పెద్దన్నా..! ముందు నీ సంగతి చూసుకో

Publish Date:Jun 14, 2016

Advertisement

అర్థ, అంగ బలాలతో ప్రపంచాన్ని కనుసైగతో శాసిస్తోంది అమెరికా..తన మాట వినని ఏ దేశాన్నైనా  సామ, దాన, భేద, దండోపాయాలతో దారికి తెచ్చుకోవడం దానికి వెన్నతో పెట్టిన విద్య. అలా ఏ డౌట్ వచ్చినా..ఏ సాయం కావాల్సి వచ్చినా తను తప్ప వేరే దిక్కులేదన్నట్టు చేసుకుని ప్రపంచానికి పెద్దన్నగా ప్రకటించుకుంది. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా యుద్ధమే దానికి పెద్ద పరిష్కారంగా భావించి తనతో పాటు సంకీర్ణదళాలను ఏర్పాటు చేసి ఇరాక్, ఆఫ్గాన్‌లపై సైనిక చర్య జరిపి ఆ దేశాలను నామరూపాల్లేకుండా చేసింది. ఇప్పుడు ఇస్లామిక్ స్టేట్ పేరు చెప్పి మరోసారి యుద్దవాతావరణం సృష్టిస్తోంది. ఇలా ఆయన దానికి కాని దానికి కయ్యానికి కాలు దువ్వుతున్న అమెరికాకు సొంతదేశంలోనే సొంతప్రజలు సవాలు విసురుతున్నారు. అమెరికాలోని ఆర్లాండోలోని ఒక నైట్ క్లబ్‌లో ఒమర్ మతీన్ అనే వ్యక్తి తాజాగా తుపాకీతో విరుచుకుపడి ఏకంగా 49 మందిని పొట్టనబెట్టుకున్న ఘటన అమెరికాతో పాటు ప్రపంచాన్ని దిగ్బ్రాంతిలో ముంచేసింది. దీనింతటికి కారణం "ఆత్మరక్షణ".

 

శతాబ్దాలుగా అమెరికా చరిత్రతో తుపాకులు ముడిపడిపోయాయి. ముఖ్యంగా 1800ల నుంచీ తెల్లజాతి వలస ప్రజలు పశ్చిమదిశగా విస్తరించాయి. సారవంతమైన భూమి ఉండటాన్ని గుర్తించిన వలస జాతీయులు స్థానిక రెడ్ ఇండియన్లతో పోరాటాలు చేస్తూ, పశ్చిమ హద్దులను క్రమేపీ విస్తరించుకుంటూ టెక్సాస్, కాలిఫోర్నియాలతో పాటు 1830ల నాటికి అయోవా, మిస్సోరీ, ఆర్కాన్సాస్ వంటి ప్రాంతాలన్నింటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో స్థానికంగా బలం లేకపోవడం, స్థానిక రెడ్ ఇండియన్లతో పోరాటాలు చెయ్యాల్సి రావడంతో వలసదారులు తుపాకుల మీద ఆధారపడటం ఎక్కువైంది. తొలినాళ్లలో అక్కడంతా బంజరు నేలలే కావడంతో ఆహారం కోసం తుపాకులతో వేటాడటం నిత్యకృత్యమైంది. ఈ వేట రానురాను సంస్కృతిలో భాగమై ఒక క్రీడగా జీవన విధానంలో భాగమైపోయింది. దానికి తోడు హాలీవుడ్ హీరోల్లో తుపాకితో స్టైల్‌గా నడుచుకుంటూ వచ్చే కౌబోయ్ సినిమాలు అప్పుడప్పుడే వస్తుండటంతో ఆ కాలపు యువత తుపాకీని ధరించడం ఫ్యాషన్‌గా ఫీలయ్యేవారు.

