అంతర్వేది..ఓ అంతులేని కథ!

Publish Date:Oct 1, 2020

Advertisement

ప్రాపర్టీ రిజిస్టరుకు రెక్కలొచ్చాయట

 

రథ నిర్మాణంలో అగ్నికుల క్షత్రియులకు అన్యాయం

 

ఆలయ కమిటీలో కొప్పనాటి వంశీయులకు చోటేదీ?

 

చర్చిల పాలవుతున్న ఆలయ భూములు

 

టీడీపీ-వైసీపీ-బీజేపీ మూడుస్తంభాలాట

 

అంతులేని ‘అంతర్వేది’ రాజకీయాలు

 

ఓ జమిందారు గారు తన సొమ్ముతో ఆలయ నిర్మాణం చేసి, దాని బాగోగులకు వందల ఎకరాలు దానం చేశారనుకోండి. అప్పుడు ఆ ఆలయానికి ఆ జమిందారు.. ఆయన వారసులు వ్యవస్థాపకులవుతారు కదా? ఆ తర్వాత ప్రభుత్వాలు కూడా అలాంటి వంశ పారంపర్య హక్కును కొనసాగిస్తూ, అన్ని దేవాలయాలకూ భూములిచ్చి, సొంత నిధులతో గుడి నిర్మించిన వారి వారసులనే వ్యవస్థాపక అధ్యక్షులు, ట్రస్టీలుగా గుర్తిస్తోంది కదా? మరి ఈ నిబంధన.. ఒక్క అంతర్వేదిలోనే ఎందుకు అమలు కావడం లేదు? రాజకీయ ‘క్షత్రియుల’ చేతుల్లో ఆలయం ఎందుకు బందీగా మారింది? రక్షించాల్సిన క్షత్రియులు ఆలయ భూముల భక్షకులుగా ఎందుకు మారారు? ర థం తగులబడిపోతే దానిని తయారుచేయించి..  సంప్రదాయం ప్రకారం స్వామి వారికి ఇచ్చే అగ్నికుల క్షత్రియులకు కాకుండా, టెండర్లు కూడా లేకుండా ఇతరుల చేతికి ఎలా అప్పగిస్తారు? పది లక్షలకే తాము రథాన్ని తయారుచేసి ఇస్తామన్న అగ్నికుల క్షత్రియులకు కాకుండా, తెలంగాణలో ఉన్న ఆసామికి 14 లక్షలు పోసి ఆ కాంట్రాక్టు ఇవ్వడంలో మతలబేమిటి? ఆలయ భూముల్లో క్త్రైస్తవ ప్రార్ధనా మందిరాలు వెలుస్తున్నా, భూములు అన్యాక్రాంతమవుతున్నా,  అధికారులు ఎందుకు నిలువరించలేకపోతున్నారు? ఇవీ.. దుండగుల చేతిలో దహనమయిన, అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ ‘అంతులేని కథ’!

 

‘బ్రిటిషర్ల జమానాలో రాజులు శిస్తు కట్టకపోతే వారి భూములు వేలం వేశారు. దానిని అడ్డుకుని తానే సొమ్ము చెల్లించిన గొప్పవాడు కృష్ణమ్మ.  అంత వదాన్యుడు భూములిచ్చి, నిర్మించినదే ఈ అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి ఆలయం’- ఇది ప్రతిఏటా జరిగే అంతుర్వేది శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ ఉత్సవాల్లో,  దేవదాయ శాఖ నిర్వహించే సాంస్కృతిక ప్రదర్శనలో కళాకారులు వినిపించే కథ. కానీ, అంత గొప్ప వదాన్యుడైన కొప్పనాటి కృష్ణమ్మ వారసులను.. ఇప్పుడు అక్కడ జరిగే ఉత్సవాలకు రానీయకుండా అడ్డుకుంటారు. లోపల స్థలం లేదు పొమ్మంటారు. అసలు ఆలయ కమిటీలో వారికే స్థానమే ఇవ్వరు. కృష్ణమ్మ వారసుడైన కొప్పనాటి శ్రీనివాసరావుకు ఇటీవల జరిగిన అవమానం. ఇదీ దాతల పట్ల దయచూపే పాలకుల తీరు. అది కాంగ్రెసయినా, తెలుగుదేశమయినా, బీజేపీ అయినా, వైసీపీ అయినా! అందరూ ఆ తాను ముక్కలే!!

