అమరావతిని నిర్వీర్యం చేయడం.. అభివృద్ధిని అడ్డుకోవడం తప్ప మూడు రాజధానుల విషయంలో వైసీపీ చేసినదేమీ లేదని తేలిపోయింది. వైసీపీ డొల్లతనం. అబద్దాల ప్రచారం మరోసారి రాజ్యసభ సాక్షిగా బయటపడింది. మాట తప్పడం, మడమ తిప్పడం, చెప్పిన మాట చెప్పలేదనడం ఇవే గత మూడేళ్లుగా ఏపీలో జగన్ సర్కార్ చేస్తున్నదనడానికి ఆ పార్టీ రాజ్యసభలో ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లే సాక్ష్యం అని పరిశీలకులు తెల్చి చెప్పేస్తున్నారు.
మూడు రాజధానుల విషయంలో గత మూడేళ్లుగా జగన్ సర్కార్ చెబుతున్నవన్నీ అబద్ధాలేనని విజయసాయిరెడ్డి రాజ్యసభలో ప్రవేశ పెట్టిన ప్రైవేటు బిల్లు ద్వారా చెప్పకనే చెప్పేశారు. మూడు రాజధానుల అంశం విషయంలో ఇంత కాలం తాము నేల విడిచి సాము చేశామనీ, తమ చేతుల్లో లేని విషయాన్ని తలకెత్తుకుని రాష్ట్ర ప్రజలకు చెప్పినవన్నీ అబద్ధాలేనని విజయసాయి రెడ్డి ప్రవేశ పెట్టిన ప్రైవేటు బిల్లుతో తేటతెల్లం చేసేసింది.
మూడు రాజధానులు చేస్తామంటూ ఇంత కాలం నుంచి తాము చేస్తున్నదంతా తమ్మిని బమ్మి చేయడానికి చేసిన వృధా యత్నమేని జగన్ సర్కార్ నిస్సిగ్గుగా రాజ్యసభలో ప్రవేశ పెట్టిన ప్రైవేటు బిల్లు ద్వారా అంగీకరించేసింది. రాజధానుల ఏర్పాటు విషయంలో ఆ రాష్ట్ర శాసనసభకే సర్వ అధికారాలూ ఉండేలా రాజ్యాంగ సవరణ కోరుతూ విజయసాయి రెడ్డి రాజ్యసభలో ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టడంతో ఇంత కాలం ఈ విషయలో జగన్ సర్కార్ ఆడుతున్న డ్రామా బట్టబయలైంది. స్వయంగా వైసీపీయే ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు రాజ్యాంగ సవరణ అవసరమని, ఆ సవరణ చేయకుండా ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు అసాధ్యమనీ పార్టీ ఎంపీ ద్వారా పార్లమెంట్కు నివేదించింది.
వచ్చే అసెంబ్లీ సమవేశాల్లో మరోసారి మూడు రాజధానుల బిల్లు పెడతామని వైసీపీ నేతలు చెబుతుండటం కేవలం ప్రజలను మభ్యపెట్టడానికో.. తాము చేతులెత్తేయలేదని నమ్మించడానికో తప్ప జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు వేసే అవకాశం లేదని ప్రైవేటు బిల్లు ద్వారా స్పష్టం అయిపోయింది. ఇప్పుడు రాజ్యసభలో విజయ సాయి ప్రవేశ పెట్టిన ప్రైవేటు బిల్లు సంగతి తేలే వరకూ ఏపీ అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లు ప్రవేశపెట్టడం దాదాపు అసాధ్యం.
ఇక పార్లమెంట్ చరిత్రలో ప్రైవేటు బిల్లులు చట్టంగా మారిన సందర్భాలు దాదాపుగా లేవనే చెప్పాలి. ప్రచారం కోసమే తప్ప సభ్యులు ప్రైవేటుగా పెట్టే బిల్లులు చట్టాలుగా మారిన చరిత్రే లేదు. కనుక ఇప్పుడు విజయసాయిరెడ్డి రాజ్యాంగ సవరణ కోసం పెట్టిన ప్రైవేటు బిల్లు సభ ఆమోదం పొందడం సాధ్యం కాదు. ఎందుకంటే రాజ్యాంగ సవరణ మూడింట రెండు వంతుల మెజార్టీ కావాలి. కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వానికే ఈ స్థాయి మద్దతు కూడగట్టడం కష్ట సాధ్యం. ఈ విషయం విజయసాయిరెడ్డికి తెలియనిది కాదు. కానీ ఫేస్ సేవింగ్ విన్యాసంలో భాగంగానే ఆయనీ బిల్లు ప్రవేశపెట్టారని పరిశీలకులు అంటున్నారు. అంటే ఏపీ రాజధాని అమరావతే.. మూడు రాజధానులు మా వల్ల కాదు అని పరోక్షంగా ఈ ప్రైవేటే బిల్లు ద్వారా విజయసాయిరెడ్డి జగన్ సర్కార్ తరఫున రాజ్యసభలో అంగీకరించేసినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/amarawati-only-ap-capital-ycp-agreed-on-the-floor-of-rajyasaabha-39-141423.html
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.