నియోజక వర్గాల సంఖ్య డ‌బుల్ కానున్నాయా?.. అమిత్‌షా సిగ్న‌ల్ ఇచ్చేశారా?

Publish Date:Oct 25, 2021

Advertisement

ఉభయ తెలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ, లోక్ సభ నియోజక వర్గాల పునర్విభజన అంశం మరో మారు చర్చకు వచ్చింది. జమ్మూ కశ్మీర్’ పర్యటనలో భాగంగా కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా ఇటీవ‌ల శ్రీనగర్ బహిరంగ సభలో జమ్మూ కశ్మీర్’లో   నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ సాగుతోందని, అది పూర్తయిన వెంటనే ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించారు. అమిత్ షా అలా ప్రకటన చేశారో లేదో ఇలా, తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ, బోయినపల్లి వినోద్ కుమార్ ఆ చేత్తోనే మా సంగతి చూడండి అంటూ తెలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ, లోక్ సభ స్థానాల పునర్విభజన అంశాన్ని మరో మారు తెరమీదకు తెచ్చారు. జమ్మూ కశ్మీర్’తో పాటుగానే ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ స్థానాల పునర్విభజన ప్రక్రియ ప్రారంభించాలని  అన్నారు. రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచిన విధంగా తెలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ సీట్లను పెంచాలని, అందుకోసంగా జమ్మూకశ్మీర్’తో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనూ నియోజకవర్గాల పునర్విభజన జరపాలని వినోద్ కుమార్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
 
అదలా ఉంటే, ముందునుంచి కూడా  ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 (రాష్ట్ర విభజన చట్టం) దేశంలో నియోజక వర్గాల పునః విభజన ప్రక్రియతో సంబంధం లేకుండా తెలుగు రాష్ట్రాలలో నియోజక వర్గాల పునర్విభజనకు అవకాశం కల్పించిందనే అభిప్రాయాన్ని తెరాస సహా ఇతర పార్టీలు వ్యక్త పరుస్తున్నాయి. ఆ ప్రకారంగా  ఆంధ్ర ప్రదేశ్’లో ప్రస్తుతమున్న 175 అసెంబ్లీ నియోజక వర్గాలను 225కు తెలంగాణలో ప్రస్తుతమున్న 119 అసెంబ్లీ నియోజక వర్గాలను 153కు పెంచుకోవచ్చని విభజన చట్టం సూచించిందని, రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే ఉభయ తెలుగు రాష్ట్రాలలో నియోజక వర్గాల పునర్విభజన అంశం తరచు చర్చకు వస్తోంది. అయితే, విభజన చట్టం సీట్ల సంఖ్యను ఎంత వరకు పెంచుకోవచ్చో సూచించిందే, కానీ, ఎప్పటిలోగా అనే విషయంలో స్పష్టంగా చెప్పలేదని, కేంద్ర ప్రభుత్వ వర్గాలు తమ భాష్యం తాము వినిపిస్తున్నాయి. 

అయితే, ఈ అంశం తెర మీదకు రావడం, మీడియాలో చర్చలు జరగడం ఇదే తొలిసారి కాదు. కొద్ది నెలల క్రితం  జమ్మూ కశ్మీర్’కు  రాష్ట్ర హోదా పునరుద్ధరణలో భాగంగా నియోజక వర్గాల పునర్విభజన ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందుకు సంబదించి ప్రదాని మోడీ లోక్ సభలో ప్రకటన చేశారు.  తెలుగు రాష్ట్రాలలో తేనే తుట్టె కదిలింది, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్తీకరణ చట్టం 2014 లో  పొందుపరిచిన విధంగా, ఉభయ రాష్ట్రాలలో అసెంబ్లీ, లోక్ సభ స్థానాల సంఖ్యను పెంచాలని పార్లమెంట్ లోపల, వెలుపల కూడా చర్చ జరిగింది. ఇప్పటిలానే అప్పుడు కూడా వినోద్ కుమార్ ఇదే డిమాండ్ చేశారు. కేంద్రం పట్టించుకోలేదు. కానీ, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇదే అంశానికి సంబంధించి లోక్ సభలో వేసిన  ప్రశ్నకు కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్, ఉభయ తెలుగు రాష్టలలోనూ 2026 తర్వాతనే నియోజక వర్గాల పునర్విభజన ఉంటుందని, అంతవరకు ప్రస్తుత స్థితే యథాతథంగా కొనసాగుతుందని లిఖిత పూర్వకంగా ఇచ్చిన సమాధానంలో స్పష్టం చేశారు. అంతే కాకుండా రాష్ట్ర విభజన చట్టం సూచించిన విధంగా నియోజక వర్గాల పునర్విభజన చేపట్టాలంటే, రాజ్యాంగ సవరణ అవసరం అవుతుందని గతంలో చెప్పిన  విషయాన్నే కేంద్ర మంత్రి  మరోమారు స్పష్టం చేశారు. కాబట్టి, 2023లో జరిగే తెలంగాణ శాసన సభ ఎన్నికల నాటికి లేదా 2024లో సార్వత్రిక ఎన్నికల నాటికి తెలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ, లోక్ సభ స్థానాల సంఖ్య పెరిగే అవకాశం లేదని, రాజకీయ పార్టీలు కూడా ఒక నిర్ణయానికి వచ్చాయి. అయితే, రాజకీయ పార్టీలు, ముఖ్యంగా తెరాస దీన్నొక రాజకీయ అస్త్రంగా ఉపయోగించుకుంటూనే ఉంటాయి. 

