అమ్మో ఒకటో తారీకు!.. పింఛన్లు, వేతనాలూ చెల్లించేదెలా?

Publish Date:Jul 30, 2024

Advertisement

జగన్ హయాంలో జరిగిన ఆర్థిక విధ్వంసం, ఆ సర్కార్ ఆర్థిక అరాచకత్వం కారణంగా తెలుగుదేశం కూటమి చిక్కులు ఎదుర్కొంటోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు, సామాజిక పింఛన్లు, ఉద్యోగుల వేతనాల చెల్లింపునకు ఇబ్బందులు ఎదురౌతున్నాయి. ఎన్ని సమస్యలున్నా అన్న మాట ప్రకారం ప్రతి నెలా ఒకటో తేదీకే పించన్ల పంపిణీ, వేతనాల చెల్లింపులు చేస్తున్నా.. అమ్మో ఒకటో తారీకు అన్న బెంగ మాత్రం తప్పడం లేదు. 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి నెలా ఒకటో తేదీనే పింఛన్లు, వేతనాలు చెల్లిస్తోంది. అధికార పగ్గాలు అందుకున్న తరువాత తొలి నెలలో చెప్పినట్లుగానే అరియర్స్ తో సహా పింఛన్లు చెల్లించింది. అలాగే ఏ అవాంతరాలూ లేకుండా ఉద్యోగుల వేతనాలను కూడా వాటి ఖాతాలో వేసేసింది. వలంటీర్లతో పని లేకుండా పింఛన్లను లబ్ధిదారుల ఇళ్లకే వెళ్లి అందించింది. 

