ఏపీలో విద్యుత్ ఫుల్: చంద్రబాబుకే ఫుల్ క్రెడిట్

Publish Date:Dec 3, 2014

Advertisement

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేప్పట్టిన మూడు నెలలలోనే చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర విద్యుత్ సంక్షోభం అరికట్టిన తీరు గమనిస్తే ఆయన చాలా ముందు చూపుతో చాలా చురుకుగా చర్యలు చెప్పట్టినట్లు అర్ధమవుతోంది. అందుకే ఆయన స్పీడు మేము అందుకోలేకపోతున్నామని ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ చెప్పడం అతిశయోక్తికాదనిపిస్తోంది.

 

చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించక ముందే డిల్లీ వెళ్లి రాష్ట్రానికి నిరంతరాయ విద్యుత్ సరఫరా పైలట్ ప్రాజెక్టుని సంపాదించుకొచ్చిన సంగతి అందరికీ తెలుసు. ఆ తరువాత కూడా అదే మెరుపు వేగంతో కేంద్రం నుండి అదనపు విద్యుత్, మహారాష్ట్రలో వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్ నుండి రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు బొగ్గు సరఫరా వంటివి అన్నీ చక్కబెట్టేయడంతో రెండు మూడు నెలలలోనే రాష్ట్రం విద్యుత్ సంక్షోభం నుండి బయటపడగలిగింది. ఆయన కార్యదీక్ష చూసి కేంద్ర విద్యుత్ శాఖామంత్రి పీయూష్ గోయల్ సైతం మెచ్చుకోలేకుండా ఉండలేకపోయారు.

 

రాష్ట్రం విద్యుత్ సంక్షోభం నుండి బయటపడింది కదాని చంద్రబాబు నాయుడు చేతులు దులిపేసుకోకుండా, 2015-16సం.లలో అవసరమయిన విద్యుత్ కోసం ఇప్పటి నుండే అన్ని ఏర్పాట్లు పూర్తిచేయడం గమనిస్తే కామినేని మాటలు నిజమని అంగీకరించక తప్పదు.

 

వచ్చే ఏడాదిలో ముఖ్యంగా వేసవిలో విద్యుత్ డిమాండ్ ను దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే వివిధ విద్యుత్ సంస్థలతో 2,000మెగావాట్స్ విద్యుత్ సరఫరా కోసం ఒప్పందాలు చేసుకొన్న ఏపీ ట్రాన్స్ కో సంస్థ, తమిళనాడు, ఓడిషా, కర్ణాటక రాష్ట్రాలలో గల 20 ప్రైవేట్ విద్యుత్ ఉత్పత్తి సంస్థల నుండి అదనంగా ఇంకో 2,100 మెగావాట్స్ విద్యుత్ సరఫరా కోసం కూడా ఒప్పందాలు చేసుకొంది. కేవలం ధర్మల్ విద్యుత్ సంస్థల నుండే కాక హైడల్ మరియు సోలార్ (619 మెగావాట్స్) విద్యుత్ ఉత్ప్పత్తి కేంద్రాల నుండి కూడా విద్యుత్ పొందేవిధంగా ఒప్పందాలు చేసుకొన్నారు. తద్వారా విద్యుత్ సరఫరాలో ఎటువంటి అంతరాయం కలగకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకొన్నారు.

 

ఓడిషాలో గ్రిడ్ కో సంస్థ నుండి 300 మెగావాట్స్, కర్ణాటకలోని శాతవాహన మరియు జే.యస్. డబ్ల్యు. నుండి 780 మెగావాట్స్ విద్యుత్ సరఫరా కోసం ఒప్పందాలు చేసుకొన్నారు. తమిళనాడులోని మీనాక్షి సింహపురి, థర్మల్ టెక్ మరియు జైస్వాల్ పవర్ కంపెనీలతో, ఇతర రాష్ట్రాలలో స్టెరిలైట్, జేపీయాల్, టాటా పవర్, స్టెరిలైట్ ఎనర్జీ, సల్సర్ స్టీల్, వందన విద్యుత్, మరియు జి.యం.ఆర్.ఈ.టి.యల్. విద్యుత్ ఉత్పత్తి సంస్థలతో ఒక యూనిట్ రూ. 3.50 నుండి రూ. 4.00 ధరతో విద్యుత్ సరఫరా చేసేలా ఒప్పందాలు జరిగాయి.

