Publish Date:Aug 24, 2022
తెలుగు రాష్ట్రాలు విడిపోయిన సమయంలో అంతా బాగానేఉంటుంది. అన్నదమ్ములుగానే భవిష్యత్తులో నూ కొనసాగుతాం అంటూ ఎన్నో అనుకున్నాం. కానీ చీటికీ మాటికీ రాజకీయపర సమస్యలు తలెత్తి రెం డు రాష్ట్రాల మధ్య ఏకంగా సరిహద్దు సమస్యల్ని పీకల్లోతు తీసుకువచ్చాయి. తెలుగు రాష్ట్రాల మద్య సరి హద్దు వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ వద్ద రెండు రాష్ట్రాల పోలీసుల మద్య వివాదం జరిగింది. ప్రాజెక్టుపైకి ఏపీకి చెందిన ఎస్ఐ వాహానాన్ని తెలం గాణ పోలీసులు అనుమ తించలేదు. దీంతో ఏపీ పరిధిలోకి వచ్చిన తెలంగాణ పోలీసు వాహనానికి ఏపీ పోలీసులు చలానా రాశారు. దీంతో రెండు రాష్ట్రాల పోలీసుల మధ్య వివాదం ముదిరింది. చివరికి ఈ పంచాయతీ పోలీస్ ఉన్నతాధికారుల వద్దకు చేరింది. ఇరు పోలీసుల మధ్య రాజీ కుదిర్చే పనిలో పోలీసు పెద్దలు ఉన్నారు.
గతంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం రేగింది. అది ఇరు రాష్ట్రాల అధికారులు హద్దు రాళ్లు పాతడం.. పీకేయడం దాకా వెళ్లింది. ఎప్పటికప్పుడు ఒక రాష్ట్రం అధికారులు రాళ్లు పాతడం.. నెంబర్లు వేయడం.. మరో రాష్ట్రానికి చెందిన అధికారులు పీకేయడం పరిపాటిగా మారింది. ఇది దాయా దులైన రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రగులుతున్న సరిహద్దు వివాదం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వా రావుపేట చెక్పోస్టు సమీపంలో ఈ వివాదం తాజాగా మరోసారి వెలుగులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్కు సమీప ప్రాంత మైన అశ్వారావుపేట నుంచి అటు పశ్చిమగోదావరికి.. ఇటు తూర్పు గోదావరికి.. మరోవైపు తెలంగాణలోని మిగిలిన జిల్లాలకు రహదార్లున్నాయి. సూర్యపేట- దేవరపల్లి జాతీయ రహదారి ఇక్కడి నుంచే వెళ్తుం టుంది. అయితే రాష్ట్ర విభజన సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య స్పష్టమైన విభజన రేఖ ఉన్న ప్పటికీ అధికారుల వైఖరి వల్ల అప్పుడప్పుడూ ఇలాంటి సరిహద్దు తగాదాలు వస్తూనే ఉన్నాయి. తాజాగా జీలుగుమిల్లి సమీపంలోని చెక్పోస్టు దగ్గరలో ఉన్న సరిహద్దు '0' కి.మీ రాయిని తీసి పడేసి.. అశ్వారావు పేట పట్టణం చివర్లో '0' కి.మీ గుర్తును చూపుతూ ఏపీ రోడ్లుభవనాల శాఖ అధికారులు రాయిని పాతారు. దీనిపై స్థానికుల ఫిర్యాదు మేరకు తెలంగాణ అధికా రులు తొలగించారు. దీంతో వివాదం మళ్లీ మొద లైంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నపుడు ఖమ్మం జిల్లాలో ఉన్న ప్రాంతం మొత్తం (పోలవరం ముంపు ప్రాం తం మినహాయించి) తెలంగాణలోకి చేరిపోయింది. అయితే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన సరిహద్దు అశ్వారావుపేటకు సమీపంలోని జీలుగుమిల్లివద్ద ఏర్పాటైంది. అక్కడే '0' కి.మీ రాయిని ఏర్పాటు చేశారు. ఆ సమీపంలోనే రెండు రాష్ట్రాలకు సంబంధించిన వ్యవసాయశాఖ, ఎక్సైజ్, రవాణా, వాణిజ్య పన్నుల శాఖ, ఇంకా అటవీశాఖలతో కూడిన ఇంటిగ్రేటెడ్ చెక్పోస్టులను ఏర్పాటు చేసుకు న్నారు. ఈ ప్రాంతం గుండానే (సూర్యపేట- దేవరపల్లి) నేషనల్ హైవే 365బిబి వెళ్తూ ఉంది. ఇలా ఏర్పాటై దాదాపు ఏడేళ్లు కావస్తున్నా ఈ ప్రాంతంలో ఇప్పటికీ సరిహద్దుపై వివాదం రగులుతునే ఉంది.
స్థానికంగా ఉండే కొందరు ఏపీలోనే ఉంటే బాగుంటుందన్న తమ ప్రయోజనాల కోసం అధికారులను ప్రేరేపిస్తున్నారన్న ఆరోపణ కూడా ఉంది. దీంతో అప్పుడప్పుడూ '0' కి.మీ రాయిని ఉన్నచోట నుంచి తీసి, అశ్వారావు పేటకు సమీపం లో అంటే దాదాపు 120 మీటర్లు పైగా జరిపి ఏర్పాటు చేశారు. దీంతో అప్పటికే అక్కడ నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లు ఏపీలోకి వెళ్లిపోయినట్లయింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ap-39-142551.html
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.