ప్రచారం ముగిసే రోజు నుంచి కోడ్ అమలట.. ఏపీ ఎన్నికల కమిషన్ స్పెషల్..

Publish Date:Oct 22, 2021

Advertisement

తెలంగాణలో హుజూరాబాద్, ఏపీలో బద్వేల్ అసెంబ్లీ నియోజక వర్గాలకు.. అదే విధంగా దేశంలో మరికొన్ని రాష్ట్రాలలో ఇంకొన్ని అసెంబ్లీ స్థానాలకు ఈ నెల అంటే, అక్టోబర్ 30 పోలింగ్ జరుగుతుంది. ఇందుకు సంబంధించి సెప్టెంబర్ 28 న కేంద్ర ఎన్నికల కేంద్ర షెడ్యూలు విడుదల చేసింది.

అదే రోజు నుంచి ఎన్నికల నియమావళి, ఎలక్షన్ కోడ్  అమలులోకి వచ్చేసింది ... అని కదా అనుకుంటున్నాం .. కానీ, అది తప్పు .. ఉయ్ ఆర్ రాంగ్... మనం తప్పులో కాలేశాం. షెడ్యూలు ప్రకారం నోటిఫికేషన్, నామినేషన్ల ఘటం ముగిసి ప్రచారపర్వం  సాగుతోంది. అదంతా ఓకే ...అలాగే రేపు అక్టోబర్ 30 పోలింగ్ ... నవంబర్ 2 న ఓట్ల లెక్కింపు అన్నీ కూడా ... యథాతథంగానే ఉంటాయి .. అలాగే జరిగి పోతాయి ... కానీ...ఎలక్షన్ కోడ్ మాత్రం  మీరు, నేను, మనం అనుకుంటున్నట్లుగా  సెప్టెంబర్ 28 రాలేదు ... అక్టోబర్ 28వస్తుంది..

ఏంటి .. నీకేమన్నా మెంటలా ..తల తిరుగుతోందా .. అక్టోబర్ 28 కి ప్రచారం కూడా ముగిసి పోతుంది ..ఆరోజున ఎలక్షన్ కోడ్ అమలులోకి రావడం ఏమిటో, తిక్క సన్నాసి అంటారా? అలాయితే మీరు ఆంధ్ర ప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం అక్టోబర్ 22న విడుదల చేసిన ఈ ప్రెస్ నోట్ ..చూడండి ..ఆ తర్వాత తిక్క ..పిచ్చ ..తల తిరుగుడు ఎవరికో .. మీరే డిసైడ్ చేసుకోండి 

ఏపీ ఎన్నికల కమిషన్ ప్రెస్ నోట్.. 

The election commission of India has announced schedule for bye – election to 124 – Badvel (SC) Assembly constituency of Andhra Pradesh State vide press note no .ECI1/PN/83/202, dated 28 
September, 2021 and the MODEL CODE OF CONDUCT came into effect from 28.10.2021../అని కదా ఉంది అంటే ఏంటి...పోలింగ్’కు రెండు రోజుల ముందు ఈనెల (అక్టోబర్) 28 ఎలక్షన్ కోడ్ అమలులోకి వస్తుంది ... చుసారా.. ఏముందో.. మరి ఇంత వరకు అమలులో ఉన్నది ఏమిటీ... అంటారా.. అదేమిటో శ్రీ కమిషన్ వారే సెలవియ్యాలి.... 