ఇక ఇప్పుడు ఆగస్టు ఒకటో తేదీ రాబోతోంది. ఆగస్టు 1నే పించన్ల పంపిణీ పూర్తికి చంద్రబాబు సర్కార్ అన్ని ఏర్పాట్లూ చేసేసిందనుకోండి అది వేరే సంగతి. కానీ ఆర్థిక శాఖ నిధుల కొరతతో సతమతమౌతోంది. అప్పో సొప్పో చేసి ఈ నెల పించన్లు, వేతనాల పంపిణీని గట్టెక్కించేసినా మళ్లీ ఒకటో తారీకు వచ్చే సరికి మళ్లీ అప్పుల కోసం వెతుకులాట తప్పని పరిస్థితి ప్రస్తుతం నెలకొని ఉంది. అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నెల నెలా అమ్మో ఒకటో తారీకు అనుకుని బెంబేలు పడే స్థితిలో ఉంది. పింఛన్లు వేతనాలు సరే.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే కూడా నిధులు అవసరం.  ఫించన్లు,జీతాలు చెల్లించడానికి ఇబ్బందులు పడుతున్న సర్కార్ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుపై మల్లగుల్లాలు పడుతోంది.  67లక్షల మందికి సామాజిక ఫించన్లు,ఉద్యోగుల జీతాలు,రిటైర్ అయిన వారి పింఛన్లకు1వ తేదీన చెల్లించాలి. గత నెలలో రిజర్వ్ లో ఉన్న రూ.ఏడువేల కోట్లు ఉపయోగపడ్డాయి.ఆగస్టు నెల  సామాజిక పింఛన్లకు ప్రతి మంగళవారం ఆర్బీఐ వద్ద సెక్యూరిటీల మీద రుణాలు సేకరిస్తున్నారు. ఇవి సామాజిక ఫించన్లకు, ఉద్యోగులజీతాలు ,రిటైర్ ఉద్యోగుల ఫించన్లులకు చెల్లించాల్సిన 5వేల కోట్లకు కూడా సరిపడా వస్తాయని భావిస్తున్నారు. 
అధికారంలోకి వచ్చి 50  రోజులైనా గ్యారెంటీలు అమలు పై ఇంకా నిర్ణయం కాలేదు. ఆగస్టు 15న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తామని చెబుతున్నది.ఆర్టీసీ కొత్త బస్సులు కావాలంటోంది. ఈ పథకానికి ప్రతి నెలా ఆర్టీసీకీ రూ.250కోట్లు చెల్లించాల్సి ఉందని అంచనా.ఇక అన్న క్యాంటిన్లు అన్నీ ఆగస్టు 15 నాటికి సిద్ధం కాలేవని అధికార వర్గాలు చెబుతున్నాయి.183 క్యాంటిన్ 100 మాత్రమే సిద్ధమవుతాయని తెలుస్తున్నది.
సమగ్ర భూ సర్వేలో జగన్ ఫోటో ఉన్న 77లక్షల రాళ్లను తొలగించాలంటే రూ.15కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు తేల్చడం గమనార్హం. జగన్ ఫోటో లపిచ్చితో రూ.700కోట్లు ప్రజాధనం దుర్వినియోగం అయింది.ఇది కాక విశాఖలో 500కోట్లతో రుషికొండపై కట్టిన రాజభవనం వల్ల ప్రజా ధనం దుర్వినియోగం అయింది. అలాగే విశాఖలో  ప్రభుత్వ కార్యాలయాలు,ప్రభుత్వ స్థలాలు తాకట్టు పెట్టి జగన్ హయాంలో అప్పులు చేసారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి వైసీపీ హయాంలో జరిగిన తప్పులు,అవకతవకలు, ప్రజా ధనం స్వాహ వెలికితీయడానికే సమయం సరిపోవటంలేదు. రోజుకో కుంభకోణం బయట పడుతోంది. మరో పక్క ఆ ప్రభుత్వం చేసిన అప్పులతోనే సతమతమవుతోంది. కొత్త అప్పులు ఎలా చేయాలో అర్ధం కావడం లేదు.  రోజువారీ ఖర్చులతో పాటు గ్యారెంటీల అమలు చేయాలంటే అప్పుచేయక తప్పదు.అభివృద్ధి చూపించి ఆ ఫలాలతో హామీలు నెరవేర్చుతామని  తెలుగుదేశం కూటమి ఎన్నికలలో  చెప్పింది. అయితే అభివృద్ధి, దానిఫలాలు వెంటనే రావు.  అభివృద్ధి పనులు జరగాలి. రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలి. ఆ తరువాత వాటి ఫలాలు వస్తాయి. సంపద సృష్టి జరుగుతుంది. ఆదాయం పెరుగుతుంది. అయితే ఇదంతా జరగడానికి కొంత సమయం పడుతుంది. అప్పటి వరకూ చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కార్ కు ఆర్థిక కష్టాలు తప్పవు.  వచ్చే నెలలో అమ్మ ఒడి, రైతు భరోసా చెల్లించాల్సి ఉంది.స్కూళ్లు ప్రారంభం అయ్యాయి. వరినాట్లు కూడా మొదలయ్యాయి.ముఖ్యంగా రైతు రుణాలు మంజూరు చేయించాలి. కౌలు రైతులకూ రుణాలు అందేలా ప్రణాళికలు సిద్ధం చేయాల్సిఉంది. మరి ప్రభుత్వం నిధులు ఎలా సమకూర్చుకుంటుందన్నదే ప్రశ్న. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం హామీల అమలుతో పాటు ప్రజా సంక్షేమానికి సంబంధించి ఏ పథకానికీ నిధుల కొరత లేకుండా చూస్తామని చెబుతున్నారు. అదే సమయంలో అభివృద్ధినీ పట్టాలెక్కిస్తామంటున్నారు.  మొత్తం మీద కొంత కాలం పాటు ఏపీకి ఆర్థిక ఇక్కట్లు తప్పవని అంటున్నారు. 

