Publish Date:Dec 30, 2019
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డా? లేఖ విజయసాయిరెడ్డా? అంటూ టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా నిప్పులు చెరిగారు. ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకుండానే.... విజయసాయిరెడ్డి.... వైజాగే రాజధాని అంటూ ఎలా చెబుతారని ప్రశ్నించారు. భీమిలి ప్రాంతంలో రాజధాని రాబోతుందని విజయసాయి ఏవిధంగా ప్రకటించారని నిలదీశారు. వైజాగ్ ను ఎగ్జిక్యూటివ్ కేపిటల్ గా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించక ముందే... ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఘనస్వాగతం పలకాలంటూ విజయసాయి ఎలా పిలుపునిస్తారని దేవినేని ఉమా ప్రశ్నించారు.
అయినా, దొంగ లెక్కలు రాసి జైలుపాలైన విజయసాయిరెడ్డి రాజధానిపై ప్రకటన చేయడమేంటని ఘాటు వ్యాఖ్యలు చేశారు. విజయసాయి రాజ్యాంగేతర శక్తిగా మారుతున్నారన్న దేవినేని ఉమా... విశాఖలో పులివెందుల పంచాయతీలు చేస్తున్నారని ఆరోపించారు. విశాఖలో విజయసాయి ఆగడాలపై సీఎం జగన్ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి తీసుకునే తప్పుడు నిర్ణయాల్లో అధికారులు భాగస్వాములు కావొద్దని సూచించిన దేవినేని ఉమ... టీడీపీ అధికారంలోకి వచ్చాక జగన్ ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయంపైనా సీబీఐ విచారణ జరిపిస్తామన్నారు.
దేవినేని ఉమా తరహాలోనే సీపీఐ రామకృష్ణ కూడా సీఎం జగన్ను నిలదీశారు. కేబినెట్ భేటీకి ముందే... విశాఖే రాజధాని అంటూ విజయసాయిరెడ్డి ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు. విజయసాయి ప్రకటనపై జగన్మోహన్రెడ్డి వివరణ ఇవ్వాలన్నారు. మూడు రాజధానుల ప్రకటనతో ప్రాంతాల మధ్య జగన్మోహన్ రెడ్డి చిచ్చు పెట్టారని విమర్శించారు. అయినా, ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ రాకముందే అసెంబ్లీలో మూడు రాజధానుల ప్రకటన ఎందుకు చేశారని రామకృష్ణ ప్రశ్నించారు. మళ్లీ ఎవరిని మభ్యపెట్టడానకి హైపవర్ కమిటీ వేశారని ప్రశ్నించిన సీపీఐ రామకృష్ణ.... జగన్, విజయసాయిరెడ్డి కలిసి నిర్ణయాలు తీసుకుంటే... ఇంకా కమిటీలు ఎందుకన్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై నిజంగానే జగన్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే.... అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని కోరారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ap-cm-ys-jagan-mohan-reddy-disappointed-visakhapatnam-public-did-not-speak-word-at-visakha-utsav-25-92680.html
రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న నియోజకవర్గాలలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గం కచ్చితంగా ముందు వరుసలో ఉంటుంది. ఇక్కడ నుంచి పవన్ కు ప్రత్యర్థిగా వైసీపీ అభ్యర్థిగా కాకినాడ సిట్టింగ్ ఎంపీ వంగా గీత పోటీలో ఉన్న సంగతి తెలిసిందే.
రాజకీయాలలో గెలుపు ఓటములు సహజం. ఒక సారి గెలిచిన పార్టీ మరో సారి ఓడిపోతుంది. ఇది సూర్యుడు తూర్పున ఉదయిస్తాడన్నంత సహజం. అయితే ఒక్కో సారి మాత్రం ఒక ఓటమి ఆ పార్టీ ఉనికినే ప్రశ్నార్థకం చేస్తుంది. అంటే కళ్ల ముందరే ఓడలు బళ్లు అయిన దృశ్యం సాక్షాత్కరిస్తుందన్న మాట. సరిగ్గా ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి అలా ఉంది.
తిరుమలలో రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలకు పైగా సమయం పడుతోంది.
