రాష్ట్రాభివృద్ధే లక్ష్యం.. తెలుగువారిని అందలం ఎక్కిస్తాం : సీఎం చంద్రబాబు

Publish Date:Jul 1, 2026

Advertisement

 

రాష్ట్రాభివృద్ధితో పాటు ప్రపంచవ్యాప్తంగా తెలుగువారికి గుర్తింపు తీసుకురావడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రజాభీష్టం మేరకే పాలన సాగిస్తూ, ప్రజల జీవితాల్లో శాశ్వత మార్పులు తీసుకురావడమే ప్రభుత్వ సంకల్పమని వెల్లడించారు. నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గంలోని పున్నపువారిపాలెంలో నిర్వహించిన "పేదల సేవలో" కార్యక్రమంలో పాల్గొన్న సీఎం, ప్రజా వేదికపై ప్రసంగిస్తూ ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.

ప్రజలు ఇచ్చిన ఆదరణ, విశ్వాసం తమకు మరింత బాధ్యతను పెంచిందని పేర్కొన్న సీఎం, గత ప్రభుత్వ నిర్ణయాల కారణంగా జిల్లాల పునర్విభజనలో ఏర్పడిన సమస్యలను సరిచేసేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. గూడూరును తిరిగి నెల్లూరు జిల్లాలో విలీనం చేయడంతో పాటు సైదాపురం, కలవాయి మండలాలను కూడా ప్రజల ఆకాంక్షల మేరకు నెల్లూరులో కలిపామని చెప్పారు. ప్రజల అభీష్టం ప్రకారమే పరిపాలన ఉండాలని, పెత్తందారీ విధానాలకు తమ ప్రభుత్వంలో స్థానం లేదని స్పష్టం చేశారు.

ప్రతి కుటుంబానికి భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్న సీఎం, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు సహా 28 వర్గాల లబ్ధిదారులకు పెన్షన్లు అందజేస్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకు రూ.68,598 కోట్లను పెన్షన్ల రూపంలో పంపిణీ చేశామని, ప్రతి నెలా 62.20 లక్షల మందికి రూ.2,712 కోట్ల మేర చెల్లింపులు జరుగుతున్నాయని వెల్లడించారు. పేదల జీవన ప్రమాణాలను మెరుగుపరచేందుకు పీ–4 కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు.

గత రెండేళ్లలో రాష్ట్ర పునర్నిర్మాణానికి పునాది వేశామని సీఎం పేర్కొన్నారు. గత పాలనలో జరిగిన విధ్వంసాన్ని పూర్తిగా సరిదిద్దడానికి సమయం అవసరమని, అయితే సుపరిపాలన దిశగా ఇప్పటికే శుభారంభం జరిగిందని అన్నారు. "మనమిత్ర" వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌర సేవలను ప్రజల చేతిలోకి తీసుకువచ్చామని, సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేస్తున్నామని చెప్పారు.

తల్లికి వందనం, స్త్రీశక్తి, దివ్యాంగ శక్తి, మత్స్యకారుల సేవలో, ఆటో డ్రైవర్ల సేవలో వంటి పథకాలు పేదల జీవన ప్రమాణాలను పెంచేందుకు ఉపయోగపడుతున్నాయని పేర్కొన్నారు. సంపన్న వర్గాలు వెనుకబడిన కుటుంబాలను ఆదుకునేలా పీ–4 కార్యక్రమాన్ని రూపొందించామని, ఆర్థిక అసమానతలను తగ్గించడమే తమ లక్ష్యమని తెలిపారు. లక్షలాది మంది మార్గదర్శకులు బంగారు కుటుంబాలను దత్తత తీసుకుని వారికి తోడ్పాటు అందిస్తున్నారని వివరించారు.

మహిళల సాధికారత ప్రభుత్వ ప్రాధాన్యమని, "వన్ ఫ్యామిలీ – వన్ ఎంటర్‌ప్రెన్యూర్" కార్యక్రమం ద్వారా మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతున్నామని సీఎం చెప్పారు. పొదుపు ఉద్యమంలో డ్వాక్రా మహిళలు దేశానికే ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. వారి విశ్వసనీయత వల్లే బ్యాంకులు పెద్ద ఎత్తున రుణాలు అందించేందుకు ముందుకు వస్తున్నాయని అభినందించారు.

నెల్లూరు జిల్లా అభివృద్ధికి అపార అవకాశాలు ఉన్నాయని పేర్కొన్న సీఎం, రామాయపట్నం పోర్టు, కృష్ణపట్నం పోర్టు, దుగరాజపట్నం షిప్‌బిల్డింగ్ సెంటర్, బీపీసీఎల్ రిఫైనరీ, ఐఎఫ్ఎఫ్‌సీఓ కిసాన్ సెజ్ వంటి ప్రాజెక్టులు జిల్లాను దేశంలోనే అగ్రగామిగా నిలబెడతాయని అన్నారు. గూడూరు ప్రాంతంలో ఇప్పటికే 27 మెగా పరిశ్రమలు ఏర్పడ్డాయని, త్వరలో మెగా ఫర్నిచర్ పార్క్ కూడా వస్తోందని తెలిపారు. పోర్టులు, రైల్వే కనెక్టివిటీ, జాతీయ రహదారి కారిడార్లతో ఈ ప్రాంతాన్ని ప్రధాన లాజిస్టిక్స్ హబ్‌గా అభివృద్ధి చేస్తామని చెప్పారు.