 

అదేవిధంగా కేంద్రప్రభుత్వ సహకారంతో అనంతపురం, చిత్తూరు, కర్నూలు జిల్లాలలో ఏర్పాటు చేయబడిన సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలతో కూడా విద్యుత్ సరఫరా కోసం ఒప్పందాలు జరిగాయి. అయితే ఈ సోలార్ విద్యుత్ ధర చాలా అధికంగానే ఉంది. ఒక్కో యూనిట్ ధర రూ. 8.22 నుండి రూ. 17.91 వరకు ఉంటుంది. కానీ ఏపీ ట్రాన్స్ కో సంస్థ మాత్రం రూ. 3.70 మాత్రమే చెల్లిస్తుంది. మిగిలిన దానిని కేంద్రప్రభుత్వమే సదరు సంస్థకు నేరుగా చెల్లిస్తుంది. ఈ రాయితీ సోలార్ విద్యుత్ పధకంలో తొలుత అనంతపురం నుండి 40 మెగావాట్స్, చిత్తూరులో గల ఎక్మీ సోలార్ నుండి 40 మెగావాట్స్, అనంతపురం, చిత్తూరు మరియు కర్నూలులోగల ఎక్మీ క్లీన్న్ టెక్ నుండి 160 మెగావాట్స్, సింగపూర్ కి చెందిన సన్న్ ఎడిషన్ ఎనర్జీ హోల్డింగ్స్ నుండి 30 మెగావాట్స్, రెయిన్ సిమెంట్స్ నుండి 22 మెగావాట్స్ విద్యుత్ సరఫరా చేసేందుకు ఒప్పందాలు జరిగాయి.

 

ఇక ప్రస్తుతం కృష్ణపట్నంలో నిర్మాణంలో ఉన్న రెండవ థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుండి త్వరలోనే రాష్ట్రానికి 800 మెగావాట్స్ విద్యుత్ కూడా అందుబాటులోకి వస్తుంది. ఈ ఒప్పందాలన్నిటి కారణంగా వచ్చే సం.లో రాష్ట్రంలో ఎక్కడా విద్యుత్ కోతలు ఉండకపోవచ్చునని ఏపీ ట్రాన్స్ కో సంస్థ చైర్మన్ కే. విజయానంద్ తెలిపారు.

 

ఇవికాక తూర్పు గ్రిడ్ నుండి మరో 2,000 మెగావాట్స్ విద్యుత్ సరఫరాకు అవకాశం ఉంది. కానీ అక్కడి నుండి రాష్ట్రానికి విద్యుత్ సరఫరా చేసేందుకు ట్రాన్స్ మిషన్ లైన్లు వేయవలసి ఉంది. అందుకోసం కూడా ప్రయత్నాలు మొదలయ్యాయి. అయితే వాటి నిర్మాణం పూర్తయ్యేందుకు ఇంకా చాలా కాలం పడుతుంది కనుక వచ్చే ఏడాదిలో అక్కడి నుండి విద్యుత్ సరఫరా రాలేకపోవచ్చును. కానీ భవిష్యత్తులో అక్కడి నుండి 2,000 మెగావాట్స్ విద్యుత్ సరఫరాకు అవకాశం ఉందని స్పష్టమవుతోంది.

 

ఇరుగు పొరుగు రాష్ట్రాలతో విద్యుత్ సరఫరా కోసం ఒప్పందాలు చేసుకొంటూనే మరోవైపు రాష్ట్రంలో థర్మల్ మరియు సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు చంద్రబాబు నాయుడు గట్టిగా కృషి చేస్తున్నారు. వచ్చే ఏడాదికి బయట రాష్ట్రాల నుండి కొంత విద్యుత్ కొనుగోలు చేయవలసి వచ్చినా 2016-17నాటికి రాష్ట్రం విద్యుత్ ఉత్ప్పత్తిలో స్వయం సంవృద్ది సాధించి, ఇతర రాష్ట్రాలకు కూడా విద్యుత్ సరఫరా చేయగల స్థితికి చేరుకోగలదని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

