ఆంధ్రా ప్రజలపట్ల ఇంత వివక్ష అవసరమా?

Publish Date:Jul 16, 2014

Advertisement

 

ఆంధ్రా, తెలంగాణా ప్రజలపట్ల ఇంత వివక్ష అవసరమా? తెరాస పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన చాలా హామీలను అమలు చేస్తూ క్యాబినెట్ సమావేశంలో నిర్ణయాలు తీసుకొంది. దీనివల్ల తెలంగాణాలో అన్ని వర్గాల ప్రజలకు లబ్దికలుగుతుంది. ముఖ్యంగా వ్యవసాయ, బంగారు, పవర్ లూమ్ కార్మికుల రుణాల మాఫీ విషయంలో ప్రభుత్వం ఎటువంటి సందిగ్దత కనబరచకుండా చాలా స్పష్టంగా నిర్ణయం ప్రకటించడం హర్షణీయం. అదేవిధంగా తాత్కాలిక కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడం, మళ్ళీ వారిలోవయసు మీరినవారి పట్ల సానుభూతిగా వ్యవహరిస్తూ వారి కోసం నిబంధనలు సడలించాలని నిర్ణయించడం ప్రభుత్వం యొక్క మానవీయ కోణాన్ని చాటిచెపుతోంది. సమాజంలో అట్టడుగు వర్గాల పట్ల తెలంగాణా ప్రభుత్వం చూపిన ఆదరణ కూడా చాలా అభినందనీయం.

 

తెలంగాణాలో జనాభాలో అత్యధికంగా ఉన్న యస్సీ, ఎస్టీ, ముస్లిం, గిరిజన, ఆదివాసీలకు పెన్షన్లు, భూములు, ఇళ్ళు, విద్యావకాశాలు కల్పించాలనుకోవడం కూడా చాలా హర్షణీయం. తెలంగాణా కోసం అమరులయిన వీరుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకోవాలనుకోవడం గొప్ప విషయమే. కానీ 1969నుండి పోరాడి అమరులయిన వీరుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకోవాలనుకోవడం ఇంకా గొప్ప విషయం.

 

తెలంగాణా ప్రజల పట్ల అవ్యాజమయిన ప్రేమాభిమానాలు, కరుణ చూపించిన తెరాస ప్రభుత్వం ప్రతీచోట కూడా ఆంధ్రా, తెలంగాణా అనే భేదం ఖచ్చితంగా పాటించాలని అనుకోవడం చాలా బాధాకరం. విద్యార్ధుల విషయంలో కూడా ఖచ్చితంగా ఈ వివక్ష పాటిస్తామని స్వయంగా ముఖ్యమంత్రే చెప్పడం మరింత బాధాకరం.

 

ఏదో ఒకరోజు రాష్ట్ర విభజన జరిగి తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడుతుందని ఎవరూ ఎన్నడూ ఊహించలేదు. అందుకే రాష్ట్రం నలుమూలల నుండి ప్రజలు హైదరాబాదుకు వచ్చి స్థిరపడ్డారు. హైదరాబాదునే తమ స్వస్థలంగా భావిస్తూ అక్కడే చాలా మంది స్థిరపడ్డారు. వారిలో అనేకమంది వివిధ ప్రభుత్వ శాఖలలో కాంట్రాక్టు ఉద్యోగులుగా ఎన్నో ఏళ్లబట్టి పనిచేస్తున్నారు. వారి పిల్లలు అక్కడే పుట్టి అక్కడే చదువుకొని తాము తెలంగాణావాసులమనే అనే భావనతో ఉన్నారు. కానీ ఇప్పుడు స్వయంగా ముఖ్యమంత్రే వారి పట్ల వివక్ష చూపుతామని ప్రకటించడంతో వారందరి జీవితాలు, భవిష్యత్తు అయోమయంగా మారబోతోంది.

