రాజ్యసభలో… ఇక మీద వెంకయ్య మంత్రం, అమిత్ షా తంత్రం!

Publish Date:Jul 27, 2017

Advertisement

 

వాళ్లిద్దర్నీ చాణక్య, చంద్రగుప్తులు అనాలో, శ్రీకృష్ణార్జునులు అనాలో, శ్రీరామ, హనుమంతులనాలో… మన ఇష్టం! కానీ, మోదీ, అమిత్ షా మాత్రం ప్రస్తుతం దేశాన్ని నడుపుతోన్న బ్రెయిన్ అండ్ హార్ట్! నిజానికి షా కేంద్ర ప్రభుత్వంలో భాగం కాకపోయినా మోదీ తరువాత అంత పవర్ ఫుల్ అని అందరి ఫీలింగ్. ఆయన బీజేపి పార్టీ జాతీయ అధ్యక్షుడుగానే వున్నప్పటికీ అనేక పరిణామాల్ని రిమోట్ క్రంటోల్ చేస్తున్నారు. కాని, తాజాగా కమలం పార్టీ పార్లమెంటరీ బోర్డ్ తీసుకున్న నిర్ణయం అమిత్ షాను నేరుగా పార్లమెంట్ ఆవరణలోకి తీసుకురానుంది! ఇక మీదట ప్రత్యక్ష యుద్ధమంటూ సంబరిపడిపోతున్నారు మోదీ భక్తులు!

 

అమిత్ షా గుజరాత్ తరుఫున రాజ్యసభ ఎంపీగా నామినేషన్ వేస్తారని స్పష్టమైపోయింది. బీజేపి కంచుకోటా, మోదీ స్వంత రాష్ట్రమైన గుజరాత్ నుంచి పోటీ అంటే.. షాకు గెలుపు నల్లేరు మీద నడకే! అయితే, పార్టీ చీఫ్ గా దూసుకుపోతున్న అమిత్ భాయ్ ని నరేంద్ర భాయ్ పెద్దల సభకి ఎందుకు తెస్తున్నారు? రీజన్ అందరికీ తెలిసిందే! 2014 నుంచీ ఇప్పటి వరకూ అనేక విజయాలతో లోక్ సభలో తిరుగులేకుండా చేసుకున్నారు నమో. కాని, సమస్యంతా రాజ్యసభలో వస్తోంది. ఒకవైపు కాంగ్రెస్, మరోవైపు కమ్యూనిస్టులు, ఇంకో వైపు తృణమూల్ నిరంతరం మోకాలు అడ్డువేస్తున్నాయి ప్రధానికి. అలాగే, శివసేన లాంటి ఎన్డీఏ పక్షాలు కూడా రాజ్యసభ మద్దతు విషయం వచ్చే సరికి బేరసారాలు, బెదిరింపులకి దిగుతున్నాయి! వీటన్నిటికి చెక్ పెట్టడానికే మోదీ తన మంత్రి లాంటి అమిత్ షాని రాజ్యసభకి తీసుకురాబోతున్నారు!

 

అమిత్ షానే కాదు.. రాజ్యసభ పట్టులోకి తెచ్చుకోటానికి వెంకయ్యని కూడా ప్రయోగించారు ప్రధాని. కేంద్ర మంత్రిగా యాక్టివ్ గా వున్న ఆయన్ని ఉప రాష్ట్రపతి అంటూ గౌరవించేశారు! దీంతో మోదీకి కేబినేట్లో ఒక సీనియర్ తగ్గటమే కాక రాజ్యసభకు చైర్మన్ గా వెంకయ్య లాంటి సమర్థులు దొరుకుతారు. ఇటు వెంకయ్య, అటు అమిత్ షా ఇద్దర్నీ పెద్దల సభలో మోహరించటం ద్వారా మోదీ అక్కడ వ్యవహారాలన్ని వారి భుజాల మీద పెట్టేయవచ్చు. అప్పుడు ఆయన రానున్న 2019ఎన్నికలతో సహా చైనా, పాకిస్తాన్ లాంటి తలనొప్పులు కూడా పరిష్కరించుకునే ప్రయత్నం చేయవచ్చు. అయితే, కొందరు ఊహాగానాలు చేస్తున్నట్టు అమిత్ షాని కేంద్ర కేబినేట్లోకి కూడా మోదీ తీసుకుంటే బీజేపి అధ్యక్ష బాధ్యతలు మరెవరికైనా ఇవ్వాల్సి వుంటుంది. అత్యంత తాజాగా బీహార్ ని బుట్టలో వేసుకున్న అమిత్ షా రేంజ్లో… వేరే వారు పార్టీని నడుపుతారా? ఇది పెద్ద ప్రశ్నే! తగిన జవాబు మోదీ వద్ద వుందా? కొన్నాళ్లు ఆగితే తెలిసిపోతుంది!