By
en-us Political News

  
తెలంగాణ సీనియర్‌ నేత మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
దేవర తలచుకుంటే ఊరేం ఖర్మ దేశమే పేరు మార్చుకుంటుంది. భరతావని మనది. జండా పట్టుకుని చాలా చక్కగా నవ్వుతూ నిలబడి ఉంటుంది.
రాష్ట్రంలోని 121 మున్సిపాలిటీల్లో ఎస్టీలకు 5, ఎస్సీలకు 17, బీసీలకు 38 మున్సిపల్ ఛైర్‌పర్సన్ పదవులను కేటాయించారు. అలాగే మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు వర్తిస్తాయి.
ఈ కేసులో విజయసాయి కూడా ఇప్పటికే సిట్, ఈడీ విచారణను ఎదుర్కొన్నారు. ఇప్పుడు తాజాగా ఈ నెల 22 విచారణకు రావాల్సిందిగా విజయసాయికి ఈడీ నోటీసులు పంపడం రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, అలాగే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, జగిత్యాల ఎమ్మెల్యే మాకనూరు సంజయ్ లపై స్పీకర్ నిర్ణయం తీసుకోవలసి ఉంది. ఈ ముగ్గురిలో కూడా దానం నాగేందర్ పరిస్థితి ఒకింత భిన్నంగా ఉంది. ఎందుకంటే ఆయన బీఆర్ఎస్ టికెట్ పై విజయం సాధించిన తరువాత కాంగ్రెస్ కండువా కప్పుకోవడమే కాకుండా, ఆ పార్టీ తరపఫున లోక్ సభ ఎన్నికలలో పోటీకి కూడా దిగారు.
ఎన్నికల నిర్వహణలో ఎన్నికల సంఘం అనుసరిస్తున్న తీరు వల్ల ప్రజలలో ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం సడలిపోతోందని రాహుల్ పేర్కొన్నారు.
కాంగ్రెస్ ఇటీవల ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు ఈ ఆరుగురు ఎమ్మెల్యేలూ డుమ్మా కొట్టడమే ఈ ప్రచారానికి కారణం. ఈ నెల 13న పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన దహీ-చూరా విందుకు ఈ ఆరుగురు ఎమ్మెల్యేలూ గైర్హాజరయ్యారు.
బీఎస్పీ గతంలో నాలుగుసార్లు అధికారంలో ఉన్న విషయాన్ని గుర్తుచేస్తూ ..2027 ఎన్నికలలో ప్రజలు మరోసారి బీఎస్పీని అధికారంలోకి తీసుకురావాలని ఆశపడుతున్నారన్నారు. యూపీలో బీఎస్పీ ఐదో సారి అధికారంలోకి రావడం ఖాయమన్న ధీమాను మాయావతి వ్యక్తం చేశారు.
కేంద్ర మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో టీడీపీకి ఒక బెర్త్ క‌న్ఫ‌ర్మ్ అయిన‌ట్టు క‌నిపిస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో టెండరింగ్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందనీ, కేవలం మైనింగ్ మాత్రమే కాకుండా, విద్యుత్, ఇరిగేషన్, రోడ్లు ఇలా ప్రతి రంగంలోనూ నచ్చిన వారికి కాంట్రాక్టులు కట్టబెడుతూ అడ్డగోలు దోపిడీకి తలుపులు బార్లా తెరిచారని తీవ్ర స్థాయిలో విమర్శించారు.
జగన్ పాలనా వైఫల్యాలు అంటూ వైసీపీయులు కలలో కూడా అంగీకరించడానికి సాహసించని మాటలను పేర్ని నాని నోటి వెంట రావడం రాజకీయవర్గాలలో చర్చనీయాంశంగా మారింది. జగన్ పాలనా వైఫల్యం కారణంగానే 2019 ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయాన్ని ఘోరపరాజయాన్ని చవిచూడాల్సి వచ్చిందని పేర్ని నాని యూట్యూబ్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అంగీకరించేశారు.
రాజకీయాల్లో నాయకులపై విమర్శలు, ఆరోపణలు సహజం. వాటిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవడం అన్నది సాధారణంగా అధకారంలో ఉన్న వారిపై కంటే అధికారంలో లేని వారిపైనే ఎక్కువగా జరుగుతుంటుంది. అయితే ఈ పద్ధతిని బ్రేక్ చేసి.. ఇది ప్రజాస్వామ్యం, తన, పర తేడా లేకుండా ఎవరిపై ఆరోపణలు వచ్చినా విచారణ జరుపుతామని,తప్పు చేశారని నిర్ధారణ అయితే చర్యలు తీసుకుంటామని నారా లోకేష్ చెబుతున్నారు.
ముంబైపై పట్టు సాధించడమే లక్ష్యంగా థాక్రే బదర్స్ కలవడం ప్రాథాన్యత సంతరించుకుంది. ఎగ్జిట్ పోల్స్ లో బీజేపీ-షిండే కూటమి విజయం సాధించే అవకాశం ఉందని తెలినప్పటికీ, థాక్రేల కలయిక నేపథ్యంలో ఫలితం ఎలా ఉంటుందన్న ఉత్కంఠ ముంబై వాసులలోనే కాకుండా, దేశ వ్యాప్తంగా వ్యక్తం అవుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.