శిధిలం నుంచి శిఖరం దిశగా..నవ్యాంధ్రప్రదేశ్

Publish Date:Jun 8, 2016

Advertisement

సుసంపన్నంగా అలరారుతున్న తెలుగుజాతిని రెండు ముక్కలు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఆదాయాన్ని, ఆస్తులను తెలంగాణకి, అప్పులను ఆంధ్రకు పంచారు. అలాంటి సమయంలో దిక్కుమొక్కు లేని రాష్ట్రాన్ని ఒడ్డున పడేయగల నాయకుడు కావాలి.  కేంద్రప్రభుత్వ సంస్థలు...రాజధాని..వేల కోట్ల ఆస్తులు అన్ని హైదరాబాద్‌లోనే మిగిలిపోయాయి. అంత నిరాశలోనూ ఒక్కటే ఆశ..ఒక్కడి మీదే ఆశ..ఒక్కడున్నాడన్న భరోసా...ఆ  ఒక్కడు..తొమ్మది సంవత్సరాల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి బాట పట్టించిన మొనగాడు. పాలనకే కొత్త భాష్యం చెప్పిన అడ్మినిస్ట్రేటర్. ఆయనే నారా చంద్రబాబు నాయుడు. ఆయన మాత్రమే ఇప్పుడున్న పరిస్థితి నుంచి ఒడ్డున పడేయగలడని ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిర్ణయించుకుని తెలుగుదేశం పార్టీకి పట్టంగట్టారు. జూన్ 8, 2014 నాడు నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. అలా ఆయన అధికారంలోకి వచ్చి నేటితో రెండు సంవత్సరాలు పూర్తైంది.

 

ఆయన బాధ్యతలు చేపట్టేనాటికి ఏపీ పరిస్థితి మునిగేనావ లాంటిది. రాజధాని లేదు..ఆదాయం లేదు..పాతాళంలా కనిపించే రెవెన్యూలోటు..చేతిలో చిల్లిగవ్వ లేదు. మళ్లీ మొదటి నుంచి మొదలుపెట్టాలన్న ఆలోచనతో తలచుకుంటేనే సగటు ఆంధ్రుడి గుండె చెరువైపోతోంది. ఇలాంటి పరిస్థితిలో అధికారం ముళ్ల కిరీటం లాంటిది. వేరే ఎవరైనా అయితే భయపడి పారిపోయేవారు కాని అక్కడుంది చంద్రబాబు. తన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని గెలిచిన మొండి ధైర్యం ఆయన సొంతం. అన్యాయం జరిగిందని ఆగిపోకుండా.. ఒక సవాల్‌గా స్వీకరించారు. పరిపాలనలో ఎదురయ్యే చిక్కుముళ్లను అధిగమిస్తూనే..సుధీర్ఘమైన ప్రణాళికతో రాష్ట్ర పునర్‌నిర్మాణం కోసం శ్రమిస్తున్నారు.

 

అధికారంలోకి వస్తూనే కరెంట్ కష్టాలను అంచనా వేసి ముందుగా మెల్కొని రాష్ట్రానికి 24 గంటల విద్యుత్ సౌకర్యాన్ని కల్పించారు. ఈ సమయంలో ఆయన ముందున్న ప్రధాన సమస్య రాజధాని..రాజధాని ఎక్కడో చెప్పకుండా కట్టుబట్టలతో బజారుకిడ్చింది కాంగ్రెస్ పార్టీ. అధికారంలోకి రాగానే రాజధాని ఎంపిక కమిటీని నియమించి అనేక తర్జనభర్జనల మధ్య అమరావతిని రాజధానిగా నిర్ణయించారు బాబు. అంతేకాదు భారతదేశంలో ఏ ప్రభుత్వానికి సాధ్యం కాని రీతిలో రైతుల నుంచి 33 వేల ఎకరాల భూమిని రాజధాని కోసం సేకరించారు. దీని కోసం రైతుల నుంచి ఘర్షణలు లేవు, ఉద్యమాలు జరగలేదు. దటీజ్ చంద్రబాబు. అలనాటి అమరావతిని మించిన మహానగరాన్ని నిర్మించాలనే మహా సంకల్పంతో రంగంలోకి దిగి..విదేశీ సంస్థల్ని సైతం రంగంలోకి దింపి, దేశం కాదు ప్రపంచం మొత్తం మాట్లాడుకునేలా చేశారు.

 

