కాలం మారుతోన్నకొద్దీ సాంకేతికత ఇబ్బందికరంగా మారుతోంది. మొబైల్, యాప్ల రాజ్యం ఇది. ప్రతీదీ యాప్లకు అనుసంధానం చేయడం మీద దృష్టిసారిస్తున్నారంతా. బడికి ఉపాధ్యాయుల రాకపోకల గురించి తెలుసుకోవడానికి ఫేస్ రికగ్నిషన్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని ఏపీ ప్రభుత్వం పెట్టిన నిబంధన ఉపాధ్యాయుల్లో ఆగ్రహం రెండింతలు చేసింది. అసలే జీతబత్యాలు, ట్రాన్స్ఫర్లు విషయాల్లో ప్రభుత్వ నియమ నిబంధనలతో సతమతమవుతున్న ఉపాధ్యాయులకు ఇపుడు ఈ యాప్ మరింత తలభారంగా మారింది.
ఉపాధ్యాయుల మీద బైండోవర్, అక్రమకేసులు, నోటీసులనిస్తూ అప్రజా స్వామి కంగా ప్రభుత్వం వ్యవహ రిస్తున్న తీరుపై ఉపాధ్యాయులు భయభ్రాంతులకు గురవుతున్నారని ఉపా ధ్యాయ సంఘాల నేతలు అన్నారు. ప్రభుత్వం సొంత ఫోన్లలో ఫేస్ రికగ్నిషన్ యాప్ ద్వారా హాజరు వేసేలా ఒత్తి డి చేస్తున్నారని ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు.
యాప్ గురించి ప్రభుత్వంతో యుద్ధానికి తలపడ్డారు. పరిస్థితులు గ్రహించిన జగన్ సర్కార్ యాప్ నిబం ధన అంశాన్ని మరోసారి పరిశీలిస్తామని, లోపాలు సవరించి నిర్ణయం తెలియజేస్తామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. దీంతో ఉపాధ్యాయులు కాస్తంత మెతకబడ్డారు. కానీ ప్రభుత్వం చెప్పినట్టుగా ఇచ్చిన హామీని విస్మరించింది. దాన్ని గురించి అంతగా పట్టించుకోవడం లేదు. దీంతో ఉపాధ్యా యులు తాడోపేడో తేల్చుకోవాలన్న నిర్ణయానికి వచ్చేశారు. ప్రభుత్వం ఉపాధ్యాయుల పట్ల అవలంబి స్తున్న వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఉపాధ్యాయ దినోత్సవం రోజున ప్రభుత్వ సత్కా రాలు, సన్మానాలు తిరస్కరించారు.
ప్రభుత్వ యాప్ విద్యార్ధులకు అస్త్రంగా మారితేనే మరీ తలనొప్పి. ఒకవేళ యాప్లో గడ్డం ఉన్నపుడు చూసిన ఉపాధ్యాయుడికి గడ్డం లేకుండా కనపడితే అటెండెన్స్ సమయంలో ఫేస్ గుర్తుపట్ట లేదని తిర స్కరిస్తే వచ్చే ఇబ్బంది అంతా యింతా కాదని విద్యార్ధులు సరదాగా యాప్ల మీద నెట్లో జోక్స్ పంచు కుంటున్నారు. యాప్ అనేది నిరంతరం బ్రహ్మాండంగా పనిచేస్తుందన్ననమ్మకం ఎవరు ఇస్తారు. నిరం తరం లోపాలు ఉండవన్న గ్యారంటీ లేదు. ఇలాంటి అర్ధరహిత విధానాలను అమలుచేసి జగన్ సర్కార్ తన తెలివిని స్వయంగా బయటపెట్టుకుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ap-govt-teacher-app-game-25-143247.html
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై చార్జ్షీట్ విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు. తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే.. మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి సొంత నియోజకవర్గానికే ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి.
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.