 

అనేక దశాబ్దాలుగా తెలంగాణాలో స్థిరపడి, అక్కడే పుట్టిపెరిగిన వారు ఇప్పుడు అటు తెలంగాణాకు, ఇటు ఆంధ్రాకు చెందని కాందీశీకులయిపోయారు. వారందరినీ తెలంగాణా ప్రభుత్వమే ఆదుకోవలసిన అవసరం లేదు. ఆంధ్రా ప్రభుత్వంతో మాట్లాడి వారి సంక్షేమం కోసం రెండు ప్రభుత్వాలు కలిసి ప్రత్యేక వ్యవస్థలు, నిధులు, పధకాలు ఏర్పాటు చేసి మానవత్వంతో వ్యవహరించాలి. ప్రాంతీయవాదాన్ని పక్కనబెట్టి జాతీయ దృక్పధంతో వారి సమస్యలను పరిష్కరించే ప్రయత్నాలు చేయాలి తప్ప ప్రభుత్వాలే ప్రజల పట్ల కక్ష పూరితంగా వ్యవహరించడం సబబు కాదు.

By
en-us Political News

  
తన కృషికి తగిన గుర్తింపు రాలేదన్న కినుకతో ఏబీవీ ఉన్నట్లు కనిపిస్తున్నారు.ఏపీ పోలీసు హౌసింగ్ బోర్డు చైర్మన్ పదవిని చేపట్టలేదు. జగన్ హయాంలో జరిగిన అవకతవకలపై విమర్శలతో పాటుగా, ప్రస్తుత తెలుగుదేశం కూటమి ప్రభుత్వ నిర్ణయాలనూ ప్రశ్నించడం ఆరంభించారు.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు రానున్న మునిసిపోల్స్ లో జనసేనతో తమ పార్టీకి ఎటువంటి పొత్తూ లేదంటూ ప్రకటించడం రాజకీయంగా కలకలం సృష్టించింది. బీజేపీ తెలంగాణ మునిసిపోల్స్ లో స్వతంత్రంగా పోటీ చేస్తుందని, జనసేన సహా ఏ పార్టీతోనూ పొత్తులు ఉండవనీ కుండబద్దలు కొట్టేశారు.
రివ‌ర్ బేసిన్ లో రాజ‌ధాని నిర్మాణ‌మా అంటూ అమ‌రావ‌తిపై త‌న అక్క‌సు మొత్తాన్ని వెళ్ల‌గ‌క్కారు జ‌గ‌న్ మోహ‌న రెడ్డి.
సరిగ్గా మూడు దశాబ్దాల కిందట ఇదే కోనసీమలోని పాశర్లపూడి గ్రామంలో వచ్చిన బ్లోఅవుట్‌తో కోనసీమ ఉలిక్కిపడింది. అంతకు ముందు ప్రకృతి వైపరిత్యాలను మాత్రమే అనుభవించిన కోనసీమ ప్రజ మానవ తప్పిదం కారణంగా తీరని నష్టాన్ని చవి చూసింది. ఆ తరువాత కూడా బ్లో ఔట్ లు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా కోనసీమలోని ఇరుసుమండ గ్రామంలో బ్లోఔట్ సంభవించింది. వారం రోజులుగా మంటలు ఎగసిపడుతూనే ఉన్నాయి.
ఇంత స్పష్టంగా కవిత బీఆర్ఎస్ ను ఎండగట్టినా ఆ పార్టీ అగ్ర నేతలెవరూ ఇంత వరకూ నేరుగా స్పందించలేదు. అసలు కవిత విషయంలో ఎలా స్పందించాలో వారికి తెలియడం లేదని పరిశీలకులు అంటున్నారు. అయితే కవిత పై బీఆర్ఎస్ సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పూర్తి స్థాయిలో ప్రారంభమైతే రోజుకు సుమారు 300 విమానాలు ల్యాండింగ్, టేక్‌ఆఫ్ చేయగల సామర్థ్యం కలిగి ఉంటాయి. రెండు వైపుల నుంచీ ల్యాండింగ్, టేక్‌ఆఫ్ సదుపాయం ఉండటం ఈ విమానాశ్రయం ప్రత్యేకత. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఎయిర్‌పోర్ట్‌ను తీర్చిదిద్దుతున్నారు.