By
en-us Political News

  
అధికారం కోల్పోయిన తర్వాత ప్రజల్లో సానుభూతిని తిరిగి సంపాదించుకోవడానికి, అలాగే ప్రస్తుత కూటమి ప్రభుత్వాన్ని శాంతిభద్రతల విషయంలో ఇరకాటంలో పెట్టడానికే వైసీపీ ఈ బాట ఎంచుకుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే.. ఈ తరహా రాజకీయ వ్యూహాలు వైసీపీకి ప్లస్ అవ్వడం అటుంచి బూమరాంగ్ అవుతూ.. ఆ పార్టీకి మరింత వ్యతిరెకత జనంలో కలగడానికి మాత్రమే దోహదపడుతున్నదంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేం అధినేత నారా చంద్రబాబు నాయుడుపై రాజకీయంగా తీవ్ర విమర్శలు గుప్పించే కేటీఆర్.. తాజాగా చంద్రబాబు పాలనా దక్షత, ఆయన ముందుచూపును అభినందించారు. కేటీఆర్ చంద్రబాబును అభినందించడం తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారింది.
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడికి సంబంధించిన హిట్ అండ్ రన్ కేసు విషయంలో జగన్ మాట్లాడిన మాటలు అసలాయనకు చట్టాలు తెలుసా? ఈ వ్యక్తా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఐదేళ్లు అధికారం చెలాయించింది అన్న అనుమానాలు కలగక మానవు.
యూట్యూబర్ ప్రశ్న రావణ్ అరెస్టుపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన ఒక బహిరంగ వేదికపై తాజాగా ఏబీ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. వేదికపై వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా ఉన్నారు. జగన్ హయాంలో తీవ్రంగా నష్టపోయిన ఏబీవీ, ఇలా వైసీపీ నేతలతో కలిసి ఒకే వేదికపై కనిపించడం రాజకీయవర్గాలలో చర్చకు తెరలేపింది.
హరీష్ రావు అతి తొందరలో కారు దిగి కాషాయ జెండా పట్టుకుంటారనీ, ఆ దిశగా హరీష్ ఇప్పటికే బీజేపీ కీలక నేతలతో సంప్రదింపులు కూడా జరిపారనీ రేవంత్ పేర్కొన్నారు. తాను చెప్పిన మాటలు అవాస్తవమని హరీష్ రావు భద్రాద్రి రామునిపై ఓట్టేసి చెప్పగలరా అని సవాల్ చేశారు.
ప్రశ్న రావణ్ విషయంలో పూటకోమాట, రోజుకో స్టాండ్ అన్నట్లుగా వ్యవహరించి వరుసగా సెల్ఫ్ గోల్స్ చేసుకుంటూ పోయింది.
దివంగత ముఖ్యమంత్రి, తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు మనవడు, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు,  ప్రస్తుత బీజేపీ ఎంపీ పురందేశ్వరిల కుమారుడు దగ్గుబాటి హితేష్ చెంచురాం త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్లు సమాచారం
గతంలో అంటే జగన్ హయాంలో అభివృద్ధి అంటే సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు అన్న పరిస్థితి నుంచి ప్రస్తుత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం.. పెద్ద ఎత్తున మౌలిక వసతుల కల్పన, రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పనుల పరుగులతో నిజమైన అభివృద్ధి జనం కళ్లకు కనిపించేలా చేస్తోంది.
ఇటీవలి కాలంలో కాపు సామాజికవర్గం కేంద్రంలో పార్టీలో జరుగుతున్న పరిణామాలను ఉదహరిస్తూ.. జగన్ బోత్సనుపక్కన పెట్టడానికి అనారోగ్యం ఒక్కటే కారణం కాదని విశ్లేషిస్తున్నారు. తమ విశ్లేషణకు రుజువుగా, బీజేపీ సీనియర్ నాయకుడు సోము వీర్రాజు ఇటీవల ఒక సందర్భంలో వైసీపీలో కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యత తగ్గుతోందంటూ చేసిన వ్యాఖ్యలను చూపుతున్నారు. ఇక బొత్స స్థానంలో మండలిలో విపక్ష నేత పదవిని ఒక మహిళా నేతకు కట్టబెట్టాలన్న ఉద్దేశంతో జగన్ ఉన్నట్లు వైసీపీ వర్గాలలో టాక్ నడుస్తోంది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ కేవలం 11 స్థానాలకే పరిమితమై అధికారానికి దూరమవ్వడమే కాకుండా, కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోని సంగతి తెలిసిందే. అంతటి ఘోర పరాభవం ఎదురైనా జగన్ తీరులో మార్పు రాలేదన్న అసంతృప్తి వైసీపీ నేతలలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.
ప్రకృతి గర్భంలో దాగి ఉన్న కొన్ని రహస్యాలు సైన్స్‌కు కూడా సవాల్ విసురుతుంటాయి.
భవిష్యత్ లో జగన్.. సపోజ్ ఫర్ సపోజ్ అధికారంలోకి వస్తే.. అమరావతిలో ప్రస్తుత ప్రభుత్వం నిర్మించిన భవనాలను వినియోగంలోకి తీసుకువచ్చే అవకాశాలు లేవని విశ్లేషిస్తున్నారు.
మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాలను కలుపుతూ ఈ సరికొత్త రాజధాని నమూనాను ఆయన తొలిసారి ప్రస్తావించినప్పుడు.. అన్ని వర్గాల నుంచీ తీవ్ర వ్యతిరేకత రావడమే కాకుండా, నెటిజనులు జనగ్ ను ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు. అయినా తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లన్నట్లుగా జగన్ మావిగన్ ను వదల లేదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.