ప్రత్యేకహోదా రాష్ట్రం కోసమా లేక రాజకీయ పార్టీల కోసమా?

Publish Date:Jul 31, 2015

Advertisement

 

రాష్ట్రాలకు ప్రత్యేకహోదా ఇచ్చే విషయం గురించి కేంద్రమంత్రి ఇంద్రజిత్ సింగ్ నిన్న లోక్ సభలో చెప్పిన సమాధానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో కలకలం సృష్టించింది. “ప్రస్తుతం ఏ రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇచ్చే ఆలోచన కేంద్రానికి లేదు. అటువంటి ప్రతిపాదనలేవీ మా పరిశీలనలో లేవు. అందుకు ఎటువంటి విధానమూ కూడా లేదు,” అని కుండ బ్రద్దలు కొట్టినట్లుగా ఆయన ప్రకటించారు.

 

రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇచ్చేందుకు ఇదివరకు కాంగ్రెస్, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వాలు రెండూ కూడా అంగీకరించినప్పటికీ, ఇప్పటికే అందరికీ తెలిసిన కొన్ని కారణాల వలన ఇవ్వడం సాధ్యం కావడం లేదు. అదే మాట కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కొన్ని నెలల క్రితం చెప్పినప్పుడు అందరూ ఆయనపై విరుచుకుపడ్డారు. అప్పటి నుండి ఈ ప్రత్యేకహోదా అనేది ప్రజలకు, రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చే అంశంగా కాక, ప్రతిపక్ష పార్టీలకి అధికార తెదేపా, బీజేపీలపై ప్రయోగించేందుకు ఒక మంచి అస్త్రంగానే ఎక్కువ ఉపయోగపడుతోందనే చేదు నిజం ప్రజలు కూడా గ్రహించే ఉంటారు.

 

ఈ రాజకీయాల సంగతి ఎలా ఉన్నా, తెదేపా మంత్రులు కేంద్రంపై నిరంతరంగా దీనికోసం ఒత్తిడి చేస్తూనే ఉన్నారు. తమ ప్రయత్నాలు కొంత వరకు ఫలించాయని, త్వరలోనే కేంద్రం దీనిపై ఒక ప్రకటన చేస్తుందని కేంద్రమంత్రి సుజానా చౌదరి ప్రకటించారు. కానీ ఊహించని విధంగా, ఇంద్రజిత్ సింగ్ లోక్ సభలో నిన్న ఈ ప్రకటన చేయడంతో రాష్ట్రంలో తెదేపా, బీజేపీలు రెండూ కూడా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవలసివస్తోంది. కానీ రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇస్తామని రాష్ట్ర విభజన జరుగుతున్నప్పుడే హామీ ఇచ్చి ఉన్నందున, ఇంద్రజిత్ సింగ్ నిన్న లోక్ సభలో చేసిన ప్రకటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వర్తించకపోవచ్చును. కనుక దీని తెదేపా ఎంపీలు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తదితరులు దీనిపై త్వరలోనే కేంద్రం చేతనే వివరణ ఇప్పించవచ్చును. అప్పుడు కూడా కేంద్రం ఇంద్రజిత్ సింగ్ చెప్పినదానికే కట్టుబడి ఉంటే ఇక రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదనే భావించవచ్చును.

 

కానీ ఈ అంశాన్ని ఉపయోగించుకొని ప్రతిపక్షాలు చేస్తున్న హడావుడి దృష్టిలో ఉంచుకొని ప్రత్యేకహోదా అంశాన్ని రాజకీయ పార్టీల చేతిలో పెట్టి వాటికి రాజకీయ లబ్ది కలిగించాలా లేక ప్రత్యేకహోదాకి సమానంగా కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి ఇస్తానంటున్న ప్రత్యేక ప్యాకేజీని స్వీకరించడం మంచిదా? అని ప్రజలు కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది.

 

ప్రజలు గమనించాల్సిన మరొక్క విషయం ఏమిటంటే ఒకవేళ రాష్ట్రానికి ఈ ప్రత్యేకహోదా మంజూరు చేసినా అది యావత్ రాష్ట్రానికి వర్తించదని ఇదివరకు యూపీఏ ప్రభుత్వమే తేల్చిచెప్పింది. రాష్ట్రంలో వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంద్రా జిల్లాలకు మాత్రమే ఇది వర్తిస్తుంది. అదికూడా పారిశ్రామిక అభివృద్ధి కోసమే ఉద్దేశించబడింది తప్ప అన్ని పనులకు భారీగా నిధులు మంజూరు చేసేందుకు కాదు. ఈ విషయం గురించి చెప్పకుండా ‘రాష్ట్రమంతటికీ ప్రత్యేకహోదా వస్తుంది...ప్రత్యేకహోదా వస్తే రాష్ట్రానికి నిధుల వరద మొదలయిపోతుంది’ అన్నట్లుగా ప్రతిపక్ష పార్టీలు ప్రజలకు భ్రమలు కల్పిస్తున్నాయి.

 

ఈ విషయాల గురించి తెదేపా, బీజేపీలు ప్రజలకు వివరించడంలో అశ్రద్ధ చేసినందునే ఈ సమస్య మరింత తీవ్రం అయిందని చెప్పవచ్చును. ఇప్పటికే 14నెలలు పూర్తయిపోయాయి. కానీ ప్రత్యేకహోదా రాలేదు. ఇంకా ఎప్పటికి వస్తుందో తెలియదు. కారణాలు అందరికీ తెలిసినవే. అటువంటప్పుడు పుణ్యకాలం పూర్తికాక ముందే అందుబాటులో ఉన్న అవకాశాలని ఉపయోగించుకొని రాష్ట్రాభివృద్ధి చేసుకోవడం మంచిదా? లేక ఇంకా ఈ భ్రమలలోనే జీవిస్తూ రాజకీయ పార్టీలకి లబ్ది కలిగించేందుకు పోరాటాలు కొనసాగించడం మంచిదా? అని ప్రజలు కూడా ఆలోచించుకోవాలి.

 

మరొక్క ఏడాదో రెండేళ్ళ తరువాతనో రాష్ట్రానికి ప్రత్యేకహోదా వచ్చినా అప్పటి వరకు రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి కుంటుపడుతుంది. పారిశ్రామిక అభివృద్ధి జరగకపోతే రాష్ట్ర ఆర్ధికపరిస్థితి కూడా మారదు. కనుక తెదేపా, బీజేపీలు కూడా ఈ ప్రత్యేకహోదా అంశాన్ని ఇంకా నాన్చకుండా అది సాధ్యమో కాదో విస్పష్టంగా ప్రకటించి, వీలుకాకపోతే ప్రత్యామ్నాయంగా రాష్ట్రాని మంచి ఆర్ధిక ప్యాకీజీ సాధించే ప్రయత్నాలు చేయడం మంచిది. తద్వారా ఆ రెండు పార్టీలు విమర్శలను ఎదుర్కొనే బాదా తప్పుతుంది, రాష్ట్రానికి ఇంకా నష్టం జరుగకుండా నివారించవచ్చును కూడా. ఈ అంశంలో తెదేపా, బీజేపీలు అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని ముందుకు సాగినట్లయితే ప్రతిపక్షాలు కూడా చల్లబడే అవకాశం ఉంటుంది.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.