By
en-us Political News

  
కొండ‌గ‌ట్టు తెలంగాణాలో ఉన్న కోవెల అయినా.. ప‌వ‌న్ త‌న ప‌ర‌పతి ఉప‌యోగించి.. టీటీడీ నుంచి సుమారు 36 కోట్ల రూపాయ‌ల విరాళం ఇప్పించారు. ఈ మొత్తం ద్వారా.. భ‌క్తుల వ‌స‌తి కోసం 90 గ‌దుల ధ‌ర్మ‌శాల‌, ఆపై ధీక్ష విర‌మ‌ణకు వీలుగా ఉండేందుకు మ‌రో భ‌వ‌నం నిర్మాణానికి పవన్ స్వయంగా శంకుస్థాపన చేశారు.
సుప్రీం కోర్టు ఆధ్వర్యంలో ఈ కేసు దర్యాప్తును ప్రత్యేక సిట్ చేపట్టింది. ఈ కేసు దర్యాప్తు జగన్ సన్నిహితులనే కాదు జగన్ ను కూడా వణికిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుమల ప్రసాదాల తయారీలో నాణ్యతా లోపం అంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
జగన్ హయాంలో తిరుమల పవిత్రతకు, ప్రతిష్ఠకు పంగనామాలు పెట్టి మరీ యధేచ్ఛగా వ్యవహరించిన చరిత్ర వైసీపీ నేతలది. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత కూడా తిరుమలలో వారి హవాయే కొనసాగుతోంది. కూటమి సర్కార్ తీరు అయిన వాళ్లకి ఆకుల్లో.. అన్న చందంగా తయారైందంటున్నారు.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, కీలక నేతలు పార్టీ ధిక్కార స్వరం వినిపించడం, ఆ పార్టీని అగ్రనాయకత్వాన్ని ఆందోళనకు గురి చేస్తున్నది. పరాజయాలు తమకు కొత్త కాదనీ, మళ్లీ పుంజుకుంటామని కాంగ్రెస్ అధిష్ఠానం ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ, పరిశీలకులు మాత్రం ఇప్పట్లో కాంగ్రెస్ కోలుకునే అవకాశం లేదని పెదవి విరుస్తున్నారు. ముఖ్యంగా సంకీర్ణ ప్రభుత్వాల కాలంలో కాంగ్రెస్ అనుసరిస్తున్న విధానాల కారణంగా ఆ పార్టీతో పొత్తులో ఉన్న పార్టీలు ఒక్కటొక్కటిగా జారిపోతున్న పరిస్థితి కనిపిస్తున్నది.
జ‌గ‌న్ కి కోర్టుల‌ు, చ‌ట్టాలు, న్యాయ వంటి వాటిని లెక్క చేయని తనంఅన్నది కొట్టిన పిండి. చట్టం, న్యాయం, రాజ్యాంగం ఇలాంటి వాటితో సంబంధం లేకుండా చేయాల్సిందంతా చేసేసి, ఆపై కేసులు నమోదై, కోర్టుకు వెడితే వాటితో ఎలా ఆడుకోవాలో జగన్ కంటే బాగా తెలిసిన వారెవరూ ఉండకపోవచ్చచునంటారు పరిశీలకులు.
జనంలో తనకు ఇసుమంతైనా పలుకుబడి తగ్గలేదని చాటుకోవడానికే జగన్ తమ పార్టీ నేతలపై జనసమీకరణ అంటూ ఒత్తిడి తెస్తున్నారనీ, వైసీపీ నేతలు కూడా గత్యంతరం లేని పరిస్థితుల్లో భారీ ఎత్తున జనసమీకరణ చేస్తున్నారనీ అంటున్నారు.