By
en-us Political News

  
కేదార్ నాథ్ ఆలయం సమగ్ర అభివృద్ధి పథకంలో భాగంగా, ఆలయ సమీపంలో రూపుదిద్దుకోనున్న కేదార్ పరిచయ్ మ్యూజియం నిర్మాణ నిపునిగా డాక్టర్ ఈమని శివనాగిరెడ్డిని కేంద్ర సాంస్కృతిక శాఖ నియమించింది.
ఎద్దు చేలో పడి మేస్తుంటే, దూడ గట్టున మేస్తుందా? మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి పేర్ని కిట్టు పరిస్థితి కూడా ఇలాగే వుంది. పేర్ని కిట్టు తండ్రి పేర్ని నాని
చేవెళ్ల పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గం నుంచి హేమాహేమీలు త‌ల‌ప‌డుతున్నారు. కాంగ్రెస్ నుంచి ప్ర‌స్తుత ఎంపీ రంజిత్ రెడ్డి, బీజేపీ నుంచి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి, బీఆరెస్ నుంచి మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వ‌ర్ ముదిరాజ్‌ బరిలో ఉన్నారు. వీరిలో విశ్వేశ్వ‌ర్ రెడ్డి, జ్ఞానేశ్వ‌ర్ స్థానికులు.
గురువారం సాయంత్రం హైదరాబాద్‌లో వున్న రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్
భయపడినట్టే జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో అధికారులు ఇంటింటికి వెళ్ళి ఇవ్వాల్సిన పెన్షన్‌ జగన్ పుణ్యమా అని బ్యాంకులకు
నిందితులంతా ఆర్థికంగా, రాజ‌కీయంగా బాగా శక్తిమంతులని, ఏదో ఒక కారణం చూపుతూ పిటిషన్లు దాఖలు చేసి విచారణ ముందుకు సాగకుండా చేస్తున్నారని సీబీఐ, సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్ళింది. ఏదో ఒక కారణంతో ఒక దాని తర్వాత ఒక కేసు దాఖలు చేస్తూ... దేశంలో అత్యుత్తమ న్యాయవాదులను పెట్టి వాదనలు వినిపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, పార్లమెంటు సభ్యులు, అత్యంత సీనియర్ అఖిల భారత సర్వీసు అధికారులు, పెద్ద కార్పొరేట్ సంస్థలు, మీడియా హౌస్‌లు, అత్యంత ధనవంతులైన వ్యాపారులున్నారు. నిందితులుగా ఉన్న వ్యక్తులు, కంపెనీలు దేశంలోని అత్యుత్తమ న్యాయవాదులను ఉపయోగించుకుంటూ.. కోర్టుల్లో వాదనలు వినిపిస్తున్నారు.
తూర్పు గోదావరి జిల్లాలో ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులో తరలిస్తున్న రూ.2.40 కోట్ల నగదును పోలీసులు సీజ్‌ చేశారు. ఈరోజు ఉదయం గోపాలపురం మండలం జగన్నాథపురం గ్రామ శివారులోని అంతర్‌ జిల్లాల చెక్‌పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో హైదరాబాద్‌ నుంచి విశాఖపట్నానికి వెళుతున్న ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులో రూ.2.40 కోట్ల నగదు తరలి వెళుతున్నట్టు పోలీసులు గుర్తించారు.
అనంతపురం జిల్లాలో పామిడి హైవే.. నాలుగు పెద్ద పెద్ద కంటైనర్లు వున్న నాలుగు లారీలు ఒకదాని వెనుక మరొకటి వెళ్తున్నాయి.
వైఎస్ షర్మిలా రెడ్డి.. రాజకీయాలలో ఆమె ఒక ఫైర్ బ్రాండ్. వైసీపీ అధినేత జగన్ కు స్వయానా సోదరి. వైఎస్ జగన్ విపక్షంలో ఉన్న సమయంలో షర్మిల అన్న కోసం.. అన్న వదిలిన బాణాన్నంటూ రాష్ట్రమంతా చుట్టేశారు. పార్టీ అధినేత అందుబాటులో లేని లోటు పార్టీకి కనబడకుండా చేశారు. అయితే షర్మిల పుణ్యమా అని అధికారంలోకి వచ్చిన జగన్.. సీఎంగా రాష్ట్రపగ్గాలు అందుకున్నాకా.. తనకు అధికార అందలం అందించడం కోసం రాష్ట్రమంతటా కాళ్లరిగేలా తిరిగిన షర్మిలను దూరం పెట్టేశారు.
 ఎన్నికలకు ఇంకా 11 రోజుల వ్యవధి ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో అధికారపార్టీ నేతల  అరెస్ట్ సంచలనమైంది. 
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. ప్రతిపక్ష అభ్యర్థులపై వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేస్తున్నారని టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావు మండిపడ్డారు. ఎన్నికల ప్రచారం నిర్వహించకుండా జగన్ పై తక్షణం బ్యాన్ విధించాలని ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు.
కేంద్ర ఎన్నికల సంఘానికి ఒక్క ఆంధ్ర ప్రదేశ్ విషయంలోనే నిబంధనలు గుర్తుకురావా? లేక ఏపీకి సంబంధించి ఎన్నికల సంఘానికి ఏమైనా ప్రత్యేక గైడ్ లైన్స్ ఉన్నాయా? ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో అన్ని పార్టీల విషయంలో సమానంగా వ్యవహరించాల్సిన ఎన్నికల సంఘం ఏపీలో మాత్రం అధికార వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందా? విపక్ష కూటమి ఫిర్యాదులను బుట్టదాఖలు చేసి తమాషా చూస్తోందా? అంటే జరుగుతున్న పరిణామాలను గమనిస్తుంటే ఔననే సమాధానమే వస్తున్నది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.