చలికాలంలో ఉసిరికాయలు తింటే ఇన్ని లాభాలా?

Publish Date:Nov 21, 2023

Advertisement

ఉసిరికాయలు భారతీయ ఆయుర్వేదంలో చాలా గొప్ప ఔషదం. త్రిఫలాలు అని పిలువబడే ఆయుర్వేద పండ్లలో ఉసిరి కాయ కూడా ఒకటి. చిన్నతనంలో వీటిని ఉప్పు, కారం అద్దుకుంటూ తింటూంటే ఎంతో మజాగా ఉండేది. ఇప్పుడు కూడా వీటిని చూస్తే పెద్దలు కూడా పిల్లలైపోయి నోట్లో లాలాజలం ఊరించుకుంటూ తింటుంటారు. ఒకప్పుడు సరదాగా తిన్న ఈ ఉసిరికాయలు గొప్ప ఔషదం అని తెలిశాక వీటిని దూరం పెట్టాలని ఎవరూ అనుకోరు. ముఖ్యంగా  ఉసిరికాయలను చలికాలంలో తింటే ఎన్ని లాభాలో తెలిస్తే  ఆశ్చర్యపోతారు. కార్తీక మాసంలో ఈ ఉసిరికాయలు లభ్యం కావడం మొదలవుతుంది.  సుమారు ఫిబ్రవరి నెల వరకు ఇవి అందుబాటులో ఉంటాయి. ఈ కాలంలో వీటిని తినడం వల్ల కలిగే ఆరోగ్య లాభాలేంటో తెలుసుకుంటే వీటిని మిస్ కాకుండా తినచ్చు.

చలికాలంలో జీర్ణవ్యవస్థ చాలా నెమ్మదిస్తుంది. ఈ కారణంగా జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉంటుంది.  ఉసిరి కాయలో ఉండే ఫైబర్ ప్రేగులను చురుగ్గా పనిచేసేలా  చేస్తుంది. ఇది మలబద్దకాన్ని దూరం చేస్తుంది. జీర్ణవ్యవస్థలో పేరుకున్న మలినాలను బయటకు పంపేస్తుంది.

రోగనిరోధక శక్తి ఎంత బలంగా ఉంటే ఈ చలికాలంలో ఆరోగ్యం అంత బాగుంటుంది. లేదంటే చాలా సులువుగా ఇన్ఫెక్షన్లు సోకుతాయి. ఉసిరికాయలో ఉండే విటమిన్-సి, యాసిడ్ ఫాలిఫెనాల్స్, ఫ్లేవనాయిడ్స్ సహా చాలా యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఫ్రీరాడికల్స్ తో పోరాడతాయి. రోగనిరోధక శక్తిని బలపరుస్తాయి.

వాతావరణం చల్లగా మారడం వల్ల శరీరంలో కూడా మార్పులు వస్తాయి. బద్దకంగా అనిపించడం, పనులు చేయడంలో అనాసక్తి, క్రమంగా వీటి ప్రభావం ఒత్తిడిగా మారుతుంది. ఈ సమస్యలన్నీ తగ్గించడంలో ఉసిరి పనిచేస్తుంది. ఉసిరిలో ఉండే గుణాలు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.


శరీరంలో రోగనిరోధక శక్తి బాగుండాలంటే విటమిన్-సి చాలా అవసరం. ఉసిరికాయ విటమిన్-సి కి  పెట్టింది పేరు.  ఉసిరి రసం తీసుకుంటే ఇమ్యునిటీ పెరిగి అంటువ్యాధుల సమస్యలు తగ్గుతాయి.  తెల్లరక్తకణాల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.  సాధారణంగా సీజనల్ వారిగా వచ్చే జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలను మంత్రించినట్టు మాయం చేస్తుంది.


చలికాలంలో చర్మం, జుట్టు చాలా దారుణంగా దెబ్బతింటుంటాయి. వీటికి ఉసిరితో చెక్ పెట్టవచ్చు.  ఉసిరిలో ఉండే యంటీ ఆక్సిడెంట్ లక్షణాలు,  విటమిన్-సి  కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి. చర్మాన్ని, జుట్టును ఆరోగ్యంగా మారుస్తాయి. తలలో చుండ్రు, కురుపులు, చర్మ సంబంధ సమస్యలు అన్నీ దూరం అవుతాయి.

                                                      *నిశ్శబ్ద.

