తెలుగు రాష్ట్రాల మధ్య రగులుతున్న ఈ చిచ్చుని ఆర్పేదెవరు?

Publish Date:Jun 26, 2015

Advertisement

 

“రాష్ట్రాలుగా విడిపోదాము, అన్నదమ్ముల్లా కలుసుందాము...చైనా, పాకిస్తాన్ దేశాలతోనే ఎంతో సర్దుకుపోగా లేనిది ఇంతవరకు ఒక్కటిగా కలిసిమెలిసి జీవించిన తెలుగుజాతి రెండు రాష్ట్రాలుగా విడిపోతే సర్దుకుపోలేమా? హైదరాబాద్ లో నివసించే ప్రజలందరినీ కడుపులో పెట్టుకొని చూసుకొంటాము...” రాష్ట్ర విభజన జరగక ముందు ఇటువంటి గొప్ప గొప్ప మాటలు చాలా వినబడ్డాయి. కానీ రాష్ట్ర విభజన జరిగితే రెండు రాష్ట్రాల మధ్య ఎవరూ ఊహించలేనన్ని సమస్యలు, గొడవలు తలెత్తుతాయని మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వాదించారు. చివరికి ఆయన మాటలే నిజమయ్యాయి. ఆయన కూడా ఊహించలేని అనర్ధాలు కూడా ఇప్పుడు జరుగుతున్నాయి.

 

రెండు రాష్ట్రాలలో ప్రభుత్వాలు ఏర్పడి ఏడాది పూర్తయింది. ఈ ఏడాది కాలంలో ఏ ఒక్క సమస్య పరిష్కారం కాలేదు సరికదా రోజుకొక కొత్త సమస్య పుట్టుకొస్తోంది. ఆ కారణంగా రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య యుద్దాలు నిత్యకృత్యమయిపోయాయి. అవి కూడా ఇరు ప్రభుత్వాల పరిపాలనలో ఒక అంతర్భాగమా...అన్నట్లుగా మారిపోయాయి. రాష్ట్రం విడిపోతే ప్రళయం ముంచుకు రాదని తెలంగాణా నేతలు వాదించేవారు. కానీ ఇప్పుడు ఓటుకి నోటు, ఫోన్ ట్యాపింగ్, సెక్షన్: 8, తెలంగాణా ట్రాన్స్ కో నుండి ఒకేసారి 1200 మంది ఆంధ్రా ఉద్యోగులను బయటకి పంపడం, తాజాగా షెడ్యూల్:10 క్రింద ఉన్న సంస్థలపై ఆధిపత్యం కోసం ఆంధ్రా, తెలంగాణా ప్రభుత్వాలు మరో యుద్దానికి సిద్దపడటం ఇలాగ ఒకదాని తరువాత మరొకటిగా వరుసగా జరుగుతున్న సంఘటనలన్నీ అటువంటి పరిస్థితికే దారి తీసేవిగానే కనబడుతున్నాయి.

 

ఈ సమస్యలన్నిటికీ కాంగ్రెస్ పార్టీనే నిందించక తప్పదు. తెలుగు ప్రజలు ఇంతకాలం కాంగ్రెస్ పార్టీని నెత్తినపెట్టుకొని మోసినందుకు వారికి మేలు చేయకపోగా, తన స్వార్ధ రాజకీయ ప్రయోజనాలను చూసుకొని హడావుడిగా రాష్ట్ర విభజన చేసి తెలుగుజాతిలో ఈ చిచ్చు పెట్టింది. కనుక ఇరు రాష్ట్ర ప్రజలు కూడా ఇందుకు కాంగ్రెస్ పార్టీని ఎప్పటికీ శపిస్తూనే ఉంటారు. ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించుకొన్నట్లయితే కాంగ్రెస్ చేసిన తప్పిదాలను సరిదిద్దుకోవచ్చును. కానీ తెదేపా, తెరాసల మధ్య రాజకీయ వైరం కారణంగా సమస్యలు నానాటికీ పెరిగాయే తప్ప తగ్గుముఖం పట్టలేదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకొనేందుకు సిద్దపడినప్పటికీ, తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ అందుకు సానుకూలంగా స్పందించడం చాలా విచారకరం. పైగా ఆయన ప్రదర్శిస్తున్నఅనవసమయిన దూకుడు కారణంగా సమస్యలు పరిష్కారం కాకపోగా నిత్యం కొత్త సమస్యలు తలెత్తుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

 

ఇంత జరుగుతున్న ఇరు రాష్ట్రాల మధ్య తలెత్తుతున్న గొడవలలో కేంద్ర ప్రభుత్వం తలదూర్చదని చెప్పడం సమంజసం కాదు. కేంద్ర ప్రభుత్వమే రాష్ట్రాన్ని విడదీసింది కనుక ఈ సమస్యల పరిష్కారానికి అదే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఈ సమస్యల పరిష్కారానికి ఎప్పటికప్పుడు తాత్కాలిక ఆలోచనలు చేయడం కంటే శాశ్విత ప్రాతిపదికన ఒక చట్టబద్దమయిన ప్రత్యేక యంత్రాంగం లేదా వ్యవస్థను ఏర్పాటు చేయడం మంచిది. లేకుంటే ప్రభుత్వాల మధ్య జరుగుతున్న ఈ అంతర్యుద్ధం కారణంగా రెండు రాష్ట్రాలలో సామాన్య ప్రజలు తీవ్రంగా నష్టపోవలసి వస్తుంది.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.