ప్రభుత్వం విజయవాడకు వస్తేనే సమస్యల పరిష్కారం సాధ్యం

Publish Date:Nov 16, 2014

Advertisement

 

ఈ శీతాకాల అసెంబ్లీ సమావేశాలను ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం గుంటూరు వద్దగల ఆచార్య నాగార్జునా విశ్వవిద్యాలయంలో నిర్వహించబోవడం చాలా తెలివయిన నిర్ణయమేనని చెప్పవచ్చును. దానిని ప్రజలు కూడా స్వాగతిస్తున్నారు. ఇదివరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన తొలి మంత్రి వర్గ సమావేశాన్ని విశాఖలోని ఆంద్రవిశ్వవిద్యాలయంలో నిర్వహించినప్పుడు ప్రజల నుండి ఇదే రకమయిన సానుకూల స్పందన వచ్చింది. ఆ తరువాత ఆయన విజయవాడను తాత్కాలిక రాజధానిగా ప్రకటించి, త్వరలోనే ప్రభుత్వం అక్కడికి తరలివచ్చి పనిచేయడం మొదలుపెడుతుందని చెప్పినపుడు కూడా యావత్ రాష్ట్ర ప్రజలు చాలా సంతోషించారు. కానీ అందరికీ తెలిసిన అనేక కారణాల వలన ఇంతవరకు ఆ ప్రక్రియ మొదలవకపోవడంతో నేటికీ హైదరాబాద్ నుండే పరిపాలన సాగించవలసి వస్తోంది.

 

కానీ ముఖ్యమంత్రితో సహా మంత్రులు, అధికారులు, ఉద్యోగులు అందరూ హైదరాబాద్ లో కూర్చొని తూళ్ళూరులో రాజధాని నిర్మిస్తామని చెపుతూ రైతుల నుండి భూసేకరణకు పూనుకొంటున్నందున రైతులలో అనేక అనుమానాలు, ప్రభుత్వం ఇస్తున్న హామీలపట్ల ఒక అపనమ్మకం ఏర్పడటం సహజం. వారి అనుమానాలకు చాలా బలమయిన కారణాలే ఉన్నాయి. తీవ్ర ఆర్దికలోటు, నిధుల కొరతతో సతమతమవుతున్న ప్రభుత్వం విజయవాడకు తరలిరాకుండా హైదరాబాద్ నుండే పాలన సాగిస్తుండటం వలన వారు చెపుతున్నట్లుగా ఐదేళ్ళలో రాజధాని నిర్మించగలరా లేదా? ఉన్న కొద్దిపాటి భూములు ప్రభుత్వానికి అప్పగించేసాక, ఇప్పుడు విజయవాడకు తరలివచ్చేందుకే జంకుతున్న ప్రభుత్వం ఏ కారణాల చేతయినా రాజధాని నిర్మించలేకపోతే అప్పుడు తమ పరిస్థితి ఏమిటి? వంటి అనేక సందేహాలు రైతులలో కలగడం సహజం.

 

ప్రభుత్వం విజయవాడకు తరలిరాకుండా హైదరాబాద్ లో ఉండటం ప్రతిపక్షాలకు కూడా బాగా కలిసిరావడంతో అవి రైతులలో నెలకొన్న ఈ అనుమానాలను, భయాందోళనలను మరింత పెంచిపోషించే అవకాశం చేజిక్కించుకోగలుగుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలను ఆచార్య నాగార్జునా విశ్వవిద్యాలయంలో నిర్వహించబోవడం తెలివయిన నిర్ణయమేనని చెప్పవచ్చును. తద్వారా ప్రభుత్వంపై రైతులకు కూడా నమ్మకం పెరిగే అవకాశం ఉంటుంది.

 

అందువలన ప్రభుత్వం తక్షణమే విజయవాడకు తరలిరాలేకపోయినా, సమావేశాలు ముగిసిన తరువాత అంచెలంచెలుగా ప్రభుత్వ కార్యాలయాలు విజయవాడకు తరలించడం మంచిది. రైతులకు జీవనోపాధి కల్పిస్తున్న పంట భూములను త్యాగం చేయమని ప్రభుత్వం కోరుతోంది. అటువంటప్పుడు వివిధ కారణాలతో హైదరాబాద్ విడిచిపెట్టేందుకు ససేమిరా అంటున్న ప్రభుత్వోద్యోగులను, ఉన్నతాధికారులను కూడా చిన్నచిన్న త్యాగాలు చేయమని గట్టిగా చెప్పవచ్చును.

 

విజయవాడకు తరలిరావడం కష్టమని ఉద్యోగులు, వారు లేకుండా విజయవాడకు తరలివచ్చి తానొక్కడు ఏమిచేయగలనని ముఖ్యమంత్రి, ఆయన రాకుండా మేము మాత్రం ఏమి చేయగలమని ఇతర మంత్రులు అందరూ హైదరాబాద్ లోనే కొనసాగుతున్నారు. అటువంటప్పుడు వారు రాజధాని గురించి చెపుతున్న మాటలను భూములిస్తున్న రైతులు విశ్వసించడం కష్టం. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికే ఆరు నెలల పుణ్యకాలం పూర్తవబోతోంది. ప్రభుత్వం ఇంకా హైదరాబాద్ నే అంటిపెట్టుకొని అక్కడి నుండే రాజధానికి సంబందించిన నిర్ణయాలు తీసుకొంటూ, అక్కడి నుండే విధివిధానాల గురించి మాట్లాడుతున్నంత కాలం ఈ సమస్యలను పరిష్కరించడం అసాధ్యమేనని చెప్పవచ్చును. తద్వారా రాజధాని నిర్మాణం మరింత ఆలశ్యం జరగవచ్చును. ఆలశ్యం జరుగుతున్న కొద్దీ ప్రజలలో, రైతులలో అనుమానాలు పెరుగడం సహజం. అప్పుడు ఎవరూ ఊహించలేని కొత్త సమస్యలు పుట్టుకొచ్చినా ఆశ్చర్యం లేదు.

 

అందువలన రాజధాని నిర్మాణాన్ని సవాలుగా స్వీకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, దానిని నెరవేర్చుకోవాలంటే అంతకంటే ముందుగా తన ప్రభుత్వాన్ని విజయవాడకు తరలించి రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా భూములు ఇస్తున్న రైతులకు అందుబాటులో ఉంటే, చాలా సమస్యలు పరిష్కరింపబడవచ్చును. ఇటీవల హూద్ హూద్ తుఫాను సమయంలో ఆయన స్వయంగా విశాఖలో వారం రోజులు మకాం పెట్టి సహాయ, పునరావాస చర్యలు స్వయంగా పర్యవేక్షించడం ద్వారా తుఫాను దెబ్బ తిన్న ప్రజలలో ఒక గొప్ప ఆత్మస్థయిర్యం, ప్రభుత్వం తమకు అండగా ఉండనే భరోసా, భావన కలిగించగలిగారు. ఇప్పుడు కూడా ఆయన ప్రభుత్వాన్ని విజయవాడకు తరలించి తూళ్ళూరు, గన్నవరం మండలాలలో రైతులకు అటువంటి ఆత్మస్థయిర్యం, భరోసానే కల్పించవలసిన అవసరం ఉంది. అప్పుడే ఆయన అనుకొన్న పని నిర్విఘ్నంగా సాధించగలుగుతారు.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.