ఇప్పుడు రాజధాని నిర్మించుకోలేకపోతే...

Publish Date:May 15, 2015

Advertisement

 

ఆంద్రప్రదేశ్ రాజధాని అమరావతికి వచ్చే నెల 6వ తేదీని శంఖుస్థాపన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకోవడంతో అందుకోసం వేగంగా చర్యలు చేపడుతోంది. అన్నిటికంటే ముందుగా ఈ పనికి అవరోధంగా నిలుస్తున్న భూసేకరణ సమస్యను పరిష్కరించేందుకు నడుం బిగించింది. రాజధాని కోసం భూములు ఇవ్వడానికి అయిష్టత చూపుతున్న ఉండవల్లి మరియు పెనుమాక గ్రామాలలో రైతులకు వారి సర్వే నెంబర్లు ఆధారంగా ఈరోజు జిల్లా కలెక్టర్ భూసేకరణ కోసం నోటీసులు అందజేయబోతున్నారు. అదేవిధంగా ఇంతకు ముందు ప్రభుత్వానికి అంగీకార పత్రాలు ఇచ్చి తరువాత హైకోర్టులో పిటిషన్లు వేసిన రైతులకి కూడా నోటీసులు జారీ చేయబోతున్నారు. వారి భూములు రాజధాని నిర్మాణం చేయాలనుకొంటున్న ప్రాంతానికి మధ్యలో ఉన్నందునే తప్పనిసరిగా భూసేకరణ చేయవలసి వస్తోందని అధికారులు చెపుతున్నారు.

 

ప్రభుత్వం రైతులపై భూసేకరణ చట్టం ప్రయోగించినట్లయితే తీవ్రంగా ప్రతిఘటిస్తామని రైతులు, ప్రతిపక్షాలు కూడా హెచ్చరిస్తున్నాయి. కానీ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ముందుకే సాగాలని నిశ్చయించుకొంది. కేంద్ర ప్రభుత్వం భూసేకరణ చట్టానికి సవరణలు చేయడం ద్వారా ఇటువంటి ప్రజాపయోగమయిన పనులకోసం రైతుల నుండి భూమిని సేకరించేందుకు ప్రభుత్వాలకి అధికారం కల్పించింది కనుక ఈ విషయంలో కోర్టులలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి ఆటంకాలు ఎదురవకపోవచ్చును. కానీ, నోటీసులు అందుకొన్న రైతులు మళ్ళీ కోర్టులను ఆశ్రయించడం తధ్యం కనుక ప్రభుత్వానికి తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు కలగవచ్చును. కానీ ప్రతిపక్ష పార్టీలు ఈ భూసేకరణను వ్యతిరేకిస్తున్నాయి కనుక ప్రభుత్వానికి న్యాయపరమయిన ఇబ్బందుల కంటే రాజకీయపరమయిన సమస్యలే అగ్ని పరీక్షగా మారే అవకాశం ఉంది.

 

రాష్ట్ర ప్రజలలో మంచి ఆదరణ కలిగి ఉన్న సినీ నటుడు పవన్ కళ్యాణ్ కూడా వారికి తోడయితో ఇక అగ్నికి ఆజ్యం పోసినట్లే అవుతుంది. కానీ ఇంతవరకు ఆయన ఈ విషయంపై ఇంతవరకు స్పందించలేదు. మరి ఆ మౌనం అర్ధాంగీకారం అనుకోవాలో లేకపోతే మళ్ళీ అకస్మాత్తుగా తుళ్ళూరుకి బయలుదేరిపోయి హడావుడి చేస్తారో తెలియదు. ఏది ఏమయినప్పటికీ ఈ భూసేకరణ ఆఖరు అధ్యాయంలో రాష్ట్ర ప్రభుత్వం రాజకీయంగా చాలా సవాళ్ళను ఎదుర్కోక తప్పేలా లేదు.

