రాజకీయ ప్రయోజనాల కోసం నేరస్తులను వెనకేసుకు వస్తే...

Publish Date:Apr 10, 2015

Advertisement

 

 

తమిళనాడుకు చెందిన 20 మంది ఎర్రచందనం స్మగ్లర్ల ఎన్కౌంటర్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా ఉంది కనుక రాష్ట్రంలో ప్రతిపక్షాలకు ప్రభుత్వాన్ని నిలదీసేందుకు అదొక మంచి ఆయుధంగా దొరికింది. ఈ అంశాన్ని పట్టుకొని తమిళనాడులో రాజకీయపార్టీలు కూడా రాజకీయాలు సాగిస్తున్నాయి. అధికార అన్నాడీఎంకే పార్టీ కంటే ముందుగా కరుణానిధికి చెందిన డీయంకె పార్టీ ఈ అంశం మీద స్పందించుతూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ర్యాలీలు నిర్వహించింది. తమ రాష్ట్రానికి చెందిన అమాయకులయిన కూలీలను ఆంధ్రప్రదేశ్ పోలీసులు పొట్టనబెట్టుకొన్నారని ఘాటుగా విమర్శలు చేసింది. అంతే కాదు చనిపోయిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.2లక్షల పరిహారం కూడా అందజేసింది.

 

ఇది చూసి అధికార పార్టీ కూడా వారికి నష్టపరిహారం చెల్లించకతప్పలేదు. రాష్ట్ర మంత్రులు, యం.యల్యే.ల ద్వారా భాదిత కుటుంబాలకు చెక్కులు అందజేసింది. అక్రమాస్తుల కేసులో ముఖ్యమంత్రి పదవి పోగొట్టుకొని జైలుకి వెళ్లివచ్చిన అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత కూడా మీడియా ముందుకు వచ్చి ఈ ఎన్కౌంటర్ ని ఖండిస్తూ మాట్లాడవలసివచ్చింది. “మీడియాలో వచ్చిన ఫోటోలను చూస్తే ఈ ఎన్కౌంటర్ పై అనుమానాలు కలుగుతున్నాయి. ఒకవేళ చనిపోయిన వారందరూ స్మగ్లర్లే అనుకొన్నప్పటికీ వారిపై అంతమంది పోలీసులు దాడి చేయడం చాలా అనుమానాలను రేకెత్తిస్తోంది,” అని ఆమె అన్నారు. తమిళనాట మిగిలిన చిన్నా చితకా రాజకీయ పార్టీలు కూడా ఈ అంశంపై చేయగలిగినంతా హడావుడి చేసాయి.

 

ఈ ఎన్కౌంటర్ లో మానవ హక్కుల ఉల్లంఘన అనే అంశాన్ని వేరుగా చూసినట్లయితే, ఎర్రచందనం స్మగిలింగ్ వ్యవహారం చట్ట విరుద్దమయిన పని అందరూ అంగీకరించకమానరు. చట్ట విరుద్దమయిన అటువంటి పనులను అరికట్టవలసిన బాధ్యత ఉన్నందునే ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం దానిని అరికట్టేందుకు చాలా కాలంగా ప్రయత్నిస్తోంది. ఇప్పుడు కూడా అటువంటి ప్రయత్నమే చేసింది. కానీ ఈసారి ఆ ప్రయత్నంలో 20మంది చనిపోవడంతో రాష్ట్రంలో ప్రతిపక్షపార్టీలు, తమిళనాడులో అధికార ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వాన్ని తప్పు పడుతున్నాయి. కానీ అటువంటి పనులకు పాల్పడినవారిని రాజకీయ పార్టీలు సమర్ధించడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.

 

ఒక ప్రభుత్వానికి చట్ట విరుద్దమయినది మరొక ప్రభుత్వానికి ఆమోదయోగ్యంగా భావించడం ఎలా సాధ్యమో దానికే తెలియాలి. రాజకీయ పార్టీలు తమ ప్రయోజనాలను మాత్రమే దృష్టిలో ఉంచుకొని ఇటువంటి చట్టవిరుద్దమయిన పనులకు పాల్పడిన వారికి మద్దతు ఇవ్వడం, వారి కుటుంబాలకు పోటాపోటీలుగా నష్టపరిహారాలు చెల్లించడం వలన, అటువంటి పనులకు పాల్పడటం తప్పు కాదని చెపుతున్నట్లుంది. ఇదంతా చూసి మరింత మంది అటువంటి చట్ట విరుద్దమయిన పనులకు పాల్పడే అవకాశం కూడా ఉంది.

 

ఇప్పుడు ఈ సంఘటన ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది కనుక తమిళనాడు ప్రభుత్వం, రాజకీయ పార్టీలు వారినందరినీ వెనకేసుకు రావచ్చును. కానీ రేపు ఇదే పని తమిళనాడు రాష్ట్రంలోనే చేసినట్లయితే అప్పుడు కూడా రాజకీయ పార్టీలు వారిని ఇదేవిధంగా వెనకేసుకు రాగలరా? అప్పుడు కూడా ఇదేవిధంగా వారి కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించగలరా?

 

ఇటువంటి చట్ట వ్యతిరేక పనులకు పాల్పడిన వారి కుటుంబాలకు ప్రభుత్వాలు నష్టపరిహారం చెల్లించడమే ఒక కొత్త సంప్రదాయం సృష్టిస్తే, వికారుద్దీన్ వంటి ఉగ్రవాదుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించవలసిన అగత్యం ఏర్పడినా ఆశ్చర్యం లేదు. ఆ తరువాత క్రమంగా రకరకాల నేరస్తుల కుటుంబాలకు నష్ట పరిహారం చెల్లించవలసివచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. చట్టవిరుద్దమయిన పనులకు పాల్పడినందుకు రామలింగ రాజు అంతటివాడినే జైలుకి పంపారు తప్ప ఈవిధంగా జాలి చూపలేదు. కానీ ఆంద్ర, తెలంగాణాలలో ప్రతిపక్ష పార్టీలు, తమిళనాట అధికార ప్రతిపక్ష పార్టీలు మాత్రం అటువంటి వారిని వెనకేసుకురావడం చాలా శోచనీయం. రాజకీయ పార్టీలు తమ ప్రయోజనాలను మాత్రమే దృష్టిలో ఉంచుకొని ఇటువంటి నేరస్తులకు మద్దతు పలకడం, ప్రభుత్వాలపై ఒత్తిడి చేయడం ఎంతవరకు సమంజసమో వారూ ఆలోచించుకోవాలి.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.