సాగునీటి ప్రాజెక్టులకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని సీఎం పేర్కొన్నారు. 36 ప్రధాన ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించామని, ఇప్పటికే రూ.24 వేల కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలకు నీరు అందిస్తామని హామీ ఇచ్చారు. పునరావాసం కోసం రూ.900 కోట్లు విడుదల చేశామని, ఇప్పటికే రూ.300 కోట్లు చెల్లింపులు జరిగాయని చెప్పారు.

ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పుల ప్రభావం పెరుగుతోందని, ఎల్‌నినో కారణంగా వర్షపాతం తగ్గిందని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. అయినప్పటికీ ప్రాజెక్టుల్లో 65 శాతం మేర నీటి నిల్వలు ఉన్నాయని తెలిపారు. భూగర్భ జలాల పెంపు కోసం జలధార వంటి కార్యక్రమాలు చేపడుతున్నామని, భవిష్యత్తులో నదుల అనుసంధానంపై కూడా దృష్టి సారిస్తామని వెల్లడించారు.

పరిశ్రమలు, ఉపాధి అవకాశాల పెంపే ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు పేర్కొన్నారు. హీరో మోటార్స్ వంటి సంస్థలను రాష్ట్రానికి తీసుకురావడంలో తమ ప్రభుత్వం కీలక పాత్ర పోషించిందని తెలిపారు. కడపలో రాయలసీమ స్టీల్ ప్లాంట్‌కు త్వరలో శంకుస్థాపన జరగనుందని, 2028 నాటికి ఉత్పత్తి ప్రారంభమవుతుందని వెల్లడించారు.

అమరావతి అంశంపై మాట్లాడిన సీఎం, రాష్ట్రానికి స్థిరమైన రాజధాని అవసరమని చెప్పారు. గత ప్రభుత్వ నిర్ణయాల వల్ల రాష్ట్రం రాజధాని విషయంలో గందరగోళానికి గురైందని విమర్శించారు. మూడు రాజధానుల ప్రతిపాదనతో రాష్ట్ర ప్రతిష్ఠ దెబ్బతిన్నదని వ్యాఖ్యానించారు. అమరావతి అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్న తరుణంలో వాటిని అడ్డుకునేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు.

రాజకీయాల్లో బాధ్యతాయుతమైన ప్రవర్తన అవసరమని, నేరస్థులను ప్రోత్సహించే రాజకీయ సంస్కృతి ప్రజాస్వామ్యానికి హానికరమని సీఎం అన్నారు. సామాజిక మాధ్యమాల్లో అసభ్య వ్యాఖ్యలు, వ్యక్తిగత దూషణలు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పేర్కొన్నారు. మహిళా నాయకులపై అవమానకర వ్యాఖ్యలు చేయడం సమాజానికి మంచిది కాదని అన్నారు.

రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజలు అభివృద్ధిని ప్రోత్సహించాలని, శాంతి భద్రతలు, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరిగేలా సహకరించాలని కోరారు. తెలుగు ప్రజల అభ్యున్నతి, రాష్ట్ర పురోగతే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని పునరుద్ఘాటించారు.

కార్యక్రమం అనంతరం వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన ప్రదర్శన స్టాళ్లను ముఖ్యమంత్రి సందర్శించారు. స్వయం సహాయ సంఘాల మహిళలు రూపొందించిన ఉత్పత్తులను పరిశీలించి అభినందించారు. అరటి నారతో తయారు చేసిన వస్తువులు, ఆధునిక కుట్టు యంత్రాలు, ప్రకృతి సేద్యం ఉత్పత్తులు, మత్స్యకారుల కోసం రూపొందించిన సాంకేతిక పరికరాలను సీఎం తిలకించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

