పాకిస్థాన్‌లో పురాతన గురుద్వారా ధ్వంసం.. ఇండియా సీరియస్!

Publish Date:Jul 2, 2026

Advertisement

పాకిస్థాన్‌లో మైనారిటీలకు రక్షణ,  మతపరమైన కట్టడాలకు భద్రత కరవైంది.  పాకిస్థాన్ లో  హిందువులు, సిక్కుల ప్రార్థనా స్థలాలపై తరచూ జరుగుతున్న దాడులు ఆందోళన రేకెత్తిస్తున్నాయి.  తాజాగా పాకిస్థాన్ లో నూట పాతిక సంవత్సరాల నాటి పురాతన గురుద్వారాను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు.  పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో శతాబ్ద కాలానికి పైగా ఎంతో పవిత్రంగా, చారిత్రక వారసత్వంగా విరాజిల్లుతున్న గురుద్వారాను కొందరు దుండగులు పాక్షికంగా కూల్చివేసి ధ్వంసం చేయడంపై  సిక్కు సమాజమే  కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానవతావాదులు తీవ్ర ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై ఇండియా కూడా తీవ్రంగా స్పందించి  పాకిస్థాన్ తీరును గర్హించింది. 

పాకిస్థాన్ పంజాబ్ ప్రావిన్స్‌ పరిధిలోని ఫరూఖాబాద్ ప్రాంతంలో చారిత్రక ప్రాధాన్యం కలిగిన  గురుద్వారా శ్రీ గురు సింగ్ సభ సాహిబ్  125 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన పురాతన కట్టడం. ఈ కట్టడం   సిక్కుల సంస్కృతికి, వారి అచంచల విశ్వాసానికి ప్రతీకగా నిలిచింది. అయితే, గత నెల 24న   గుర్తుతెలియని   దుండగులు ఈ  గురుద్వారాపై దాడి చేసి..   ప్రధాన గుమ్మటంతో పాటు, కట్టడంలోని కొన్ని ముఖ్యమైన భాగాలను  కూల్చివేశారు. ఈ విధ్వంసం జరుగుతున్నప్పుడు స్థానిక అధికారులు, రక్షక భట నిలయ సిబ్బంది కనీసం అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేదు. 

ఈ చారిత్రక కట్టడంపై జరిగిన దాడిని నివారించడంలోనూ, మైనారిటీల ఆస్తులను కాపాడటంలోను స్థానిక పాకిస్థాన్ అధికారులు ఘోరంగా విఫలమయ్యారని అక్కడి సిక్కు సంఘాలుఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.  ఈ  ఘటనపై  అంతర్జాతీయంగా నిరసనలు వ్యక్తమయ్యాయి.  ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్‌మెంట్ కమిటీ  సహా   దేశంలోని పలు ప్రతిష్టాత్మక సిక్కు   సంస్థలు ఈ దారుణాన్ని ముక్తకంఠంతో ఖండించాయి. పాకిస్థాన్ భూభాగంలో నివసిస్తున్న మైనారిటీల ప్రాణాలకు, వారి పవిత్ర ప్రార్థనా స్థలాలకు ఏమాత్రం రక్షణ కల్పించలేకపోతున్నారని, అక్కడి ప్రభుత్వం తక్షణమే మేల్కొని తగిన రక్షణ చర్యలు చేపట్టాలని భారతీయ సిక్కు సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు.

గురుద్వారా ధ్వంసం ఘటనను  భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించింది.   ఈ అనాగరిక ఘటనపై పాకిస్థాన్ ప్రభుత్వం తక్షణమే అత్యున్నత స్థాయి దర్యాప్తు జరిపించాలని, ఈ ఘోరానికి ఒడిగట్టిన దోషులను గుర్తించి వారిని శిక్షించాలనీ డిమాండ్ చేసింది.  పాకిస్థాన్‌లో మైనారిటీలు, వారి ప్రార్థనా స్థలాలు లక్ష్యంగా నిరంతరం సాగుతున్న దాడులను అరికట్టడంలో పాక్ విఫలమవుతోందని, ఇటువంటి దుశ్చర్యలకు ఇకనైనా స్వస్తి పలకాలని హెచ్చరించింది.  

