హోదా ముఖ్యమా అభివృద్ధి ముఖ్యమా?

Publish Date:Aug 27, 2015

Advertisement

 

ఏపీకి ప్రత్యేక హోదా రాదనే విషయం ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ మాటలతో దాదాపు స్పష్టమయిపోయింది. ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా అంతకంటే ఎక్కువే నిధులు ఇస్తామని ఆయన అన్నారు. ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి రూ. రూ. 2, 25, 486 కోట్ల ఆర్ధిక ప్యాకేజి కోరుతూ ప్రధాని నరేంద్ర మోడీకి ఒక నివేదిక ఇవ్వడం కూడా అదే సూచిస్తోంది. కనుక ఇక బంతి ప్రతిపక్షాల, రాష్ట్ర ప్రజల కోర్టులో పడినట్లుగానే భావించాలి. ప్రత్యేక హోదా కోసం పోరాడి సాధించుకోవాలా? లేకపోతే కేంద్రప్రభుత్వం ఇవ్వబోయే ఆర్ధిక ప్యాకేజీని తీసుకొని తృప్తి పడటమా? అనేది ప్రజలే నిర్ణయించుకోవాలి.

 

దీనిపై ప్రజలు భిన్నాభిప్రాయాలు కలిగి ఉండవచ్చును. కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రజల ముందు దోషిగా నిలబెట్టేందుకు, తమ పార్టీ క్యాడర్లను చైతన్యంగా ఉంచుతూ, పార్టీలను బలపరుచుకొని ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రతిపక్ష పార్టీలకు ఇది చాలా చక్కటి అవకాశం కల్పిస్తోంది. కనుక వారు దీనిపై పోరాటానికే మొగ్గు చూపవచ్చును. కనుక ప్రజలే విజ్ఞతతో ఆలోచించి ఏవిధంగా వ్యవహరిస్తే రాష్ట్రానికి తమకు ఎక్కువ మేలు జరుగుతుందో ఆలోచించుకోవలసి ఉంటుంది.

 

ఇంతకు ముందు, రాష్ట్ర విభజన అనివార్యమని తెలిసీ కూడా రాష్ర్టంలో రాజకీయ పార్టీలు ప్రజలను ఉద్యమబాట పట్టించాయి. కానీ రాష్ట్రానికి న్యాయంగా దక్కవలసిన హక్కులు, హామీలు, నిధులు, ప్రయోజనాల కోసం అవి పోరాడలేదు. ఆ కారణంగానే నేడు రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగింది. ఆనాడు తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఒక్కరే రాష్ట్ర విభజన అనివార్యమనే సంగతి దైర్యంగా ప్రజలకు చెప్పి, రెండు రాష్ట్రాల ప్రజలకి పూర్తి న్యాయం జరగాలని కోరారు. ఆయన రాష్ట్రం విడిపోవాలని కోరుకొంటున్నారని, రెండు కళ్ళ సిద్దాంతం అని అర్ధం పర్ధం లేని మాటలు చెపుతున్నారని ఆరోపిస్తూ మిగిలిన పార్టీలు ప్రజలను త్రప్పు ద్రోవ పట్టించాయి. కానీ అప్పుడే రాష్ట్రంలో రాజకీయ పార్టీలన్నీ విభజన తరువాత రాష్ట్రానికి దక్కవలసిన ప్రయోజనాల గురించి గట్టిగా పోరాడి ఉండి ఉంటే బహుశః నేడు రాష్ర్టంలో పరిస్థితులు ఇంత దారుణంగా ఉండేవి కావేమో? ప్రత్యేక హోదా అంశాన్ని కూడా విభజన చట్టంలో చేర్చి ఉండవచ్చును. రాష్ట్రానికి విడుదల చేయవలసిన నిధులు, వాటి విడుదలకు నిర్దిష్ట గడువులు విభజన చట్టంలోనే వ్రాసుకొనే అవకాశం ఉండేదేమో? కానీ ఆనాడు రాష్ట్రంలో రాజకీయ పార్టీలు సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రజలను త్రప్పు ద్రోవ పట్టించాయే తప్ప రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే ప్రయత్నం చేయలేదు.

 

ఆ కారణంగానే విభజన తరువాత రాష్ట్రం తీవ్రంగా నష్టపోవలసి వచ్చింది. మళ్ళీ అవిప్పుడు ప్రత్యేక హోదా అనే అంశాన్ని కూడా తమ రాజకీయ లబ్ది కోసమే ఉపయోగించుకోవాలేనే ఉద్దేశ్యంతోనే ప్రజలలో సెంటిమెంటు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నాయి. భూసేకరణ, ప్రత్యేక హోదాపై పోరాడుతున్నానని చెప్పు కొంటున్న వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మూడేళ్ళ తరువాత ప్రభుత్వం పడిపోతుందని, అప్పుడు తనే ముఖ్యమంత్రి అవుతానని చెప్పుకోవడమే ఇందుకు చక్కటి నిదర్శనం.

 

ఇప్పటికే ఏడాదిన్నర విలువయిన సమయం గడిచిపోయింది. ప్రత్యేక హోదా కోసం పోరాటాలు మొదలుపెడితే ప్రత్యేక హోదా వస్తుందో రాదో తెలియదు కానీ ఇప్పటికే దయనీయంగా ఉన్న రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ఈ బందులు, ధర్నాలు, ర్యాలీల కారణంగా మరింత దీనస్థితికి దిగజారే ప్రమాదం ఉంది. ఇప్పటికే రాష్ట్ర పరిస్థితులు చూసి పెట్టుబడులు, పరిశ్రమలు పెట్టేందుకు వెనుకాడుతున్నవాళ్ళు పక్క రాష్ట్రాలకి తరలిపోయే ప్రమాదం ఉంది. దాని వలన ప్రతిపక్షాలకి ఎటువంటి నష్టమూ ఉండదు కానీ, రాష్ట్ర ప్రజలే దానికి భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా చాలా అవసరమే. కానీ దాని కోసమే పోరాడుతూ ఇంకా సమయం వృదా చేసుకోవడం అవసరమా కాదా అని ఆలోచించాల్సిన సమయమిది.

 

ప్రత్యేక హోదా ఇవ్వలేకపోయినందుకు కేంద్రప్రభుత్వం రాష్ట్ర ప్రజల ముందు తలదించుకొని ఉంది. దానికి ప్రాయశ్చితం చేసుకొనేందుకు సిద్దంగా ఉంది. రాష్ట్రానికి అవసరమయిన నిధులు, సబ్సీడీలు, పన్ను రాయితీలు, ప్రాజెక్టులు అన్నీ సమకూర్చుతామని అరుణ్ జైట్లీ విస్పష్టంగా ప్రకటించారు. కనుక వాటిని స్వీకరించి వీలయినంత వేగంగా రాష్ట్రాభివృద్ధి చేసుకోవడమే మంచిది. ఒకవేళ ఇప్పుడు కూడా కేంద్రప్రభుత్వం సకాలంలో తగినన్ని నిధులు విడుదల చేయకుండా ఆలస్యం చేస్తున్నట్లయితే దానిపై తప్పకుండా రాష్ట్ర ప్రజలందరూ ఉద్యమించవలసిందే. కానీ ఈ అంశంపై ప్రతిపక్షాల వాదనలను నమ్మి ఉద్యమాలు, బందులు చేసుకొంటూపోతే చివరికి ప్రజలే నష్టపోవలసివస్తుంది,మూల్యం చెల్లించాల్సి వస్తుంది. కనుక ప్రజలే తమ విజ్ఞత ప్రదర్శించి తగిన విధంగా స్పందించడం మంచిది.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.