కొండ‌గ‌ట్టు తెలంగాణాలో ఉన్న కోవెల అయినా.. ప‌వ‌న్ త‌న ప‌ర‌పతి ఉప‌యోగించి.. టీటీడీ నుంచి సుమారు 36 కోట్ల రూపాయ‌ల విరాళం ఇప్పించారు. ఈ మొత్తం ద్వారా.. భ‌క్తుల వ‌స‌తి కోసం 90 గ‌దుల ధ‌ర్మ‌శాల‌, ఆపై ధీక్ష విర‌మ‌ణకు వీలుగా ఉండేందుకు మ‌రో భ‌వ‌నం నిర్మాణానికి పవన్ స్వయంగా శంకుస్థాపన చేశారు.
సుప్రీం కోర్టు ఆధ్వర్యంలో ఈ కేసు దర్యాప్తును ప్రత్యేక సిట్ చేపట్టింది. ఈ కేసు దర్యాప్తు జగన్ సన్నిహితులనే కాదు జగన్ ను కూడా వణికిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుమల ప్రసాదాల తయారీలో నాణ్యతా లోపం అంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
జగన్ హయాంలో తిరుమల పవిత్రతకు, ప్రతిష్ఠకు పంగనామాలు పెట్టి మరీ యధేచ్ఛగా వ్యవహరించిన చరిత్ర వైసీపీ నేతలది. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత కూడా తిరుమలలో వారి హవాయే కొనసాగుతోంది. కూటమి సర్కార్ తీరు అయిన వాళ్లకి ఆకుల్లో.. అన్న చందంగా తయారైందంటున్నారు.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, కీలక నేతలు పార్టీ ధిక్కార స్వరం వినిపించడం, ఆ పార్టీని అగ్రనాయకత్వాన్ని ఆందోళనకు గురి చేస్తున్నది. పరాజయాలు తమకు కొత్త కాదనీ, మళ్లీ పుంజుకుంటామని కాంగ్రెస్ అధిష్ఠానం ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ, పరిశీలకులు మాత్రం ఇప్పట్లో కాంగ్రెస్ కోలుకునే అవకాశం లేదని పెదవి విరుస్తున్నారు. ముఖ్యంగా సంకీర్ణ ప్రభుత్వాల కాలంలో కాంగ్రెస్ అనుసరిస్తున్న విధానాల కారణంగా ఆ పార్టీతో పొత్తులో ఉన్న పార్టీలు ఒక్కటొక్కటిగా జారిపోతున్న పరిస్థితి కనిపిస్తున్నది.
జ‌గ‌న్ కి కోర్టుల‌ు, చ‌ట్టాలు, న్యాయ వంటి వాటిని లెక్క చేయని తనంఅన్నది కొట్టిన పిండి. చట్టం, న్యాయం, రాజ్యాంగం ఇలాంటి వాటితో సంబంధం లేకుండా చేయాల్సిందంతా చేసేసి, ఆపై కేసులు నమోదై, కోర్టుకు వెడితే వాటితో ఎలా ఆడుకోవాలో జగన్ కంటే బాగా తెలిసిన వారెవరూ ఉండకపోవచ్చచునంటారు పరిశీలకులు.
జనంలో తనకు ఇసుమంతైనా పలుకుబడి తగ్గలేదని చాటుకోవడానికే జగన్ తమ పార్టీ నేతలపై జనసమీకరణ అంటూ ఒత్తిడి తెస్తున్నారనీ, వైసీపీ నేతలు కూడా గత్యంతరం లేని పరిస్థితుల్లో భారీ ఎత్తున జనసమీకరణ చేస్తున్నారనీ అంటున్నారు.
అత్యంత కీలక విషయాలను వదిలేసి.. వందేమాత‌రంపై గంట‌ల త‌ర‌బ‌డి ప్రసంగాలు దంచి సమయాన్ని వృధా చేసింది అధికార పక్షం. ఓకే దేశం.. ధ‌ర్మం కోసం.. దేశ భ‌క్తి హిందుత్వ అన్నది నిజంగానే కేంద్రంలోని మోడీ సర్కార్ కు అంత ముఖ్యమైనది అనుకుంటే.. బంగ్లాదేశ్ లో ఒక హిందువును సజీవంగా దహనం చేస్తూ కనీస స్పందన కూడా లేకపోవడాన్ని ఏమనుకోవాలి?
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.