Publish Date:Dec 30, 2019
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డా? లేఖ విజయసాయిరెడ్డా? అంటూ టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా నిప్పులు చెరిగారు. ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకుండానే.... విజయసాయిరెడ్డి.... వైజాగే రాజధాని అంటూ ఎలా చెబుతారని ప్రశ్నించారు. భీమిలి ప్రాంతంలో రాజధాని రాబోతుందని విజయసాయి ఏవిధంగా ప్రకటించారని నిలదీశారు. వైజాగ్ ను ఎగ్జిక్యూటివ్ కేపిటల్ గా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించక ముందే... ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఘనస్వాగతం పలకాలంటూ విజయసాయి ఎలా పిలుపునిస్తారని దేవినేని ఉమా ప్రశ్నించారు.
అయినా, దొంగ లెక్కలు రాసి జైలుపాలైన విజయసాయిరెడ్డి రాజధానిపై ప్రకటన చేయడమేంటని ఘాటు వ్యాఖ్యలు చేశారు. విజయసాయి రాజ్యాంగేతర శక్తిగా మారుతున్నారన్న దేవినేని ఉమా... విశాఖలో పులివెందుల పంచాయతీలు చేస్తున్నారని ఆరోపించారు. విశాఖలో విజయసాయి ఆగడాలపై సీఎం జగన్ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి తీసుకునే తప్పుడు నిర్ణయాల్లో అధికారులు భాగస్వాములు కావొద్దని సూచించిన దేవినేని ఉమ... టీడీపీ అధికారంలోకి వచ్చాక జగన్ ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయంపైనా సీబీఐ విచారణ జరిపిస్తామన్నారు.
దేవినేని ఉమా తరహాలోనే సీపీఐ రామకృష్ణ కూడా సీఎం జగన్ను నిలదీశారు. కేబినెట్ భేటీకి ముందే... విశాఖే రాజధాని అంటూ విజయసాయిరెడ్డి ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు. విజయసాయి ప్రకటనపై జగన్మోహన్రెడ్డి వివరణ ఇవ్వాలన్నారు. మూడు రాజధానుల ప్రకటనతో ప్రాంతాల మధ్య జగన్మోహన్ రెడ్డి చిచ్చు పెట్టారని విమర్శించారు. అయినా, ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ రాకముందే అసెంబ్లీలో మూడు రాజధానుల ప్రకటన ఎందుకు చేశారని రామకృష్ణ ప్రశ్నించారు. మళ్లీ ఎవరిని మభ్యపెట్టడానకి హైపవర్ కమిటీ వేశారని ప్రశ్నించిన సీపీఐ రామకృష్ణ.... జగన్, విజయసాయిరెడ్డి కలిసి నిర్ణయాలు తీసుకుంటే... ఇంకా కమిటీలు ఎందుకన్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై నిజంగానే జగన్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే.... అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని కోరారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ap-cm-ys-jagan-mohan-reddy-disappointed-visakhapatnam-public-did-not-speak-word-at-visakha-utsav-25-92680.html
మళ్ళీ అధికారంలోకి రావాలంటే ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించిన ఆయనకు తన తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ కమ్ ఇంటికి సంబంధించిన వాస్తు దోషాలను సెట్ చేసుకుంటే సరిపోతుందని ఆలోచన వచ్చింది.
తెలంగాణ ఉద్యమం అయిపోలేదు. తెలంగాణ పునర్నిర్మాణం ఇంకా మిగిలే ఉందంటారు కేసీఆర్. ఎన్నికల్లో ఓటమి అనేది టెంపరరీ సెట్ బ్యాక్ మాత్రమే. రాజకీయాల్లో ఉన్న వాళ్లకు నిబ్బరం ఉండాలి. గెలిచినా, ఓడినా ప్రజల కోసం పనిచేస్తూనే ఉండాలని కేసీఆర్ తన క్యాడర్కు హితబోధ చేస్తూ ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నారు.
ఎవరు ఎంత అధికారంలో అయినా వుండవచ్చు... మా మాటకు ఎదురు లేదు.. మేం చేసిన దానికి తిరుగులేదు అనే ధీమాలో వుంటే వుండొచ్చు..
ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ వారం రోజుల వ్యవధిలోకి వచ్చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అధికార పార్టీ వైసీపీకి కొమ్ముకాస్తూ ఏకపక్షంగా ఎన్నికలు నిర్వహించాలని చూస్తున్న అధికారుల జాబితాను రెడీ చేసుకున్న ఈసీ ఆ జాబితాలో ఒక్కొక్కరి పై బదిలీ వేటు వేస్తూ వస్తున్న. ఇప్పటికే పలువురు అధికారులపై బదిలీ వేటు వేసిన ఈసీ.. ఆదివారం (మే6) రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై బదిలీ వేటు వేసింది.
ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎపిలో నూతన డిజిపి నియామకమయ్యారు. అంతటితో ఆగకుండా ఎన్నికల కమిషన్ దూకుడు పెంచింది.
ఏపీలో ఎన్నికలు వారం రోజుల వ్యవధిలోకి వచ్చేశాయి. అధికార వైసీపీ ఈ ఐదేళ్ల కాలంలో చేసిందేమిటన్నది చెప్పుకోవడానికి ఏమీ లేక.. చెప్పుకునే గొప్పలు జనం నమ్మడం లేదని ఖరారు కావడంతో ఇక విపక్షాలపై దుష్ప్రచారం, అబద్ధాల వ్యాప్తికి డిస్పరేట్ గా ప్రయత్నిస్తోంది.
‘ఒకే ఒక్కడు’ సినిమాలో ఒక కీలక సీన్ వుంటుంది. ముఖ్యమంత్రి పోస్టులో వున్న రఘువరన్ని జర్నలిస్టు పాత్రలో అర్జున్ ఇంటర్వ్యూ చేస్తాడు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆ చట్టం జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ గట్టిగా చెబుతున్నారు. ఇది చాలా ప్రమాదకరమనీ ప్రజల భూములను దోచుకునేందుకు కుట్రపూరితంగా జగన్ సర్కార్ దీనిని తీసుకువచ్చిందని విమర్శిస్తున్నారు.
అబూజ్ మడ్ దట్టమైన అటవీ ప్రాంతం. కేవలం రెండు నెలల వ్యవధిలో ఇక్కడ జరిగిన ఎన్కౌంటర్లలో 90 మంది చనిపోవడమంటే.. కచ్చితంగా ఈ అబూజ్ మడ్ పైనే సర్కార్ సీరియస్ గా దృష్టి సారించినట్టు అర్థం చేసుకోవచ్చు.
ఏపీ ఇన్ చార్జ్ డీజీపీ రాజేంద్రనాథ్ పై కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసిన విషయం విధితమే. ఈ క్రమంలో కొత్త డీజీపీ నియామకం కోసం ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సీఎస్ జవహర్ రెడ్డి ముగ్గురి పేర్లతో కూడిన జాబితాను పంపారు. ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు, మాదిరెడ్డి ప్రతాప్, హరీశ్ కుమార్ గుప్తా పేర్లను సీఎస్ ఈసీకి పంపారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బిఆర్ఎస్ , బిజెపిలు పాలు నీళ్లలో కలిసి ఉండేవారు. బిజెపి బి టీం బిఆర్ఎస్ అని ప్రతిపక్షాలు ఆరోపించాయి. అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ భారీ పరాజయంతో రెండు పార్టీల మధ్య అగాథం బాగా పెరిగాపోయింది
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీచర్లు వైసీపీ ప్రభుత్వంతో పూర్తిగా తెగతెంపులు చేసేసుకున్నారా? మరో సారి జగన్ ను నమ్మే పరిస్థితి లేదని విస్పస్టంగా చెప్పేశారా? అంటే పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకోవడం కోసం వారు దరఖాస్తు చేసుకుంటున్న తీరును బట్టి ఔనని అనక తప్పదు.
వైసీపీ నాయకుడు జగన్కున్న మానసిక వ్యాధి పేరు ‘నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్’ అని, దాన్ని షార్ట్కట్లో ‘నార్సి’ అంటారని,