Publish Date:Jun 30, 2026
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముంబైలోని అంబానీ ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకున్నారు. ఇందు కోసం ఆయన సోమవారం జూన్ 29) ముంబై చేరుకున్నారు. గత కొంతకాలంగా పవన్ కల్యాణ్ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రిలో చేరారు. పవన్ కల్యాణ్ గత కొంత కాలంగా తీవ్రమైన భుజాల నొప్పితో బాధపడుతున్న సంగతి విదితమే. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకోవాలన్న ఉద్దేశంతో ఆయన అంబానీ ఆస్పత్రిలో చేరినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
ఇటీవల కొన్ని నెలల క్రితమే ఆయన కు హైదరాబాద్లో నాసల్ సర్జరీ జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు భుజాల నొప్పి నివారణ కోసం ఆయన అంబానీ ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. కాగా పవన్ కల్యాణ్ వెంట ఆయన సతీమణి అనా లెజ్నెవా కూడా ఉన్నారు.
పవన్ కల్యాణ్ భుజాల కండరాలు దెబ్బతినడం వల్లే ఆయన ఇబ్బంది పడుతున్నారని ఆయన కుటుంబ సభ్యుల ద్వారా తెలుస్తోంది. పర్యటనల్లో అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున చుట్టుముట్టడం, తోపులాటలు జరిగిన ఘటనలు కారణంగా ఆయన భుజాల కండరాలు దెబ్బతిన్నాయని అంటున్నారు.
ఈ సమస్యకు చికిత్స కోసమే దేశంలోనే ఉత్తమ వైద్య సేవలు అందిస్తుందన్న పేరు ఉన్న అంబానీ హాస్పిటల్లో ఆయన సోమవారం (జూన్ 29) చేరారు. అంబానీ ఆస్పత్రిలో పవన్కు అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించారు. భుజాల సమస్య తీవ్రతను బట్టి వైద్యులు చిన్న సర్జరీ అవసరమని తేల్చారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ap-deputy-cm-joins-amban-hospital-36-224602.html
క్షణ విషయంలో నాటో సభ్య దేశాలు అమెరికాపై అతిగా ఆధారపడే విధానానికి స్వస్తి పలకడం కోసమే ట్రంప్ ఈమాండ్ తెరపైకి తీసుకువచ్చారని శ్వేత సౌధ సీనియర్ అధికారులు చెబుతున్నారు. ==
ఇరాన్ రాజధాని టెహ్రాన్ ఒక మండుతున్న అగ్నిపర్వతంగా మారింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఈ ఏడాది ఫిబ్రవరి 28 అలీ ఖమేనీతో పాటు ఆయన కుటుంబానికి చెందిన మరో నలుగురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
యుద్ధనౌకకు సంబంధించిన ప్రధాన నావికాదళ ఫిరంగులు, ఆటోమేటిక్ గన్నులు, రాడార్ ట్రాకింగ్ వ్యవస్థలు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్ల పనితీరును కూడా కిమ్ స్వయంగా పరిశీలించి ఫలితాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు వినియోగిస్తున్న ఆహార పదార్థాల్లో పెరుగు తున్న కల్తీ కారణంగా క్యాన్సర్తో పాటు అనేక దీర్ఘకాలిక ఆరోగ్య సమ స్యలు పెరుగుతున్నాయని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
వీకెండ్ వేళ మద్యం మత్తులో వాహనాలు నడిపే వారిపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు.
ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాల్సిన ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు నడిరోడ్డుపై మొరాయిస్తే ఆ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో, రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.
కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని లక్ష్మీ (కన్నేపల్లి) పంప్ హౌస్ వేదికగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.
మునుగోడు ఎమ్మెల్యే కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల కాలంలో సోషల్ మీడియా వేదికగా సామాన్య ప్రజల సమస్యలపై నాయకులు స్పందించే తీరు మారుతోంది.
ఆధునిక రాజకీయాల్లో ఎలక్షన్ స్ట్రాటజిస్ట్లు (ఎన్నికల వ్యూహకర్తలు), పొలిటికల్ మేనేజ్మెంట్ కంపెనీల హవా నడుస్తోంది.
సినీ నటుడు ప్రకాష్ రాజ్పై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని బీజేపీ సీనియర్ నాయకుడు ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు.