Publish Date:Jun 18, 2026
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సెల్ఫ్ గోల్ వేసుకోవడంలో మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు అంబటి రాంబాబుది ఒక ప్రత్యేక శైలి. ప్రత్యర్థులను ఇరుకున పెట్టాలని అయన చేసే విమర్శలు తరచుగా బూమరాంగ్ అవుతూ ఉంటాయి. తాజాగా అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. అధికారంలో ఉన్నప్పటి కంటే.. అధికారంలో నేని సమయంలోనే అప్రమత్తంగా ఉండాలంటారు పరిశీలకులు. అధికార పక్షంపై చేసే విమర్శలకు ఆధారాలు చూపించాల్సిన బాధ్యతను విస్మరించి నిరాధార ఆరోపనలు చేస్తే.. ప్రజలలో ప్రతిష్ట మసకబారడమే కాకుండా, సొంత పార్టీకే నష్టం జరుగుతుంది. ఈ విషయాన్ని స్వయంగా అంబటి రాంబాబే చెప్పారు. వైసీపీ తప్పు చేసిందని ఆయన స్వయంగా ప్రకటించేశారన్న వార్తలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి.
గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా వేదికగా ఒక ఫేక్ ఫోటో తీవ్ర వివాదానికి కారణమైంది. సాయి కృష్ణ, నవీన్ రెడ్డి అనే వ్యక్తులకు సంబంధించిన ఒక ఫోటోను ఆధారం చేసుకుని, కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని వైసీపీ సోషల్ మీడియా విభాగం తీవ్రంగా ప్రయత్నించింది. అయితే.. ఆ ఫోటో పూర్తిగా మార్ఫింగ్ చేసిన నకిలీ ఫోటో అని తేలడంతో కథ అడ్డం తిరిగింది. ఈ ఫేక్ ఫోటో వ్యవహారంపై స్పందించిన అంబటి రాంబాబు.. తమ పార్టీ చేసిన పెద్ద తప్పును బహిరంగంగానే అంగీకరించేశారు. ఎలాంటి ప్రాథమిక నిర్ధారణ లేకుండా.. కేవలం సోషల్ మీడియాలో కనిపించిన ఒక ఫేక్ ఫోటోను నమ్మి కూటమి ప్రభుత్వంపై దాడికి దిగడం వల్లే వైసీపీ బుక్కయిందని అంబటి అన్నారు. నిజం కాని విషయాలపై స్పందించి నవ్వులపాలు కావడం కంటే, మౌనంగా ఉండటమే మేలన్నట్లుగా ఆయన మాట్లాడారు.
విషయమేంటంటే.. ఆంధ్రప్రదేశ్ లో సాయి కృష్ణ అనుమానాస్పద లాకప్ డెత్ వ్యవహారం ఇప్పుడు రచ్చ లేపుతోంది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఈ వ్యవహారంలో చర్యలు తీసుకుంది. కొంతమంది పోలీసులను సస్పెండ్ చేసింది.. విచారణకు ఆదేశించింది. ప్రభుత్వం చర్యలు తీసుకుంటుండగానే.. వైసిపి నాయకులు విమర్శలతో చెలరేగిపోయారు. వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి అంబటి రాంబాబు అలవాటుగా తన నోటికి పని చెప్పారు.అక్కడితో ఆగకుండా సాయి కృష్ణ ఫోటోను ప్రదర్శించి.. పోలీసులు దాడి చేయడం వల్లే అతడు చనిపోయాడని ఆరోపణలు చేశారు.
అంబటి రాంబాబు ప్రదర్శించిన ఫొటోలను ఆధారం చేసుకుని జగన్ సొంత మీడియా కూడా రెచ్చిపోయి వార్తలను ప్రచురించింది. ప్రసారం చేసింది. అయితే అంబటి రాంబాబు చూపిన ఫొటో సాయికృష్ణది కాదు, నవీన్ రెడ్డిదని తేలింది. ఈ విషయాన్ని స్వయానా నవీన్ రెడ్డి మేనమామ శీను రెడ్డి బయటపెట్టారు. దీంతో కథ అడ్డం తిరిగింది. ఈ నవీన్ రెడ్డి ఎవరన్న ఆరా మొదలైంది. ఆ ఆరాలో నవీన్ రెడ్డి, సాయి కృష్ణ దేవినేని అవినాష్ కు ప్రధాన అనుచరులని తేలింది. వీరిద్దరూ మాదక ద్రవ్యాలు తీసుకొని దారుణంగా ప్రవర్తించే వారిని విజయవాడ వాసులు ఆరోపిస్తున్నారు. వైసీపీ హయాంలో వీరిద్దరూ డ్రగ్స్ తీసుకుని ఇష్టానుసారం ప్రవర్తించేవారనీ రాణి తోట.. కృష్ణలంక వాసులు బాహాటంగానే చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే అంబటి రాంబాబు తాను అడ్డంగా బుక్కవ్వడమే కాకుండా, వైసీపీని కూడా బుక్ చేసేశారని వైసీపీ శ్రేణులే అంటున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ambati--landed-ycp-in--trouble-25-223473.html
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
This special article looks at Dr. Sarvepalli Radhakrishnan not simply as a philosopher and former President, but as a teacher whose ideas remain deeply relevant today. What would he ask us about education, technology, our children, teachers and the kind of India we are building?