 

ఇప్పుడు ఉద్యమిస్తున్న ప్రతిపక్షాలన్నిటికీ కూడా రాష్ట్రానికి రాజధాని లేదనే విషయం, అత్యవసరంగా దానిని నిర్మించుకోవాలనే విషయం తెలుసు. కానీ రాష్ట్రంలో అన్ని ప్రతిపక్ష పార్టీలు రైతులు తరపున ఉద్యమిస్తామని చెపుతున్నప్పటికీ, వారి పోరాటాల వెనుక ఎవరి రాజకీయ ప్రయోజనాలు వారికున్నాయి. రాష్ట్ర విభజన తరువాత చెల్లచెదురయిపోయిన కాంగ్రెస్ నేతలను అందరినీ ఒక్క త్రాటిపైకి తీసుకువచ్చి ఈ సమస్య మీద పోరాడి మళ్ళీ ప్రజలకు చేరువయ్యేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించవచ్చును. వైకాపా కూడా ఇంచుమించి అదే ఉద్దేశ్యంతో పోరాటానికి సిద్దం కావచ్చును. నిరంతరం ఏదో ఒక ప్రజాసమస్యలపై పోరాడే వామపక్ష పార్టీలు కూడా భూసేకరణకు వ్యతిరేకంగా పోరాటం మొదలుపెట్టాయి గనుక అవి కూడా ఇందులో పాల్గొనవచ్చును. కనుక ఈవిషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఒంటరిపోరాటం చేయక తప్పదు. అయితే ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుందని ముందే ఊహించడం పెద్ద కష్టమేమీ కాదు. అటువంటప్పుడు ప్రభుత్వం ముందు నుంచే ఇందుకోసం రాష్ట్ర ప్రజలందరి మద్దతు కూడగట్టినా లేక ఈ విషయం గురించి ముందుగానే ప్రతిపక్షాలతో కూడా చర్చించి వాటి అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకొని ఉన్నా బహుశః సమస్య తీవ్రత ఇంతగా ఉండేది కాదేమో?

 

ఇప్పుడు ఉద్యమిస్తున్న ప్రతిపక్షాలన్నిటికీ కూడా రాష్ట్రానికి రాజధాని లేదనే విషయం, అత్యవసరంగా దానిని నిర్మించుకోవాలనే విషయం తెలుసు. తెదేపా-బీజేపీల మధ్య మంచి స్నేహ సంబంధాలు కలిగి ఉండి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో భాగస్వాములుగా ఉన్నందున, కేంద్ర ప్రభుత్వం రాజధాని నిర్మాణం కోసం పూర్తి సహాయసహకారాలు అందించేందుకు సిద్దంగా ఉంది. కనుక ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వీలయినంత త్వరగా రాజధాని నిర్మించుకోవలసింది పోయి, ఈవిధంగా ప్రతిపక్షాలు అడుగడుగునా అడ్డుతగులుతున్నట్లయితే, ఒకవేళ మిగిలిన ఈ నాలుగేళ్లలో రాజధాని నిర్మాణం చేసుకోలేకపోతే అప్పుడు పరిస్థితి ఏమిటి? అప్పుడు ప్రజలు ఎవరిని నిందించాలి? రాజధాని నిర్మాణం కోసం సహాయం చేస్తానన్న కేంద్ర ప్రభుత్వాన్నా? లేక ఈ అవరోధాల కారణంగా రాజధాని నిర్మించలేకపోతే రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందించాలా? లేక తమ స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసమే రాజధాని నిర్మాణానికి అవరోధాలు సృష్టిస్తున్న ప్రతిపక్షాలనా? దీనికి ఇప్పుడు ఎవరు ఎటువంటి సమాధానమయినా చెప్పుకోవచ్చును. కానీ అందుకు బాధ్యులను ప్రజలే గుర్తించి వారిని శిక్షించకుండా విడిచిపెట్టరని అన్ని పార్టీలు గుర్తుంచుకోవడం మంచిది.

 

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.