అదలా ఉంటే, దేశవ్యాప్తంగా అసెంబ్లీ. లోక్ సభ స్థానాల పునర్విభజన  సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొంత కసరత్తు చేసిందని కొద్ది నెలల క్రితం కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎంపీ మనీష్ తివారి  ట్వీట్ చేశారు. ఈ ట్వీట్’ దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. మనీష్ తివారీ  ట్వీట్  ప్రకారం  ప్రస్తుతం 543 ఉన్న లోక్ సభ స్థానల సంఖ్య రెట్టింపు గీతను కూడా దాటి ఏకంగా 1200 ప్లస్ సంఖ్యకు చేరుకుంటుంది. అలాగే, ఉభయ తెలుగు రాష్ట్రాలలో కూడా లోక్ సభ స్థానాల సంఖ్య రెట్టింపు గీతను దాటేస్తుంది. ఆంధ్ర ప్రదేశ్’లో ప్రస్తుతమున్న 25 స్థానాలు 52, తెలంగాణలో ప్రస్తుతమున్న 17 స్థానాలు 39కి చేరుకుంటాయి. అయితే, 2026లో చేపట్టే నియోజక వర్గాల పునర్విభజన కసరత్తులో భాగంగా  కేంద్ర హోమ్ శాఖ సిద్దం చేసిన  బ్యాక్ పేపర్స్ ఆధారంగా మనీష్ తివారీ ట్వీట్ చేశారని, ప్రస్తుత కొవిడ్ పరిస్థితుల్లో 2026లోనూ నియోజక వర్గాల పునర్వ్యవస్థీకరణ ఉండక పోవచ్చని అధికార వర్గాల సమాచారం. కొవిడ్ కారణంగా 2021లో జరగవలసిన జనగణన జరగలేదు.ఆ కారణంగా నియోజక వర్గాల పునర్విభజన ఇంకొంత ఆలస్యం అయినా అవుతుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
  
ఏది ఏమైనా ప్రస్తుత పరిస్థితులు, రాజకీయ సమీకరణలను పరిగణనలోకి తీసుకుంటే  కారణాలు ఏవైనా, అవి సహేతుకం అయినా కాకున్నా, ఇప్పట్లో తెలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ, లోక సభ స్థానాల సంఖ్య పెరగదు. తెలంగాణ, ఏపీ అసెంబ్లీలలో వరసగా 119, 175, లోక్ సభలో ఏపీకి 25, టీఎస్ 17...అంతే, మరో ఎన్నిక వరకు సీట్ల సంఖ్యఇంతే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
 