దెందులూరు వైసీపీ ఎన్నికల ప్రచారంలో ఘోర అపశృతి చోటుచేసుకుంది. వైసీపీ ప్రచార ఆర్భాటం చిన్నారుల ప్రాణాలను ప్రమాదంలో పడేసింది. ఎన్నికల నిబంధనలను ఏమాత్రం పాటించకుండా చిన్న పిల్లలను ప్రచారంలో భాగం చేసి వారి ప్రాణాలతో చెలగాటమాడారు. పెదపాడు మండలం రాజుపేటలో బుధవారం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అబ్బయ్య చౌదరి ఎన్నికల ప్రచారం చేపట్టారు.
ఎవరూ ఊహించని యువతి ఎన్నికల ప్రచారంలోకి అడుగుపెట్టింది. కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యండి అని ఓటర్లని చిరునవ్వులు చిందిస్తూ అడిగింది.
వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైయస్ జగన్ అక్రమాస్తుల కేసు మళ్లీ మొదటికొచ్చింది. సీబీఐ కోర్టు జడ్జి బదిలీ అయ్యారు. దీంతో ఈ కేసు విచారణ మే 15వ తేదీకి వాయిదా పడింది. అయితే సీబీఐ, ఈడీ కేసుల్లో వైయస్ జగన్ సహా 130 పిటిషన్లపై గత 12 ఏళ్లుగా విచారణ కొనసాగుతూనే ఉంది.
తెలుగు ఠీవీ పీవీ నరసింహారావు(కు భారత రత్న ప్రకటించడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. అదే టైంలో మరో డిమాండ్ కూడా బలంగా వినిపిస్తోంది. అదే ఎన్టీఆర్కు భారత రత్న ఇవ్వాలనే నినాదం. సీనియర్ ఎన్టీఆర్ అభిమానులంతా సోషల్ మీడియా వేదికగా ఈ నినాదాన్ని గట్టిగానే వినిపిస్తున్నారు. ఇందులో చాలా మంది ప్రముఖులు కూడా ఉన్నారు.
పుట్టగానే పరిమళించింది ఓ చిన్నారి గులాబీ... వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాము అనే నానుడిని అలవోకగా పక్కకు నెట్టేసింది. ఆనందాలతో పాటు సకల అవసరాలకు భరోసానిచ్చే కలశ ఫౌండేషన్ ని లోకానికి గిఫ్ట్ గా ఇచ్చింది. ఇంతకీ ఆ చిన్నారి ఎవరు? పుట్టుకతో సాధించిన విజయాలు ఏమిటి? ప్రస్తుతం తను సాధించిన విజయాలు, సాధించబోతున్న విజయాలు ఏ దశలో ఉన్నాయో ఒకసారి పరికిద్దాం.
జగన్ హయాంలో ఉద్యోగులు ఎన్ని ఇబ్బందులు పడ్డారో అందరికీ తెలిసిందే. మద్యం దుకాణాల దగ్గర కాపలా విధులు నిర్వర్తించాల్సి రావడం నుంచి రాష్ట్రప్రభుత్వోద్యోగులు, టీచర్లు పడిన బాధలు ఇన్నిన్ని కావయా అన్నట్లుగా ఉంది. చివరకు వారిని నెల మొదటి తారీకున రావాల్సిన వేతనాలకు కూడా విడతల వారీగా విదిల్చి నానా ఇబ్బందులకూ గురి చేశారు.
ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన మన భారత దేశాన్ని ఏదో పెద్ద శనిగ్రహం పట్టి పీడిస్తోంది.
అందుకే అంటారు.. ఎన్ని సమస్యలు చుట్టుముట్టినా జీవితం మీద ఆశ వదలకూడదని..! ఈ మాటకి తాజా ఉదాహరణ
ఏపీ హైకోర్టులో జనసేన పార్టీకి పాక్షిక ఊరట మాత్రమే లభించింది. గాజు గ్లాసు గుర్తు స్వతంత్య్ర అభ్యర్థులకు కేటాయించడాన్ని జనసేన పార్టీ సవాల్ చేస్తూ హైకోర్టులో మంగళవారం (ఏప్రిల్ 30) పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
వైఎస్ రాజశేఖర రెడ్డి రాజకీయ వారసుడిగా ఎపి రాజకీయాల్లో అడుగు పెట్టి ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్ కు అడ్డూ అదుపు లేకుండా అరాచకపాలన సాగిస్తున్నట్టు విమర్శ ఉంది.