రాష్ట్రానికి వెన్నెముక లాంటి వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి పెట్టారు చంద్రబాబు. రాష్ట్రం ఆర్థిక లోటుతో సతమతమవుతున్నా తను ఇచ్చిన మాటకు కట్టుబడి రైతు రుణమాఫీని అమలు చేశారు. వ్యవసాయానికి మూలాధారమైన సాగునీటి రంగాన్ని బలోపేతం చేయాలని ప్రణాళిక రూపొందించి, మహమహులు సైతం టచ్ చేయడానికే భయపడిన నదుల అనుసంధానాన్ని విజయవంతంగా చేసి చూపించారు చంద్రన్న. 2018 నాటికి పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడంతోపాటు తోటపల్లి, హంద్రీనీవా, గాలేరు-నగరి, వెలుగొండ ప్రాజెక్ట్, వంశధార-2, పట్టిసీమ ప్రాజెక్ట్‌లను పట్టాలపైకి ఎక్కించారు. విడిపోతే జీతాలు కూడా ఇవ్వలేమన్న భయం నుంచి సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల కంటే అధికమొత్తంలో జీతభత్యాలు ఇచ్చే స్థాయికి రాష్ట్రాన్ని చేర్చారు. ఇక సంక్షేమ రంగం గురించి చూస్తే రూ. 200గా వృద్థాప్య పెన్షన్‌ను రూ. 1500కు పెంచి ఎన్ని కష్టాలు వచ్చినా అభాగ్యులకు అండగా నిలబడ్డారు. అంతేకాదు సంక్షేమంలో జరుగుతున్న అవినీతిని అరికట్టడానికి బయోమెట్రిక్ విధానాన్ని అమలులోకి తెచ్చి సంక్షేమ ఫలాలు పేదవాడి ఇంటికి చేరేలా చేశారు.

 

విభజనకు ముందు ఉన్నత విద్యాసంస్థలన్ని హైదరాబాద్‌లోనే ఉన్నాయి. అయితే చంద్రబాబు ఏపీ పునర్విభజన చట్టంలో పేర్కొన్న మేరకు కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి తిరుపతిలో ఐఐటీ, ఐఐఎస్‌ఈఆర్, విశాఖలో ఐఐఎం, తాడేపల్లిగూడెంలో నిట్, కర్నూలులో ట్రిపుల్ ఐటీ, మంగళగిరిలో ఎయిమ్స్‌ ఇలా ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్ని ఏపీకి తీసుకువచ్చారు. ఏ రాష్ట్రమైనా ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే వ్యవసాయంతో పాటు పారిశ్రామీకీకరణ కూడా అత్యవసరం. ఈ విషయం చంద్రబాబుకు తెలిసినంతగా ఎవరికి తెలియదు. అలాంటి ముందుచూపుతోనే అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌కు ఎన్నో ప్రతిష్టాత్మక సంస్థలను కర్ణాటక, తమిళనాడు, గుజరాత్‌లతో పోటీపడి మరి తీసుకువచ్చారు. ఇప్పుడు నవ్యాంధ్ర వేగంగా కోలుకోవాలంటే శీఘ్రగతిన పారిశ్రామికీకరణ జరగాలి. అందుకే అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే ఆయన జపాన్, సింగపూర్, మలేషియా వంటి దేశాల్లో పర్యటించి ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను  అక్కడి పారిశ్రామికవేత్తలకు వివరించారు. చంద్రబాబు కృషి ఫలితంగా తొలి ఏడాదిలోనే రూ. 3.5 లక్షల కోట్ల పెట్టుబడులను ఏపీ ఆకర్షించింది. అంతేకాదు స్నేహపూర్వక పారిశ్రామిక వాతావరణంలో దేశంలోనే రెండో స్థానంలో కొనసాగుతోంది. శ్రీసిటీ అంతర్జాతీయ పెట్టుబడులకు కేంద్రంగా మారింది. అనేక దేశీయ, అంతర్జాతీయ సంస్థలు ఇక్కడి నుంచి కార్యకలాపాలు సాగిస్తున్నాయి..మరికొన్ని సంస్థలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి.

 

ఇవి మాత్రమే కాకుండా గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, నాలుగు లైన్ల రహదారులు, పర్యాటక సర్క్యూట్లు, మీ ఇంటికి మీ భూమి, స్మార్ట్ ఏపీ, స్మార్ట్ విలేజ్, పోర్టులు, విమానాశ్రయాలు ఇలా బృహత్ ప్రణాళికతో రాష్ట్రాన్ని శిథిలం నుంచి శిఖరాగ్రానికి చేర్చేందుకు ఒక శ్రామికుడిలా కష్టపడుతున్నారు చంద్రన్న. ఈ సమరంలో ఎన్నో అటుపోట్లను ఆయన ఎదుర్కోన్నారు..ఇంకా ఎదుర్కొంటూనే ఉన్నారు. సోదర తెలంగాణ రాష్ట్రం చీటికి మాటికి కయ్యానికి కాలు దువ్వడం, సంస్థలు, ఉద్యోగుల విభజన ఇంకా పూర్తికాకపోవడం, కేంద్ర ప్రభుత్వ సాయం అనుకున్న స్థాయిలో లేకపోవడం, కులాల కుమ్ములాటలు, ప్రతిపక్షనేత నుంచి ఇబ్బందులు వంటి సమస్యలు ముఖ్యమంత్రిని వేధిస్తున్నాయి. వీటికి తోడు పరిపాలనలో కీలకమైన సచివాలయ ఉద్యోగులు అనుకున్న సమయానికి అమరావతికి చేరుకోకపోవడంతో చంద్రబాబు డీలా పడుతున్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం నిర్విరామంగా శ్రమిస్తున్నా తనతో కలిసివచ్చే వారు లేకపోవడం ఆయన్ని మానసికంగా క్రుంగదీస్తోంది. అయినా ధృడ సంకల్పంతో ముందుగా సాగుతున్న చంద్రబాబు ఆంధ్రులు కలలుగన్న స్థాయికి రాష్ట్రాన్ని తీసుకువెళ్లాలని ఆకాంక్షిద్దాం.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.