తెలంగాణ లో బీజేపీని విస్తరించి 2023 లో జరిగే ఎన్నికల్లో తెలంగాణ లో అధికారం లోకి రావాలని మోడీ అమిత్ షా తీవ్రంగా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యం లో బీజేపీ సభ్యత్వ నమోదు పై రాష్ట్ర స్థాయి నేతలకు దిశా నిర్దేశం చేయడానికి అమిత్ షా ఈ రోజు హైదరాబద్ వచ్చారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ మొన్న జరిగిన ఎన్నికలలో తెలంగాణలో బీజేపీకి 19 శాతం ఓట్లు వచ్చాయని.. దీన్ని బట్టి చూస్తే రాబోయే రోజుల్లో ఇక్కడ బీజేపీ జెండా ఎగరడం ఖాయమన్నారు. కొద్ది సేపటి క్రితం శంషాబాద్ శివారులోని రంగనాయకతండాలో పార్టీ కార్యకర్తల సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని అయన ప్రారంభించారు. సోనీబాయి అనే గిరిజన మహిళ కుటుంబానికి తోలి సభ్యత్వాన్ని ఇచ్చి వారి ఇంట్లో జొన్నరొట్టె తిని, టీ తాగారు. అనంతరం శంషాబాద్లోని కేఎల్సీసీ ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యకర్తల సమావేశంలో అయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ బీజేపీ నాయకత్వానికి భారీ టార్గెట్ ఇచ్చారు. కనీసం 20లక్షల మందిని బీజేపీ సభ్యులుగా చేర్చాలన్నారు. అంతకు ముందు రాష్ట్ర నాయకత్వం 12 లక్షల మంది కార్యకర్తలను పార్టీలో చేర్చడాన్ని లక్ష్యంగా నిర్దేశించుకుంది. అయితే అమిత్ షా ఏకంగా 20 లక్షల టార్గెట్ను చేరుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. ఒకవేళ రాష్ట్ర నేతలకు కనుక చేతకాకపోతే తానే స్వయంగా రంగంలోకి దిగుతానని చెప్పారు. ప్రతి జిల్లాలో పర్యటించి తెలంగాణలో బీజేపీని బలోపేతం చేస్తానని అయన ఈ సందర్బంగా చెప్పారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/amit-shah-fix-a-target-of-20-lakhs-membership-to-state-party-39-87859.html
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.
ఈ అరెస్టు పై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. హరీష్ రావు అరెస్టు సందర్భంగా పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. గురుకులాల్లో అవినీతి, రాష్ట్ర అప్పులపై గన్ పార్క్ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్.. బీఆర్ఎస్ నేతలు హరీశ్రావు, కేటీఆర్లకు సవాల్ విసిరారు.