అన్నాహజారే దీక్షలతో అవినీతి అంతం సాధ్యమేనా?

Publish Date:Jan 31, 2015

Advertisement

 

ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే మళ్ళీ మరోమారు ఉద్యమానికి సిద్దం అవుతున్నారు. ఇదివరకు జనలోక్ పాల్ బిల్లు కోసం డిల్లీలో నిరవధిక నిరాహార దీక్ష చేసి యూపీఏ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించిన ఆయన, ఈసారి జనలోక్ పాల్ బిల్లుతో బాటు విదేశాలలో ఉన్న నల్లధనం వెనక్కి రప్పించే అంశం కూడా జోడించి మోడీ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించబోతున్నారు.

 

క్రిందటిసారి ఆయన డిల్లీలో నిరవధిక నిరాహార దీక్ష చేసినప్పుడు యూపీఏ ప్రభుత్వం దిగివచ్చి ఆయనతో చర్చలు జరిపి లోక్ పాల్ బిల్లు ఆమోదించింది. కానీ అది అవినీతిని అరికట్టేవిధంగా లేదని, చాలా లోప భూయిష్టంగా ఉందని, ఆయన దానిని తిరస్కరించారు. కానీ ఎందువలనో అయన మళ్ళీ వెంటనే ఉద్యమించలేదు. తన ఉద్యమాన్ని దేశమంతా వ్యాపింపజేస్తానంటూ ఆయన దేశాటన చేసారు. నిజానికి ఆయన డిల్లీలో కూర్చొని నిరాహార దీక్ష చేసినప్పుడే యావత్ దేశంలో ఒక చైతన్యం ఏర్పడింది. ఆయనకు ఒక ప్రత్యేక గుర్తింపు, గౌరవం కూడా ఏర్పడింది. కానీ అంత గొప్ప ఉద్యమం సృష్టించిన తరువాత ఆయన తన లక్ష్యం నెరవేరే వరకు కొనసాగించకుండా మధ్యలోనే నిలిపివేసి దేశాటనకి బయలుదేరడంతో ఆ ఉద్యమం దేశమంతా విస్తరించకపోగా చప్పున చల్లారిపోయింది. కారణం ఆయన చేస్తున్న ఉద్యమానికి ఒక దశాదిశా లేదని ప్రజలు భావించడం వలననే కావచ్చును.

 

తనతో ఉద్యమించేవారు రాజకీయాలకు, పదవులు, అధికారానికి దూరంగా ఉండాలనేది ఆయన నిశ్చితాభిప్రాయం. ఆ కారణంగానే ఆయన తన ఉద్యమం ద్వారా వచ్చిన గుర్తింపుని ఎన్నికలలో పోటీ చేసి సొమ్ము చేసుకోవాలనుకోలేదు. ఆయన ఆలోచనలు, ఆశయాలు చాలా గొప్పవి కావచ్చు, కానీ అవి నేటి పరిస్థితులకి సరిపోవు. వాస్తవిక పరిస్థితులని, వర్తమాన రాజకీయ తీరు తెన్నులని బట్టి ఆయన కూడా తన ఉద్యమ తీరుతెన్నులు మార్చుకొని ముందుకు సాగుతూ అరవింద్ కేజ్రీవాల్, కిరణ్ బేడీ వంటి నిజాయితీపరులయిన వారిని ఎన్నికలలో నిలబెట్టి వారిద్వారా తన అంతిమ లక్ష్యమయిన అవినీతి నిర్మూలన చేసి ఉండి ఉంటే ఈరోజు దేశ రాజకీయాలు మరొకలా ఉండేవేమో? కానీ ఆయన అందుకు నిరాకరించడంతో ఆయన శిష్యులు చాలా మంది ఆయనకు దూరమయ్యారు. ఎన్నికలలో పాల్గొని ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చేరు కూడా. పైగా కిరణ్ బేడీ ఆయన వ్యతిరేకిస్తున్న బీజేపీలోనే చేరారు కూడా.

 

అయితే అందుకు వారిని కాక ఆయననే నిందించవలసి ఉంటుంది. ప్రజాస్వామ్య పద్దతిలో రాజ్యాంగబద్దంగా అధికారం చేప్పట్టి అవినీతిని నిర్మూలించే అవకాశం ఉన్నప్పటికీ, అది చాలా నేరం అన్నట్లుగా ఆయన భావించడం, తన ఆలోచనలను తన శిష్యులపై బలవంతంగా రుద్దే ప్రయత్నం చేయడం వలననే వారు ఆయనకు దూరమయ్యారు. అడవుల్లో ఉండే మావోయిష్టులు సాయుధపోరాటాల ద్వారా సమాజంలో మార్పు సాధిస్తామని చెపుతుంటారు. కానీ దశాబ్దాలుగా పోరాడుతున్నా వారు సాధించింది ఏమీ లేదు. అన్నా హజారే చేప్పట్టిన ఉద్యమం సాగుతున్న తీరు కూడా ఇంచుమించు అలాగే ఒక దశాదిశా లేకుండా సాగుతోంది.

 

ఆయన మళ్ళీ ఇప్పుడు డిల్లీలో నిరాహారదీక్షలు చేసి మోడీ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు సిద్దమవుతున్నారు. కానీ ఈ పని ఇన్ని నెలలుగా ఎందుకు చేయలేదు? ఇప్పుడే ఎందుకు చేస్తున్నారు? అనే ప్రశ్నలకు ఆయన జవాబు చెప్పవలసి ఉంటుంది. త్వరలో డిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరుగబోతున్నాయి. ఆయన మాజీ శిష్యులు అరవింద్ కేజ్రీవాల్, కిరణ్ బేడీ ఇరువురిలో ఎవరో ఒకరు దానిలో గెలిచి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది. కనుక ఆయన డిల్లీలో దీక్షలు చేసినట్లయితే వారికి ఇబ్బందికర పరిస్థితులు సృష్టించిన వారవుతారు. కనుక అందుకే మళ్ళీ డిల్లీలో దీక్షలకు కూర్చోంటున్నారనే తప్పుడు సంకేతాలు పంపినట్లవుతుంది తప్ప ఆయన కొత్తగా సాధించేదేమీ ఉండకపోవచ్చును. ఎందుకంటే ఈసారి దేశప్రజలు ఆయన ఉద్యమాన్ని ఇంతకు ముందులాగ పట్టించుకోకపోవచ్చును. ఒకవేళ పట్టించుకొన్నా మోడీ ప్రభుత్వం తనకు ఇబ్బంది లేకుండా నేర్పుగా వ్యవహరించి ముగింపజేయవచ్చును.

 

పదేపదే లక్ష్య సాధన చేయలేని ఉద్యమాలు చేయడం వలన ప్రజలకు వాటి మీద నమ్మకం పోతుంది. నల్లధనం, జన లోక్ పాల్ బిల్లు అంశాలు రెండూ కూడా చాలా సంక్లిష్టమయిన వ్యవహరాలు. వాటిని అన్నా హజారే ఉద్యమాల ద్వారా సాధించగలనని భావించడం సరికాదు.

 

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.