By
en-us Political News

  
రేవంత్ రెడ్డి హస్తినలో జరిగే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొంటారు. ఆ సమావేశం అనంతరం అదే రోజు రాత్రి ఆయన ఢిల్లీ నుంచే నేరుగా లండన్  బయలుదేరతారు.
దేశంలో పెట్టుబడుల  ఆకర్షణలో   నవ్యాంధ్రప్రదేశ్  రికార్డు స్థాయి పురోగతి  సాధించింది. పెట్టుబడుల ఆకర్షణలో గత కొన్నేళ్లుగా మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు    రాష్ట్రాలు ఆధిపత్యం కొనసాగుతున్నది. అయితే వాటిని తోసి రాజని ఆంధ్రప్రదేశ్ రెండో స్థానానికి ఎగబాకింది. 
వైద్య నివేదికల ప్రకారం ఇమ్రాన్ తీవ్రమైన గుండె దడ,   రక్తపోటు,  మానసిక ఒత్తిడి సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు అల్వీ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆయనను వెంటనే జైలు నుంచి బయటకు తరలించి,   ఆధునిక ఆసుపత్రిలో స్వతంత్ర వైద్యుల బృందం పర్యవేక్షణలో మెరుగైన చికిత్స అందించాల్సిన అవసరం  ఉందని ఆరిఫ్ అల్వీ చెబుతున్నారు.  
పలు మార్లు ఇండియాపై అంతర్జాతీయ వేదికలపై ఆరోపణలు చేసి, కాశ్మీర్ విషయంలో ఇండయాపై అంతర్జాతీయ వేదికలపై విమర్శలు చేసి భంగపడిన పాకిస్థాన్ కు తాజాగా ఆప్నిస్థాన్ లోని తాలిబన్ ప్రభుత్వం దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలా కౌంటర్ ఇచ్చింది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI అభివృద్ధికి అల్గారిథమ్‌ల కంటే కరెంట్, భూమి, మౌలిక వసతులే అసలైన సవాలుగా మారాయని ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ వెల్లడించారు. ఓపెన్ ఏఐ భాగస్వామ్యంతో 4.25 గిగావాట్ల సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న భారీ ఏఐ ఫ్యాక్టరీ వివరాలు, టెక్నాలజీ భవిష్యత్తు గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.
కింగ్‌డమ్ హార్ట్స్ 4 Kingdom Hearts 4 ల్యాట్ 2027 రిలీజ్ డేట్ ఖరారైంది! డిస్నీ కోకో , స్టార్ వార్స్, బాంబీ, మోఆనా వంటి 6 కొత్త ప్రపంచాలు మరియు D23 ట్రైలర్ విశేషాలను తెలుగులో తెలుసుకోండి.
ఈజిప్ట్‌లోని లక్సార్‌లో ఉన్న పురాతన తీబన్ సమాధి ఆధారంగా ప్రాచీన ఈజిప్షియన్ల అంత్యక్రియల సంస్కృతి, మమ్మీకరణ ఆచారాలు మరియు కాలక్రమేణా వాటిలో వచ్చిన మార్పుల గురించి ఆసక్తికరమైన వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
కేరళ బాక్సాఫీస్ వద్ద లోకేష్ కనగరాజ్ డీసీ చిత్రం రూ.16.5 కోట్ల గ్రాస్‌తో 2026లో హయ్యెస్ట్ గ్రాసింగ్ తమిళ సినిమాగా నిలిచింది. విజయ్ జన నాయగన్ రికార్డును బ్రేక్ చేస్తూ రూ.100 కోట్ల క్లబ్ దిశగా దూసుకెళ్తున్న పూర్తి బాక్సాఫీస్ విశ్లేషణ ఇక్కడ చదవండి.
BWF ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత యువ ఆటగాడు ఆయుష్ శెట్టి సంచలనం సృష్టించాడు. బెంగళూరులో జరిగిన తీవ్ర ఉత్కంఠభరిత పోరులో ప్రపంచ నెం.1, డిఫెండింగ్ ఛాంపియన్ షి యూకీని 21 14, 13 21, 21 19 తేడాతో ఓడించి చారిత్రక విజయం సాధించాడు. పూర్తి కథనం ఇక్కడ చదవండి.
GIC Re మొదటి త్రైమాసిక Q1FY27 ఆర్థిక ఫలితాలలో ప్రీమియం వృద్ధి మందగమనం, పెరుగుతున్న అండర్ రైటింగ్ నష్టాలు మరియు IRDAI కొత్త నిబంధనల ప్రభావంపై సమగ్ర విశ్లేషణ.
కేన్స్ టెక్నాలజీ షేర్లు గత 3 రోజుల నష్టాల తర్వాత దాదాపు 2% పెరిగాయి. కేంద్ర ప్రభుత్వం రూ. 7,877 కోట్ల ఇసిఎమ్‌ఎస్ ప్లాన్ ఆమోదించడంతో పిసిబి ప్లాంట్ ప్రారంభానికి సిద్ధమైంది. ఫలితాలు, టార్గెట్ ప్రైస్, టెక్నికల్ అవుట్‌లుక్ పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
బెంగళూరు-ఎర్నాకులం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సీటింగ్ సామర్థ్యాన్ని రైల్వే శాఖ 8 నుండి 16 కోచ్‌లకు శాశ్వతంగా పెంచింది. ఒక్కో ట్రిప్‌కు 1,128 సీట్లు అందుబాటులోకి రానున్నాయి. బెంగళూరు-ముంబై స్లీపర్ వందే భారత్ వివరాలు కూడా తెలుసుకోండి!
పాతికేళ్లకు పైగా డిజిటల్ మీడియా రంగంలో తెలుగువన్ సాధించిన విజయాలను మయన్మార్ మంత్రి టియాన్ లిన్ అభినందించారు. తెలుగువన్ అవలంబిస్తున్న వినూతన కంటెంట్ మోడల్స్, నాణ్యతా ప్రమాణాలు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య కంటెంట్ మార్పిడికి ఉన్న అవకాశాలను పరిశీలించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.