By
en-us Political News

  
దెందులూరు వైసీపీ ఎన్నికల ప్రచారంలో ఘోర అపశృతి చోటుచేసుకుంది. వైసీపీ ప్రచార ఆర్భాటం చిన్నారుల ప్రాణాలను ప్రమాదంలో పడేసింది. ఎన్నికల నిబంధనలను ఏమాత్రం పాటించకుండా చిన్న పిల్లలను ప్రచారంలో భాగం చేసి వారి ప్రాణాలతో చెలగాటమాడారు. పెదపాడు మండలం రాజుపేటలో బుధవారం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అబ్బయ్య చౌదరి ఎన్నికల ప్రచారం చేపట్టారు.
ఎవరూ ఊహించని యువతి ఎన్నికల ప్రచారంలోకి అడుగుపెట్టింది. కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యండి అని ఓటర్లని చిరునవ్వులు చిందిస్తూ అడిగింది.
వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైయస్ జగన్ అక్రమాస్తుల కేసు మళ్లీ మొదటికొచ్చింది. సీబీఐ కోర్టు జడ్జి బదిలీ అయ్యారు. దీంతో ఈ కేసు విచారణ మే 15వ తేదీకి వాయిదా పడింది. అయితే సీబీఐ, ఈడీ కేసుల్లో వైయస్ జగన్ సహా 130 పిటిషన్లపై గత 12 ఏళ్లుగా విచారణ కొనసాగుతూనే ఉంది.
తెలుగు ఠీవీ పీవీ నరసింహారావు(కు భారత రత్న ప్రకటించడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. అదే టైంలో మరో డిమాండ్ కూడా బలంగా వినిపిస్తోంది. అదే ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వాలనే నినాదం. సీనియర్ ఎన్టీఆర్‌ అభిమానులంతా సోషల్ మీడియా వేదికగా ఈ నినాదాన్ని గట్టిగానే వినిపిస్తున్నారు. ఇందులో చాలా మంది ప్రముఖులు కూడా ఉన్నారు. 
పుట్టగానే పరిమళించింది ఓ చిన్నారి గులాబీ... వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాము అనే నానుడిని అలవోకగా పక్కకు నెట్టేసింది. ఆనందాలతో పాటు సకల అవసరాలకు భరోసానిచ్చే కలశ ఫౌండేషన్ ని లోకానికి గిఫ్ట్ గా ఇచ్చింది. ఇంతకీ ఆ చిన్నారి ఎవరు? పుట్టుకతో సాధించిన విజయాలు ఏమిటి? ప్రస్తుతం తను సాధించిన విజయాలు, సాధించబోతున్న విజయాలు ఏ దశలో ఉన్నాయో ఒకసారి పరికిద్దాం.
జగన్ హయాంలో ఉద్యోగులు ఎన్ని ఇబ్బందులు పడ్డారో అందరికీ తెలిసిందే. మద్యం దుకాణాల దగ్గర కాపలా విధులు నిర్వర్తించాల్సి రావడం నుంచి రాష్ట్రప్రభుత్వోద్యోగులు, టీచర్లు పడిన బాధలు ఇన్నిన్ని కావయా అన్నట్లుగా ఉంది. చివరకు వారిని నెల మొదటి తారీకున రావాల్సిన వేతనాలకు కూడా విడతల వారీగా విదిల్చి నానా ఇబ్బందులకూ గురి చేశారు.
ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన మన భారత దేశాన్ని ఏదో పెద్ద శనిగ్రహం పట్టి పీడిస్తోంది.
అందుకే అంటారు.. ఎన్ని సమస్యలు చుట్టుముట్టినా జీవితం మీద ఆశ వదలకూడదని..! ఈ మాటకి తాజా ఉదాహరణ
ఏపీ హైకోర్టులో జనసేన పార్టీకి పాక్షిక ఊరట మాత్రమే లభించింది. గాజు గ్లాసు గుర్తు స్వతంత్య్ర అభ్యర్థులకు కేటాయించడాన్ని జనసేన పార్టీ సవాల్ చేస్తూ హైకోర్టులో మంగళవారం (ఏప్రిల్ 30) పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
వైఎస్ రాజశేఖర రెడ్డి రాజకీయ వారసుడిగా ఎపి రాజకీయాల్లో అడుగు పెట్టి ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్ కు అడ్డూ అదుపు లేకుండా అరాచకపాలన సాగిస్తున్నట్టు విమర్శ ఉంది.
తెలంగాణ రాష్ట్రంలో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఈ ఏడాది రాష్ట్రంలో తొలిసారిగా ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలు దాటాయి. రాష్ట్రంలో మంగళవీరం(ఏప్రిల్26) అత్యధికంగా నల్గొండ మాడుగులపల్లిలో 46.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలో సోమవారం (ఏప్రిల్ 29) ఒక్కరోజే వడదెబ్బకు ఎనిమిది మంది చనిపోయారు.
మే 1వ తేదీ, ఉదయం పది గంటలైంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వోద్యోగుల ఫోన్లు మెసేజ్‌ల సౌండ్‌తో మార్మోగిపోయాయి.
సరిగ్గా ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ స్థైర్యం, ధైర్యం జావగారిపోయాయా? స్వయానా చెల్లెలు షర్మిల సూటిగా చేస్తున్న విమర్శలు జగన్ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీశాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ ఏడాది ఆరంభంలో వైఎస్ షర్మిల కాంగ్రెస్ గూటికి చేరి ఆ పార్టీ రాష్ట్రపగ్గాలు చేపట్టడంతోనే జగన్ శిబిరంలో ఆందోళన మొదలైంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.