By
en-us Political News

  
బాదం పప్పు రోజూ తినడం ఎంతవరకు ఆరోగ్యం? ఆరోగ్యం బాగుండాలంటే రోజుకు ఎన్ని బాదం పప్పులు తినాలి? తెలుసుకుంటే..
కార్పెల్ టన్నెల్ సిండ్రోమ్ అనేది ఒక సాధారణ చేతి సమస్య. అరచేతి వైపు ఎముకలు, స్నాయువులతో చుట్టుముట్టబడిన ఇరుకైన మార్గం అయిన కార్పల్ టన్నెల్‌లో ఉన్న నాడిని చేతిపై ఒత్తిడి చేసినప్పుడు ఇది సంభవిస్తుంది. చేతులలో తిమ్మిరి రావడం, వేళ్లలో జలదరింపు లేదా నొప్పి ఉండటం, రాయడంలో లేదా టైప్ చేయడంలో సమస్య ఉండటం, పదే పదే వస్తువులు చేతులలో పట్టుకోలేక జారవిడచడం, వస్తువులను పట్టుకోవడంలో ఇబ్బంది ఎదురుకావడం ఈ కార్పెల్ టన్నెల్ సిండ్రోమ్ ప్రధాన లక్షణాలు.
సోంపు నీటిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకుంటే అద్బుతమైన ఆరోగ్యప్రయోజనాలు చేకూరుతాయంటున్నారు వైద్యులు, ఆహార నిపుణులు. అసలు సోంపు నీటిలో ఉండే శక్తి ఏంటి? దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?
ప్రకృతి ప్రసాదించిన అద్బుతమైన ఆహారాలు ఎన్నో ఉన్నాయి. సీజన్ వారిగా లభిస్తూ ఇవి ఆరోగ్యాన్ని ఎంతో గొప్పగా సంరక్షిస్తాయి...
ఆరోగ్యం కోసం,  శరీరానికి కావలసిన ప్రోటీన్,  పోషకాల కోసం డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్ తింటుంటారు.  వీటిలో వాల్నట్స్ కూడా ముఖ్యమైనవి...
సాయంత్రం అనగానే పనులన్నీ ముగించుకుని హాయిగా ఇంట్లో కూర్చుని కాఫీ, టీ, పాలు.. లాంటి పానీయాలు తాగుతూ ఎంచక్కా  ఏవైనా స్నాక్స్ తినడం గుర్తు వస్తుంది అందరికీ.  అవకాశం దొరకాలే కానీ ప్రతి ఒక్కరూ ఇంట్లో కూర్చుని సాయంత్రం స్నాక్స్ ఎంజాయ్ చేయాలని అనుకుంటారు...
వైట్ బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్, మల్టిగ్రైన్ బ్రెడ్ అంటూ వివిధ రకాలు తీసుకుంటారు. ఇక మరి కొందరు సింపుల్ బ్రేక్ పాస్ట్ పేరుతో బ్రెడ్ ను అల్పాహారంగా తీసుకుంటారు. అయితే ప్రతి రోజూ బ్రెడ్ ను ఆహారంలో బాగంగా తీసుకోవడం మంచిదేనా అంటే.. అస్సలు మంచిది కాదని అంటున్నారు ఆహార నిపుణులు.
చాలా మంది ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మకాయ నీరు తాగుతూ ఉంటారు. ఉదయాన్నే నిమ్మకాయ నీరు తాగడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయని నమ్ముతారు. బరువు పెరగకుండా ఉండటానికి,  అజీర్ణం చేయకుండా...
సమతుల, పోషకాహార లిస్ట్ లో చికెన్ ఎప్పుడూ ఉంటుంది. నేటికాలంలో చాలామంది చికెన్ తినడానకి ఇష్టపడతారు. చికెన్ తినడానికే కాదు....
అల్యూమినియం ఫాయిల్ నేటి కాలంలో వంటింట్లో చాలా కీలకంగా మారింది. ధర పరంగా చూసినా, వాడకం పరంగా చూసినా సిల్వర్ ఫాయిల్ చాలా సౌకర్యంగా ఉంటుంది. పైగా ఇది  ఆహారాన్ని ఎక్కువ సేపు వేడిగా ఉంచుతుంది...
ఉప్పు లేని వంట అస్సలు తినలేము. కానీ ఆహారంలో ఉప్పు ఎక్కువ తీసుకోవడం వల్ల శరీరంలో సోడియం స్థాయిలు పెరిగి రక్తపోటు లేదా బీపి సమస్యను తీసుకొస్తాయి. చాలామంది ఆహారంలో ఉప్పు తక్కువగానే తీసుకుంటారు...
ఆరోగ్యకమైన ఆహారాలలో పల్లీలు కూడా ఒకటి.  పల్లీలు అటు ఆరోగ్యాన్ని ఇస్తూనే ఇటు మంచి స్నాక్స్ గా కూడా ఉంటాయి.  పల్లీలలో మంచి కొవ్వులు..
శరీరం ఆరోగ్యంగా ఉంటే సరిపోదు. మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే శరీరం కూడా పూర్తీ ఆరోగ్యంగా ఉన్నట్టు అనిపిస్తుంది.  అయితే నేటి కాలంలో మానసిక  ఆరోగ్యం చాలా క్లిష్టమైన సమస్యగా మారింది. అధిక శాతం మంది మానసిక ఇబ్బందులు పడుతున్నారు...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.