అత్యంత కీలక విషయాలను వదిలేసి.. వందేమాత‌రంపై గంట‌ల త‌ర‌బ‌డి ప్రసంగాలు దంచి సమయాన్ని వృధా చేసింది అధికార పక్షం. ఓకే దేశం.. ధ‌ర్మం కోసం.. దేశ భ‌క్తి హిందుత్వ అన్నది నిజంగానే కేంద్రంలోని మోడీ సర్కార్ కు అంత ముఖ్యమైనది అనుకుంటే.. బంగ్లాదేశ్ లో ఒక హిందువును సజీవంగా దహనం చేస్తూ కనీస స్పందన కూడా లేకపోవడాన్ని ఏమనుకోవాలి?
యోగా దినోత్సవానికి ప్రభుత్వం 330 కోట్లు ఖర్చు పెట్టిందని జగన్ చెప్పిన గంటకే.. యోగాకు ఖర్చు పెట్టింది 60 కోట్లు అని, అందులో 90 శాతం కేంద్రమే ఇస్తుందని ఆధారాలతో సహా సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి.
ప్రణాళికా బద్ధంగా ప్రపంచంలో ఏ రాజధానికీ తీసిపోకుండా, ఇంకా చెప్పాలంటే వాటి కంటే మిన్నగా అమరావతి నిర్మాణం జరుగుతోంది. నిర్ణీత కాలవ్యవధిలో రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేయాలన్న ధృఢ సంకల్పంతో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
సుదీర్ఘ విరామం తరువాత కేసీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి బయటకు రావడాన్ని పరిగణనలోనికి తీసుకుంటే..కేంద్రంతో అదే నండీ మెడీతో ఏదో డీల్ సెట్ అయినట్లే కనిపిస్తోందంటున్నారు విశ్లేషకులు. గత దశాబ్దంనర కాలంగా కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ఫాలో అవుతున్న పాలసీని నిశితంగా గమనిస్తున్న వారు కూడా కేటీఆర్, మడీ మధ్య డీల్ సెట్ అయ్యిందనే భావించాల్సి వస్తోందంటున్నారు.
ప‌వ‌న్ త‌న‌కు తెలీకుండా అయితే ఒక గొప్ప మాట అనేశారు.
కేసీఆర్ కూడా యాక్టివ్ కావడానికి తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంచాయతీలను లేవనెత్తి జనంలో సెంటిమెంట్ ను రేకెత్తించాలని భావిస్తున్నట్లు కనిపిస్తున్నది. నీటి కేటాయింపులు, హక్కులను ప్రధాన అజెండాగా కేసీఆర్ గళమెత్తేందుకు సమాయత్తమౌతున్నారని బీఆర్ఎస్ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి.
బ్యాలెట్ ఓటింగ్ అంటే బీజేపీకి ఇందుకే అంత‌ భ‌య‌మ‌నీ, అందుకే ఆ పార్టీ ఈవీఎంలతోనే నెట్టుకొస్తోంద‌నీ నెటిజనులు పెద్ద ఎత్తున సెటైర్లు గుప్పిస్తున్నారు. మోడీ మూడు సార్లు ప్ర‌ధాని కాగ‌లిగార‌ంటే ఈవీఎంల పుణ్యం కూడా ఎంతో కొంత ఉందని అంటున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.