Publish Date:Mar 29, 2025
అధికారం కోల్పోయిన తరువాత వైసీపీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. ఆ పార్టీ కీలక నేతలు ఒకరి తరువాత ఒకరుగా పార్టీకి రాజీనామా చేసి కూటమి పార్టీలలో సర్దుకుంటున్నారు. ఇక వైసీపీ అధికారంలో ఉండగా ఇష్టారీతిగా చెలరేగి దాడులు, దౌర్జన్యాలు చేసిన నేతలూ, ప్రత్యర్థి పార్టీల నేతలపై అనుచిత వ్యాఖ్యలతో రెచ్చిపోయిన నాయకులపై చట్ట ప్రకారం చర్యలకు కూటమి సర్కార్ ఉపక్రమించింది. దీంతో ఇప్పటికే పలువురు అరెస్టయ్యారు. ఇంకొందరు బెయిలుపై ఉన్నారు. మరి కొందరు బెయిలు కోసం కోర్టులను ఆశ్రయించారు. ఈ పరిస్థితుల్లో వైసీపీకీ, జగన్ కు మరో బిగ్ షాక్ తగలనుందా? అంటే వైసీపీ శ్రేణులే అవునని అంటున్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కీలక నాయకుడు తోట త్రిమూర్తులు వైసీపీని వీడనున్నారని అంటున్నారు. ఆయన జనసేన తీర్ధం పుచ్చోవడం ఖాయమని అంటున్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మంది వైసీపీ నాయకులు పార్టీని వీడిన విషయం తెలిసిందే. ఇప్పుడు తూర్పు గోదావరి జిల్లాలోని రామచంద్రపురం ఎమ్మెల్సీ తోట త్రిమూ ర్తులు కూడా అదే దారిలో నడవనున్నారు. ఇప్పటికే ఐదుగురు వైసీపీ ఎమ్మెల్సీలు పార్టీని వీడారు. తమ ఎమ్మెల్సీ సభ్యత్వాలకు కూడా రాజీనామా చేశారు. తోట త్రిమూర్తులు కూడా రాజీనామా చేయడం జరిగితే వైసీపీని వీడిన ఎమ్మెల్సీల సంఖ్య ఆరుకు చేరుతుంది. ఇప్పటికే ఎమ్మెల్సీలు మర్రి రాజశేఖర్, పోతుల సునీత, జయమంగళ వెంకటరమణ, కర్రి పద్మశ్రీ, బల్లి కళ్యాణ చక్రవర్తి వైసీపీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తోట త్రిమూర్తులు పార్టీని వీడనున్నారన్న ప్రచారం వైసీపీలోనే జోరుగా సాగుతోంది.
తోట త్రిమూర్తులు1994లో స్వతంత్ర అభ్యర్థిగా రామచంద్రపురం నుంచి తొలిసారిగా ఎమ్మెల్యే అయ్యారు. 1995లో తెలుగుదేశంలో చేరి 1999లో అదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2008లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలో చేరారు. 2009లో ఎన్నికలలో ప్రజారాజ్యం అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు. వెళ్లారు. 2019లో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. ఇప్పుడు ఆయన జనసేన గూటికి చేరే ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో పవన్ కల్యాణ్ తో భేటీ అయిన తోట త్రిమూర్తులు ఆయనతో ఫొటో కూడా దిగారు. అప్పటి నుంచీ తోట త్రిమూర్తులు జగన్ కు షాక్ ఇచ్చి జనసేన గూటికి చేరతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/another-big-shock-to-jagan-39-195189.html
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద, పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్షిప్ కాంక్లేవ్లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.