యాంకర్ అనసూయ ఫిర్యాదు... 42 మందిపై కేసు

Publish Date:Jan 16, 2026

Advertisement

 

ప్రముఖ యాంకర్, సినీ నటి ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియా వేదికగా చేసుకొని తనను వేధింపులకు గురి చేస్తున్నారంటూ సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. తనపై సోషల్ మీడియాలో అసభ్యకరంగా ట్రోలింగ్ చేస్తున్నారంటూ అనసూయ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మొత్తం 42 మందిపై కేసు నమోదు చేశారు. కొందరు వ్యక్తులు, కంటెంట్ క్రియేటర్లు, సోషల్ మీడియా ఖాతాదారులపై క్రిమినల్ డిఫమేషన్, సెక్సువల్ హెరాస్‌మెంట్, ఏఐ ఫోర్జరీ వంటి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

గతేడాది డిసెంబర్ 23 నుంచి తనపై ఆన్‌లైన్ వేధింపులు తీవ్రంగా పెరిగాయని అనసూయ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. సోషల్ మీడియా వేదికగా  తనను లక్ష్యంగా చేసుకుని అశ్లీల వ్యాఖ్యలు చేయడం, లైంగిక దూషణలకు పాల్ప డటం, బెదిరింపులు పంపడం వంటి చర్యలు జరుగుతు న్నాయని ఆమె ఆరోపిం చారు. కొందరు కావాలనే క్యాంపెయిన్ తరహాలో తనపై దాడి చేస్తున్నారని అనసూయ తన ఫిర్యాదులో వెల్లడించారు.ఓ ఇంటర్వ్యూ లో తన అభిప్రాయం వ్యక్తం చేసిన తర్వాతే తనపై ఈవిధంగా ట్రోలింగ్ మొద లైందని అనసూయ తెలి పారు.

 తాను చేసిన వ్యాఖ్య లను వక్రీకరిస్తూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని, వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బతీసేలా పోస్టులు, వీడియోలు షేర్ చేస్తున్నారని అనసూయ తన  ఫిర్యాదులో పేర్కొ న్నారు. కొందరు ఏఐ సాంకే తికతను ఉపయోగించి మార్ఫింగ్, ఫోర్జరీ కంటెంట్ సృష్టించారని కూడా ఆమె ఆరోపించారు.బొజ్జ సంధ్యారెడ్డి, ప్రియాచౌదరి గోగినేని, పావని, శేఖర్ బాషా, రజిని వీరితోపాటు మరికొందరిపై అనసూయ ఫిర్యాదు చేసింది. 

అంతేకా కుండా నిందితుల పేర్లతో పాటు సంబంధిత సోషల్ మీడియా ఖాతాల లింకులను కూడా అనసూయ తన ఫిర్యాదుతో జత చేసి పోలీసులకు సమర్పించారు. దీంతో సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అనసూయ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు బొజ్జ సంధ్యారెడ్డి, ప్రియాచౌదరి గోగినేని, పావని, శేఖర్ బాషా, రజిని తో సహా మొత్తం 42 మందిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

సోషల్ మీడియాలో మహిళలపై జరుగుతున్న ఆన్‌లైన్ వేధింపులపై కఠినంగా వ్యవహరిస్తామని అధికారులు స్పష్టం చేశారు. బాధితుల ఫిర్యాదుల మేరకు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, అవస రమైతే నిందితులను అదుపులోకి తీసుకుం టామని తెలిపారు. ప్రస్తుతం నిందితుల సోషల్ మీడియా ఖాతాల వివరాలు, పోస్టులు, వీడియోలను సేకరించి సాంకేతిక ఆధారాలతో విచారణ కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

By
en-us Political News

  
గ్రూప్-3లో అర్హత సాధించిన వారికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నియామక పత్రాలు అందజేశారు.
మంగళగిరి ప్రీమియర్ లీగ్ సీజన్-4 క్రికెట్ పోటీల్లో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సందడి చేశారు.
లక్కుండి గ్రామంలో ఇంటి నిర్మాణ సమయంలో ఇటీవల లంకె బిందె బయటపడిన విషయం తెలిసిందే.
చింతక్రింది సాయిజ్యోతి రచించిన చేయి వీడని చెలిమి అనే నవలను మంత్రి నారా లోకేష్ ఆవిష్కరించారు.
బీహార్ రాష్ట్రంలోని సీతామర్హి జిల్లాలో మానవత్వాన్ని మరిచిపోయేలా చేసిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.
ఏపీకి 10 బిలియన్ డాలర్ల పెట్టుబడి రానుందని మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు
ఆదిలాబాద్‌ జిల్లా భోరాజ్‌ మండలం హతిఘాట్‌లో చనాకా-కొరాటా పంప్‌హౌస్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు.
రాష్ట్రంలో తిరుపతి కేంద్రంగా అతిపెద్ద పరిశోధనా కేంద్రం ఏర్పాటు ప్రతిపాదనలకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఏపీ ఫ్యూచరిస్టిక్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ (AP FIRST) పేరుతో తిరుపతిలో రీసెర్చ్ కేంద్రం ఏర్పాటుకు సీఎం ఆమోదముద్ర వేశారు.
మేడిపల్లి పరిధిలోని చెంగిచెర్ల కాలనీలో దొంగలు బీభత్సం సృష్టించారు
ఈ సంక్రాంతి సీజ‌న్లో కేవ‌లం రెండు రోజుల‌కే ఎన్ని వేల కోట్ల మేర కోళ్ల పందేలు జ‌రిగాయో చూస్తే ఆశ్చర్యపోతారు
ఒక్క పెగ్గు కోసం సొంత అన్ననే మేడ మీద నుంచి తోసేసి చంపేసిన తమ్ముడి ఉదంతం సంక్రాంతి పండుగ నాడు హైదరాబాద్ నాచారంలో చోటు చేసుకుంది.
142 ఏళ్లు జీవించిన సౌదీ అరేబియా కురువృద్ధుడు షేక్ నాసర్ బిన్ రద్దన్ అల్ వదాయి ఇకలేరు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు ప్రభాకర్‌రావు ఇంటరాగేషన్ ఇంకెంతకాలం కొనసాగిస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.