By
en-us Political News

  
ర్యాపిడో, కొరియర్‌తో కస్టమర్లకు డెలివరీ..!
ప్రయాణికుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యమిచ్చే క్రమంలో టాటా గ్రూప్‌నకు చెందిన విమానయాన సంస్థలు ఎయిర్ ఇండియా
తెలంగాణ రాజకీయాల్లో బాన్సువాడ శాసనసభ్యుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే.
మద్యం మత్తులో చోరీ.. చివరికి యజమానికి దొరికిపోయిన..!
హైదరాబాదులో సంచలనం సృష్టించిన ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణను రాజేంద్రనగర్ కోర్టు రేపటికి వాయిదా వేసింది.
కారు నాదే కానీ రూపాయి ఇవ్వను..బొమ్మకు మురళి సంచలన వ్యాఖ్యలు..!
బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బావమరిది జోగినపల్లి శ్రీనివాస్ రావు కన్నుమూశారు.
రాజకీయాలు వ్యాపారంగా మారాయి.. ప్రజాసేవే పరమావధిగా పనిచేయాలి సభాపతి పిలుపు
ప్రత్యేకంగా బీఆర్‌టీఎస్ కారిడార్‌తో పాటు రహదారికి ఇరువైపులా సర్వీసు రోడ్లను అందుబాటులోకి తెచ్చారు. రవాణాతో పాటే విద్యుత్తు, తాగునీటి సరఫరా, గ్యాస్ నెట్‌వర్క్, డ్రైనేజీ, కమ్యూనికేషన్ కేబుళ్ల నిర్వహణ కోసం భూగర్భ మౌలిక వసతులు సమకూర్చారు.   పాదచారుల కోసం ఫుట్‌పాత్‌లు, సైకిల్ ట్రాక్‌లు,   గ్రీన్‌బెల్ట్ నిర్మాణంతో ఆధునిక  రవాణా వ్యవస్థకు ఈ రోడ్డు దర్పణం పడుతుంది.  
దక్షిణాసియా ప్రాంతంలో అల్‌ఖైదా, ఐసిస్ వంటి ఉగ్రవాద అనుబంధ సంస్థల   దాడుల సామర్థ్యం గణనీయంగా పెరుగుతోందని హెచ్చరించింది. ఈ ఉగ్ర సంస్థలు  రసాయన, జీవాయుధాలను సేకరించి.. వాటితో విధ్వంసం సృష్టించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నాయనీ, కుట్రలు పన్నుతున్నాయనీ వెల్లడించింది.
భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పదవిపై బిసిసిఐ స్పష్టత ఇచ్చింది. జట్టు ట్రాన్సిషన్ ఫేజ్, ఆటగాళ్ల గాయాల దృష్ట్యా గంభీర్‌ను 2027 వరల్డ్ కప్ వరకు కోచ్‌గా కొనసాగించేందుకు బిసిసిఐ తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
షేక్ రషీద్ అహ్మద్ లష్కరే తోయిబా సీనియర్ కమాండర్ ఖలీద్ మసూద్ సంధు, ఆ ఉగ్ర సంస్థ కేంద్ర సలహా మండలి సభ్యుడు ఖారీ మహమ్మద్ యాకూబ్ షేక్‌లతో కలిసి వేదికను పంచుకున్నారు. ఆ సందర్భంగా ప్రసంగించిన ఆయన తాను లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు, మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హఫీజ్ సయీద్‌కు బానిసనని బాహాటంగా ప్రకటించారు.
జడేజా కెరీర్ ముగింపునకు చేరువవుతున్న వేళ టీమిండియా తదుపరి స్పిన్ లీడర్ ఎవరు కుల్దీప్ యాదవ్ విరాట్, రోహిత్, గిల్ కెప్టెన్సీలలో సాధించిన రికార్డులు, డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టిక సవాళ్లు మరియు మురళీ కార్తీక్ విశ్లేషణపై సమగ్ర కథనం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.