 

అగ్నికుల క్షత్రియ కులానికి చెందిన,  కొప్పనాటి కృష్ణమ్మ అనే మహానుభావుడు బ్రిటీషు కాలంలోనే నౌకాయాన వ్యాపారి. రాజులు శిస్తు చెల్లించకపోతే వారి తరఫున ఆయనే డబ్బు చెల్లించేవారు. అలాంటాయన కష్టాల్లో ఉన్నప్పుడు.. లక్ష్మీనరసింహస్వామి కలలో కనిపించి, నీ బాధలు తీరతాయని అభయమిచ్చారట. దానితో కొట్టుకుపోయిన ఆయన ఓడలన్నీ ఒడ్డుకు చేరాయట. అందుకు ఆయన భక్తితో ఆలయానికి 1800 ఎకరాలు దానం చేసి, సొంత సొమ్ముతో ఆలయం, అందులో ఒక రథం నిర్మించారట. ఇదీ.. క్లుప్తంగా అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయకథ. ఆ మేరకు శాసననాలు కూడా ఉన్నాయి. ప్రాపర్టీ రిజిస్టరులో వాటి వివరాలూ ఉన్నాయి అయినా, ఆ వంశానికి చెందిన వారసులకు ఇప్పటివరకూ ఏ ప్రభుత్వమూ ఆలయ కమిటీలో స్థానం కల్పించలేదు. కృష్ణమ్మ వారసులకు ఆలయ బాధ్యత అప్పగించాలని, దశాబ్దాల నుంచి పోరాడుతున్న అగ్నికుల క్షత్రియులకు ఇప్పటివరకూ మిగిలింది కంఠశేష మాత్రమే.

 

టీడీపీ అధికారంలో ఉన్నప్పడయితే.. అగ్నికుల క్షత్రియుల కొత్త తరం నేతలు, అంతర్వేది ఆలయ పరిరక్షణ సమితి పేరుతో ఆందోళనలు నిర్వహించారు. విజయవాడలో 48 గంటల దీక్ష నిర్వహించారు. దానికి ఇప్పటి ‘గుళ్ల మంత్రి’ వెల్లంపల్లి శ్రీనివాస్, ఇప్పటి ఎంపీ మోపిదేవి వెంకట రమణ హాజరయ్యారు. తాము అధికారంలోకి వస్తే, కృష్ణమ్మ కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు అధికారంలో ఉన్నది వారి పార్టీనే. నాడు ధర్నాలో పాల్గొన్న వెల్లంపల్లి ఇప్పుడు గుళ్లకు మంత్రయితే, మోపిదేవి రమణ ఎంపీ. అయినా ఫలితం శూన్యం.

 

అంతర్వేదిలో రథం తగులబడిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దాని స్థానంలో కొత్త రథం నిర్మిస్తామని వైసీపీ  సర్కారు చెప్పింది. దాని ఖరీదు 90 లక్షలుగా అధికారులు అంచనా వేశారు. రథాన్ని తయారుచేసి, స్వామికి సమర్పించడం అగ్నికుల క్షత్రియుల ఆచారం. కానీ పాలకులు హైదరాబాద్‌లో ఉన్న గణపతి ఆచారి అనే వ్యక్తికి ఆ కాంట్రాక్టు ఇచ్చారట. తాము కేవలం 10 లక్షలకే రథం తయారు చేసి ఇస్తామని ముందుకొచ్చినా..  హైదరాబాద్‌లో ఉన్న వ్యక్తికి 14 లక్షలు, కలపకు మరో 80 లక్షలు ఖర్చు చేస్తామంటున్న సర్కారు తీరుపై, అగ్ని కుల క్షత్రియులు అగ్గిరాముళ్లలవుతున్నారు.

 

ఇప్పుడు రథ నిర్మాణానికి కలప కూడా కొనేశారు. పనులు మాత్రం హైదరాబాద్‌లో ఉన్న కాంట్రాక్టరుతో చేయిస్తున్నారు. అగ్నికుల క్షత్రియుల ఆందోళనకు అదీ ఓ కారణమే. ఆ రథ నిర్మాణ బాధ్యత మాకే ఇవ్వాలని, తమలోనూ నిపుణులున్నారన్నది వారి వాదన. కానీ వారికి ఆ బాధ్యత అప్పగిస్తే, ‘కమిషన’్ల కథమేటి? అందుకే అధికారులు అందుకు ససేమిరా అంటున్నారు. అన్నట్లు.. విశాఖ సర్కారీ స్వామి వారు,  రథాన్ని కలపతో నిర్మించాలని ఉచిత సలహా కూడా ఇచ్చారు.