 

అలా తుపాకీ అమెరికన్ల జీవితంతో పెనవేసుకుపోయి ప్రాధమిక హక్కుగా మారింది. 1791లోనే పౌరుల హక్కులను నిర్దేశిస్తూ రాజ్యాంగానికి 2వ సవరణ తెచ్చారు. భద్రతరీత్యా తుపాకులు ఉంచుకోవడం, తీసుకువెళ్లడం పౌరుల హక్కు అని ఆ సవరణ స్పష్టం చేసింది. మరలా 2008లో అమెరికా సుప్రీంకోర్టు ప్రజలకు తుపాకులు, ఆయుధాలు తమతో ఉంచుకునే హక్కును ఈ రెండో సవరణ స్పష్టంగా పరిరక్షిస్తోందని స్పష్టంగా తెలిపింది. దేశంలో ఏ ప్రాంతంలోనైనా పళ్లు, కూరగాయాలు దొరికినంత ఈజీగా తుపాకులు దొరుకుతున్నాయి. వీటిని ఆత్మరక్షణ కోసం మాత్రమే వాడాల్సిన ప్రజలు దొంగతనాలకు, బెదిరింపులకు వాడి రాజ్యాంగం ఇచ్చిన హక్కును దుర్వినియోగం చేస్తున్నారు. కొంతమంది ఉగ్రవాద సానుభూతిపరులు, మతిస్థిమితం లేని వారి చేతుల్లోకి ఈ ఆయుధాలు వెళ్లడం వల్ల దశాబ్దాలుగా ఎంతోమంది అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి.

 

దీంతో తుపాకుల మీద నియంత్రణ అవసరమన్న వాదన బలంగా వినపడుతోంది. ముఖ్యంగా 1960లలో కెనడీ, మార్టిన్ లూథర్ కింగ్‌లను తుపాకులతోనే హత్యలు చేసిన నేపథ్యంలో వాటిని కట్టడి చెయ్యటం చాలా అవసరమన్న భావన బలపడింది. దీంతో తుపాకీ నియంత్రణ చట్టం తెచ్చారు గానీ అది చాలా వరకూ తుపాకుల రవాణా, పంపిణీ లైసెన్సుల వంటి వ్యవహారాలకే పరిమితమైంది. కానీ ఈ మధ్యకాలంలో తరచూ పౌరుల చేతుల్లో తుపాకులు గర్జిస్తుండటంతో అమెరికా అధినాయకత్వం ఆలోచనలో పడింది. సాక్షాత్తూ దేశాధ్యక్షుడు బరాక్ ఒబామా తుపాకీ సంస్కృతిపై ఎప్పటి నుంచో వాపోతూనే ఉన్నారు.

 

తాజాగా నైట్ క్లబ్ ఘటనతో ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. "ఆయుధాలు తేలిగ్గా లభించే తరహా దేశాన్ని మనం వాంఛిస్తున్నామా? అమెరికన్లు దీనిని తేల్చుకోవాలంటూ" ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఇలా స్పందించడం ఇది తొలిసారి కాదు..2012 డిసెంబర్ 14న కనెక్టికట్‌లోని న్యూటౌన్ పాఠశాల పిల్లలపై కాల్పుల తర్వాత తుపాకులపై కఠినంగా వ్యవహరించాలంటూ పిల్లలు సాక్షాత్తూ ఒబామాకు లేఖలు రాయడంతో ఆయన స్పందించి తుపాకుల నియంత్రణ కోసం తన అధికార పరిధిలో, కాంగ్రెస్ అనుమతి అవసరం లేని 23 ఉత్తర్వులు జారీ చేశారు. అయితే అమెరికా సెనేట్ ఆమోదం పొందడంలో అది విఫలమైంది. ఈ విధంగా దేశం అశాంతిలో మగ్గుతుంటే అమెరికా పక్క దేశాల్లో శాంతి నెలకొల్పుతానంటూ బయలుదేరింది. ఇంట గెలిచి రచ్చ గెలవాలి అని మన పెద్దలు ఊరికే చెప్పలేదు. 

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.