తాత్కాలిక రాజధాని మంచి నిర్ణయమే!

Publish Date:Aug 12, 2014

Advertisement

 

 ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి శాశ్విత రాజధాని నిర్మించడానికి ఎన్ని ఏళ్ళు పడుతుందో తెలియదు కనుక అంతవరకు విజయవాడను తాత్కాలిక రాజధానిగా చేసుకొని పరిపాలన సాగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించుకొన్నారు. వెంటనే అన్ని ప్రభుత్వ శాఖల ప్రధాన కార్యాలయాలను విజయవాడ తరలించేందుకు అక్కడ తగిన భవనాలను గుర్తించి సిద్దం చేయమని అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేసారు. గన్నవరం విమానాశ్రయం సమీపంలో గల ఐటీ పార్కులో గల మేధా టవర్స్ భవన సముదాయాన్ని కూడా పరిశీలించమని ఆదేశించారు. బహుశః అక్కడ తన కార్యాలయాన్ని, సచివాలయాన్ని ఏర్పాటు చేసుకోవాలని భావిస్తున్నారేమో.

 

అయితే ఎక్కడో రాష్ట్రానికి దూరంగా హైదరాబాదులో ఉండి పరిపాలించడమేమిటి? అని ఇంతవరకు విమర్శించినవారే ఇప్పుడు ప్రభుత్వం విజయవాడకు తరలి వచ్చేందుకు సిద్దమవుతుంటే, తెదేపా నేతలకు లబ్ది చేకూర్చేందుకే చంద్రబాబు ఈ ఆలోచన చేశారని విమర్శిస్తున్నారు. అన్ని సౌకర్యాలుగల హైదరాబాదు నుండి మరో పదేళ్ళపాటు పాలన సాగించే అవకాశం ఉండగా, ఇంత హడావుడిగా విజయవాడకు ఎందుకు తరలివస్తున్నారు? అని కాంగ్రెస్ నేతలు బొత్స, రామచంద్రయ్యలు ప్రశ్నిస్తున్నారు. విజయవాడ-గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటుకు చంద్రబాబు ప్రతిపాదనకు ఒక్క రాయలసీమ జిల్లాల ప్రజలు తప్ప వైకాపాతో సహా అందరూ ఆయన నిర్ణయాన్ని సమర్దించారు. ఒకవేళ అక్కడ రాజధాని ఏర్పాటు చేసేమాటయితే, ఆంద్రప్రదేశ్ కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం కూడా అక్కడికే తరలిస్తామని ఆ పార్టీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి స్వయంగా ఇదివరకు చెప్పారు. మరి కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఎందుకు విమర్శలు గుప్పిస్తున్నారంటే, ప్రభుత్వం తీసుకొన్న ఏ నిర్ణయాన్నయినా విమర్శించడమే ప్రతిపక్ష బాధ్యత, అప్పుడే ప్రజల తరపున పోరాడినట్లవుతుంది అనే ఒక అర్ధంలేని సిద్దాంతాన్ని నమ్మడం వలననే.

 

చంద్రబాబు విజయవాడ-గుంటూరు మద్యనే రాజధాని ఉంటుందని మొదటి నుండి చెపుతున్నారు. కానీ ఆయన తొందరపాటు ప్రదర్శించకుండా ముందు ప్రభుత్వంపై పూర్తి పట్టు పెంచుకొని, ఆ తరువాత విజయవాడకు తరలివెళ్ళడంలో సాధ్యాసాధ్యాలను, దానిలో కష్టనష్టాలను పూర్తిగా అవగాహన చేసుకొన్న తరువాతనే ఈ నిర్ణయం తీసుకొన్నారని భావించవచ్చును. అందుకు ప్రతిపక్షాలు ఎన్ని పెడర్ధాలు, వక్ర బాష్యాలయినా చెప్పుకోవచ్చును. కానీ చంద్రబాబు తను మొదటి నుండి చెప్పిందే చేస్తున్నారని మాత్రం స్పష్టమవుతోంది.  ప్రభుత్వం విజయవాడకు తరలిరావడం వలన రాష్ట్రప్రజలందరికీ అందుబాటులో ఉంటుంది. కొత్త రాజధాని నిర్మాణాన్ని దగ్గరుండి పర్యవేక్షించుకోవచ్చును. ముఖ్యమంత్రితో సహా మంత్రులు అందరూ ఇకపై రాష్ట్ర ప్రజలకు అందుబాటులో ఉంటూ, జిల్లాలలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను స్వయంగా పర్యవేక్షించే వీలుంటుంది. ప్రభుత్వం విజయవాడకు తరలివస్తే ఇటువంటివి అనేక ప్రయోజనాలు ఉండవచ్చును. కానీ ప్రభుత్వం హైదరాబాదు నుండి తరలివచ్చేస్తే అక్కడ స్థిరపడ్డ ఆంధ్రప్రజలు తీవ్ర అభద్రతా భావానికి గురయ్యే ప్రమాదం కూడా ఉంది. బహుశః అందుకే ఇంతకాలం చంద్రబాబు నాయుడు హైదరాబాదునే అంటిపెట్టుకొని ఉండి ఉండవచ్చును. రాజధాని విషయంలో నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం జరుగుతున్న కొద్దీ నానాటికీ సమస్యలు పెరుగుతాయే తప్ప తగ్గవని మొన్న కర్నూలులో జరిగిన ‘లక్ష గొంతుల పొలికేక’ ర్యాలీలు నిరూపించాయి.

 

ప్రభుత్వం ఎక్కడో అక్కడ త్వరగా స్థిరపడితే కానీ పరిపాలన గాడిన పడదు. సమస్యలు పరిష్కారం కావు. అభివృద్ధి కార్యక్రమాలు మొదలవవు. కనుక ఇప్పటికయినా చంద్రబాబు దైర్యంగా విజయవాడను తాత్కాలికంగానయినా రాజధానిగా ప్రకటించడం మంచి నిర్ణయమేనని చెప్పవచ్చును.

 

అయితే రాజధాని ఎక్కడ నిర్మించాలనే విషయాన్ని నాయకుడు ఇష్ట ప్రకారమే జరగదని, అందరూ ఎక్కడ కోరుకొంటే అక్కడే ఏర్పాటవుతుందని, అవసరమయితే దీనిపై లోతుగా చర్చించేందుకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడానికి సిద్దం అని చంద్రబాబు ఇదివరకోసారి అన్నారు. ఆ ప్రకారం ఆయన అన్ని పార్టీలతో అఖిలపక్ష సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసుకొని ఉండి ఉంటే, నేడు ఈవిధంగా విమర్శలు ఎదుర్కోవలసిన అవసరం ఉండేది కాదు. కానీ ఎందువలనో ఆయన ఆ పనిచేయలేదు.

 

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.