహిస్తున్న సమయంలోనే.. పాతిక మంది ఎమ్మెల్యేలు ఓ ప్రైవేట్ హోటల్‌లో ఈ భేటీ జరగడం సంచలనం సృష్టించింది.
తెలుగువన్ వాస్తవ వేదిక 16వ సంచికలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
జనసేన పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఈసారి దూరం జరిగింది.
పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి ఊరట
రాష్ట్రంలో బీఆర్ఎస్‌ రెండుసార్లు, కాంగ్రెస్‌ ఒకసారి అధికారంలోకి వచ్చాయనీ, ఆ రెండు ప్రభుత్వాల వైఫల్యాలనూ గమనించిన తెలంగాణ ప్రజలు వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అధికారం కట్టబెట్టాలని ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశారన్నారు.
జాతీయ పార్టీలకే ప్రయోజనం చేకూరుతుందనీ, రాష్ట్రాల సమస్యలపై పట్టింపే లేని పరిస్థితి ఉత్పన్నమౌతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం ఖర్చు తగ్గుతుందన్న నెపంతో కేంద్రం జమిలి ఎన్నికల నిర్వహణకు మొగ్గు చూపడమంటే.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే ఔతుందని పేర్కొన్నారు.
జగన్ హయాంలో లిక్కర్ మాఫియా రాజ్యమేలిందన్న షర్మిల, నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని గుల్ల చేయడంతో పాటు రాష్ట్ర ఆదాయాన్ని కూడా కొల్లగొట్టారన్నారు. జగన్ హయాంలో కంటైనర్ల కొద్దీ మాదకద్రవ్యాలు రాష్ట్రంలోకి వచ్చాయని ఆరోపించారు.
రాజంపేటలో కూటమి నాయకుల రాజకీయం రాజుకుంది.
వ్యవస్థను కాపాడాల్సిన వారే విద్రోహానికి పాల్పడుతున్నారా? అనే అంశాలపై ప్రముఖ విశ్లేషకుడు అప్పసాని రాజేష్ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కూలంకషంగా వివరించారు.
గ్లోబల్ ప్రపంచంలో ఒక చోట రేగే చిచ్చు, ఖండాలు దాటి మన వంటింటి గ్యాస్ ధరను, మన పిల్లల సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలను కూడా ప్రభావితం చేస్తుంది.
టీవ‌ల బొత్సకు బ్రెయిన్ స్ట్రోక్ త‌గిలి తీవ్రంగా ఇబ్బంది ప‌డ్డారు. కోలుకుని ఆయ‌న మండ‌లికి వచ్చారు. అప్పుడు ఆయనకు లోకేష్ సాద‌రంగా ఆహ్వానించిన తీరు పట్ల లోకేష్ పై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. అదే గతంలో చంద్రబాబు పై జగన్ చేసిన వ్యాఖ్యలపై పార్టీలకు అతీతంగా అందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓడ‌లు బండ్లు అవుతాయి. బండ్లే ఓడ‌ల‌వుతాయి అన్న సామెతకు నేటి జగన్ పరిస్థితి అచ్చుగుద్దినట్లు సరిపోతుందంటున్నారు పరిశీలకులు. ఒక్కోసారి అవ‌స‌రం తీరిపోయిన త‌ర్వాత విసిరేసిన తెడ్డే.. చివ‌రికి ప‌డ‌వ బోల్తా ప‌డ్డ‌ప్పుడు దిక్క‌వుతుంది. అన్న‌దానికి జ‌గ‌న్ అప‌రిప‌క్వంతో కూడుకున్న రాజ‌కీయ విధానాలే ఉదాహ‌ర‌ణంటున్నారు.
కూటమి ఐక్యత ప్రాధాన్యతను జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అసెంబ్లీ వేదికగా వివరించడం కిరణ్ రాయల్ వంటి నేతలకు చెంపపెట్టుగానే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కూటమి ఐక్యత వల్ల ఎంత మేలు జ‌రుగుతుందో పవన్ కల్యాణ్ విడ‌మ‌ర‌చి చెప్పారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.