 

కృష్ణమ్మ కుటుంబానికి స్థానం కల్పించాలని... ఎంత ఒత్తిడి చేసినా పట్టించుకోని టీడీపీ సర్కారు, ఇప్పుడు రథనిర్మాణంపై గొంతెత్తడమే ఆశ్చర్యం. ఆ బాధ్యతను అగ్నికుల క్షత్రియులకే ఇవ్వాలని, టీడీపీ నేత లోకేష్ ట్వీట్ చేయడం వింత. తాము అధికారంలో ఉన్నప్పుడు గాలికొదిలిన అంతర్వేది సమస్యలపై, ఇప్పుడు విపక్షంలోకి వచ్చిన అదే టీడీపీ ఆగ్రహించడం వింతల్లోవింత. మొన్నామధ్య అంతర్వేదికి వెళ్లి, హడావిడి చేసిన బీజేపీ కూడా తక్కువ తినలేదు. కృష్ణమ్మ కుటుంబానికి న్యాయం చేయాలని నాటి బీజేపీ మంత్రి మాణిక్యాలరావును కోరినా, పట్టించుకున్న పాపాన పోలేదు. హిందూకార్డుతో రాజకీయాలు చేస్తున్చ బీజేపీ, ఇప్పుడు చిలకపలుకులు పలకడమే ఆశ్చర్యం.

 

అసలు అంతర్వేది భూముల్లో ఎన్ని తమ అధీనంలో ఉన్నాయి? ఎన్ని పరాధీనంలో ఉన్నాయో ప్రభుత్వాలకే తెలియకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనం. ఆలయ భూముల్లో క్రైస్తవ చర్చిలు కూడా నిర్మించారంటే, అధికారులు భూమల రక్షణ కోసం ఎంత బాగా పనిచేస్తున్నారో అర్ధమవుతుంది. ఇక స్థానికంగా ఓ ‘క్షత్రియ’ నాయకుడు..  నిర్వహకులను ముందుపెట్టి, ఆలయాన్ని శాసిస్తున్నారట. చాలావరకూ ఆలయ భూములన్నీ, సదరు క్షత్రియ నాయకుడి కుటుంబ బినామీల ఏలుబడిలోనే ఉన్నాయట. ఏ పార్టీ అధికారంలో ఉంటే, ఆ పార్టీలో చేరే సదరు నేత.. ఆ అధికార ముసుగులో, ఆక్రమించుకున్న భూములను కాపాడుకుంటున్నారట. అంతర్వేది కథలో ఇదో రకం కుట్ర కోణం! ప్రస్తుతం అంతర్వేది ఆలయం రాజకీయుల చేతిలో బందీగా మారింది.

ఆలయంలో నగలు, దాతలిచ్చిన వస్తువుల వివరాలను.. ప్రాపర్టీ రిజస్టరులో నమోదు చేస్తుంటారు. కానీ, ఇప్పుడా ప్రాపర్టీ రిజిస్టరుకు రెక్కలొచ్చాయంటున్నారు. దానిని చూపించాలని ఎంతమంది డిమాండ్ చేస్తున్నా, అదిగో ఇదిగో అంటూ అధికారులు తాత్సారం చేస్తున్నారు. దీన్నిబట్టి..  అసలు ప్రాపర్టీ రిజిస్టరు ఉందా? లేదా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. అంతేనా ఆలయంలో కృష్ణమ్మకు సంబంధించిన శిలాశాసనాలు కూడా, సమాధి  చేసే కుట్ర జరుగుతోందన్నది అగ్నికుల క్షత్రియుల ఆరోపణ. మరి లక్ష్మీపార్వతి చెప్పినట్లు.. పక్కా హిందువయిన జగన్మోహన్‌రెడ్డి, అంతర్వేదిలో జరుగుతున్న అంతులేని కథకు ముగింపు ఎందుకు పలకడం లేదన్నది ప్రశ్న.

-మార్తి సుబ్రహ్మణ్యం

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.