ప్రజా రాజధాని అమరావతిలో కార్పోరేట్ సంస్థలకే చోటు?

Publish Date:Sep 28, 2015

Advertisement

 

రాజధాని అమరావతిని జీవకళ ఉట్టిపడేలా ప్రజారాజధానిగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదేపదే చెపుతుంటారు. కానీ వాస్తవానికి అందులో ప్రజల భాగస్వామ్యం ఏమీ కనబడటం లేదు. కనీసం స్వదేశీ సంస్థలు, రైతులు, యువతకి కూడా చోటు ఉన్నట్లు కనబడటం లేదు. రాజధాని మాష్టర్ ప్లాన్ తయారీ నుండి రాజధాని నిర్మాణం వరకు అంతా సింగపూర్, జపాన్ తదితర దేశాలకు పూర్తి పెత్తనం అప్పగించబోతున్నట్లు స్పష్టం అవుతోంది.

 

రాజధానిలో శాసనసభ, సచివాలయం, హైకోర్టు, మంత్రులు, ముఖ్యమంత్రి నివాసాలు, మౌలిక సదుపాయాల కల్పనకు మాత్రమే కేంద్రప్రభుత్వం నిధులు మంజూరు చేయబోతోంది కనుక రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణానికి అంచనా వేసిన రూ.1.25 లక్షల కోట్లలో సింహ భాగం విదేశీ సంస్థల నుండే పొందవలసి ఉంటుంది. కనుక రాజధాని నిర్మాణంలో విదేశీ సంస్థల పెత్తనం అనివార్యంగా కనబడుతోంది. తనకున్న పలుకుబడిని చూసే విదేశీ సంస్థలు రాజధాని నిర్మాణానికి ముందుకు వస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పుకొంటున్నప్పటికీ లాభాపేక్ష లేనిదే ఏ విదేశీ వ్యాపార, పారిశ్రామిక సంస్థలు పెట్టుబడులు పెట్టవు కనుక అవి ఏదో ఓ రూపంలో తమ పెట్టుబడులకు పూర్తి ప్రతిఫలాలు తీసుకోవడం తధ్యం.

 

రాష్ట్ర విభజన కారణంగా రాజధాని కూడా లేకుండా పోయిన ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రపంచ స్థాయి రాజధానిని నిర్మిస్తుంటే అందరికీ సంతోషమే. కానీ దాని కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకోబోయే వేల కోట్ల రుణభారాన్ని రాష్ట్ర ప్రజలే మోయక తప్పదు. అదే విధంగా అత్యాధునిక రాజధాని నగరంలో కల్పించబడే సకల సౌకర్యాలకు అక్కడ నివసించే ప్రజలే మూల్యం చెల్లించవలసి ఉంటుంది. ఒకవేళ ఆ భారం మరీ అధికంగా ఉన్నట్లయితే దానిని కూడా రాష్ట్ర ప్రజలందరూ భరించవలసి వచ్చినా ఆశ్చర్యంలేదు. ఆ కారణంగా బహుశః అమరావతిలో నివసించాలంటే సామాన్య ప్రజలెవరికీ సాధ్యం కాకపోవచ్చును. రాష్ట్రంలో సామాన్య ప్రజలందరికీ అదొక పర్యాటక ప్రాంతంగానే తయారవుతుందేమో? రాజధాని నిర్మాణం తొలిదశ పూర్తయ్యే సమయానికి అక్కడి పరిస్థితులపై స్పష్టత రావచ్చును.

 

రాజధానిలో అనేక దేశ విదేశీ కార్పోరేట్ సంస్థలు రాబోతున్నాయి. కనుక అమరావతి ప్రజారాజధానిగా కాకుండా కార్పోరేట్ రాజధానిగానే అవతరించవచ్చును. రాజధాని నిర్మాణంలో రాష్ట్రంలో యువతకు, కార్మికులు, సాంకేతిక నిపుణులకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించవచ్చును. కానీ రాజధాని కోసం భూములను ఇచ్చిన రైతుల పరిస్థితే అయోమయంగా మారుతుందేమో? ఎందుకంటే వారికి వ్యవసాయం తప్ప మరొక విద్య తెలియదు. కనుక అన్నదాతలను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి ప్రణాళికలు సిద్దం చేసిందో వేచి చూడాలి.

 

ఇక రాజధాని నిర్మాణం పూర్తిగా తెదేపా ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారంగానే సాగుతోంది తప్ప అందులో ప్రజల, ప్రతిపక్షాల అభిప్రాయాలకి, సూచనలకి ఎక్కడా అవకాశం ఉన్నట్లు కబడటం లేదు. రాజధాని ప్రాంతాన్ని ఎంపిక నుండి భూమి పూజ కార్యక్రమం వరకు ప్రజలకి, ప్రతిపక్షాలకి ప్రభుత్వం అవకాశం ఇవ్వలేదు. కానీ రాజధాని నిర్మాణం కోసం రాష్ట్ర ప్రజలందరూ తమవంతు సహకారం అందించాలని కోరుతోంది. దాని కోసం రాష్ట్ర ప్రభుత్వం విరాళాలు కూడా సేకరిస్తోంది. వచ్చేనెల 22న రాజధాని శంఖుస్థాపన కార్యక్రమాన్ని కోట్లు ఖర్చు చేసి చాలా అట్టహాసంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం సిద్దం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అదే నిజమయితే రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగోలేదని చెపుతూనే మళ్ళీ ఉన్న డబ్బుని ఆవిధంగా విచ్చలవిడిగా ఖర్చు చేయడాన్ని ఎవరూ హర్షించరు. రాజధాని నిర్మాణం కోసం విదేశీ సంస్థల నుండి అప్పులు తీసుకొంటున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మరింత పొదుపుగా, ఆచితూచి డబ్బు ఖర్చు చేయవలసి ఉంటుంది. లేకుంటే ఆ భారాన్ని కూడా మళ్ళీ రాష్ట్ర ప్రజల నెత్తినే పడుతుంది. ఈ శంఖుస్థాపన కార్యక్రమానికి దేశ విదేశీ నేతలను ఆహ్వానిస్తున్నట్లు రాష్ట్ర మంత్రులు చెప్పుతున్నారు. కానీ రాష్ట్ర ప్రజలకు, రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలకు దానిలో పాల్గొనేందుకు ఆహ్వానం, అనుమతి ఉంటాయో లేదో చూడాలి.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.