నాలుగుగోడల మధ్యా తొడగొట్టిన చందంగా జగన్ ప్రెస్ మీట్లు.!

Publish Date:Aug 14, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ బాయ్ కాట్ నిర్ణయంపై ఇప్పుడు హాట్ హాట్ చర్చ జరుగుతోంది. డిస్ క్వాలిఫై చేయాలి. జీత భత్యాలు నిలిపివేయాలి  అంటూ వెల్లువెత్తుతున్న డిమాండ్లను పక్కన పెట్టినా.. జగన్ శైలి, తీరు పట్ల పొలిటికల్ సర్కిల్స్ లో హా పెద్ద ఎత్తున జరుగుతోంది.  అసెంబ్లీ వేదికగా  ప్రజా సమస్యలపై గళమెత్తాల్సిన వైసీపీ..   ప్రతిపక్ష హోదా అంటూ సభా సమావేశాలను బాయ్ కాట్ చేయడం.. యుద్ధ రంగంలోకి దిగకుండా నాలుగు గోడల మధ్యా కూర్చుని తొడగొడుతున్న చందంగా ఉందని పరిశీలకులు అంటున్నారు. యుద్ధ భూమిలో వెన్ను చూపడం ఎలాంటిదో.. రాజకీయ సమరంలో ప్రజాస్వామ్య దేవాలయం అసెంబ్లీకి గైర్హాజరు కావడం కూడా అలాంటిదేనని పరిశీలకులు అంటున్నారు.    ప్రజలు ఇవ్వని11 మంది ఎమ్మెల్యేలతో విపక్ష హోదా అన్నది నిబంధనల ప్రకారం అవకాశం లేదు. ఆ సంగతి తెలిసికూడా ప్రతిపక్ష హోదా  కోసం మంకుపట్టు పడుతూ సభా సమావేశాలకు దూరంగా ఉండటం ఆయన పరిణితి లేమికి, పలాయనవాదానికీ నిదర్శనంగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. ఇదే ఆయనలోని నాయకత్వసమర్థతపై కూడా సందేహాలకు తావిస్తోందంటున్నారు.  

చట్టసభ వేదికగా ప్రజల సమస్యలను వినిపించడం, ప్రభుత్వ పథకాలు, విధానాలలో ఉన్న లోపాలను ఎండగట్టాల్సిన ఆయన.. ప్రతిపక్ష హోదా కోసం సభా బహిష్కరణకు నిర్ణయించుకోవడం సమజసం కాదన్న అభిప్రాయమే సర్వత్రా వ్యక్తమౌతోంది.  నియమ నిబంధనల ప్రకారం అసెంబ్లీలో మొత్తం స్థానాలలో కనీసం పది శాతం సభ్యుల బలం ఉన్న పార్టీకే అధికారికంగా ప్రతిపక్ష నేత హోదా దక్కుతుంది. 2024   అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో వైకాపా కేవలం 11 స్థానాలకే పరిమితం కావడంతో.. ఏ రకంగా చూసినా, ఆయన ఎంతగా పట్టుబట్టినా ప్రతిపక్ష హోదా దక్కే అవకాశం ఇసుమంతైనా లేదు. ఐదేళ్లు రాష్ట్రానికి సీఎంగా పని చేసిన జగన్ కు ఆ విషయం తెలియని భావించలేం. ఒక వేళ విపక్ష హోదా లేకపోయినా.. జగన్ పులివెందుల ఎమ్మెల్యేగా అయినా సభకు హాజరై నియోజకవర్గ సమస్యలను ప్రస్తావించాలి. తనను నమ్మి గెలిపించిన పులివెందుల ప్రజల పట్ల ఆ మాత్రమైనా బాధ్యత వహించాలి.   పులివెందుల నియోజకవర్గ ప్రజాప్రతినిధిగా, వైసీపీ  అధినేతగా జగన్ సభకు హాజరై  ప్రభుత్వాన్ని నిలదీయడం మాని తనకు వీలున్నప్పుడు, వీలైనప్పుడు మాత్రమే బెంగళూరు ప్యాలెస్ నుంచి తాడేపల్లి ప్యాలెస్ కు వచ్చి మీడియాకు ముఖం చూపించి తన పని ఇంతే అన్నట్లు వ్యవహరించడంపై పార్టీ శ్రేణుల్లోనే అసంతృప్తి వ్యక్తం అవుతోంది.  

అసెంబ్లీకి దూరంగా ఉంటూ  తాడేపల్లి ప్యాలెస్ లో  మీడియా సమావేశాలకు పరిమితమై,  ఆ ప్రెస్ మీట్ లలో కూడా రాసుకొచ్చిన స్క్రిప్ట్ చదివేసి అంతేనని చుతులు దులుపుకుపోతున్న జనగ్ తీరు పట్ట వైసీపీ క్యాడర్ లో సైతం అసంతృప్తి వ్యక్తమౌతోంది.   ప్రభుత్వ నిర్ణయాలను సభలో నిలదీస్తే వచ్చె ఎఫెక్ట్ ప్రోస్ మీట్ లో ప్రసంగాల వల్ల రాదని పరిశీలకులు అంటున్నారు. 

  శాసనమండలిలో వైసీపీకి  సంఖ్యాబలం ఉన్నందున, అక్కడ గట్టిగా పోరాటం చేయాలని జగన్ తన ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు సరే.. కానీ  , అసెంబ్లీలో స్వయంగా పార్టీ అధినేత జగన్ పోరాడకుండా ప్యాలెస్ కే పరిమితం అవ్వడం పార్టీ శ్రేణులకే కాదు ప్రజలకు కూడా తప్పుడు సంకేతాలే ఇస్తున్నాయి.  

ఇక పార్టీ శ్రేణుల్లో విశ్వాసాన్ని నిలుపుకోవాలనుకునే నాయుడు ప్రజా పోరాటాల్లో వారిని ముందుండి నడిపించాలే కానీ, పిలుపు ఇచ్చాను చాలదా అన్న తీరున వ్యవహరిస్తే... పార్టీ శ్రేణులు డీలా పడతాయనీ, కంచె చేను సామెత చెప్పినట్లు తాడేపల్లి ప్యాలస్ నుంచే  పార్టీని నడిపిస్తానంటే.. ఆ పార్టీ నేతలూ, శ్రేణులూ కూడా కడపదాటకుండానే  మమ అనిపించేస్తారని అంటున్నారు.  

AP Assembly Sessions, YS Jagan Mohan Reddy Assembly Boycott, Chandrababu Naidu Leadership, AP Political News Telugu, Opposition Status Issue AP

By
en-us Political News

  
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు. 
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం,  హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు. 
 కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.  రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్‌ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.  
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.  తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో  అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.  అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ   అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది. 
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ..  తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ  తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి. 
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది.  సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును  దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి  కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది.  ఈ నేపథ్యంలో తాను కేవలం  మంత్రి పదవిని  మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.