అమరావతి రైతులు తమ పోరాటాన్ని సుప్రీం కోర్టు వరకూ తీసుకువెళ్లారు. హైకోర్టు తీర్పును ధిక్కరించి ఏపీ సర్కార్ వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ అమరావతి రైతులు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు విస్పష్ట తీర్పు ఇచ్చినా ఏపీ సర్కార్ ఖాతరు చేయడం లేదనీ, కోర్టు తీర్పు మేరకు పనులు చేపట్టకుండా నిర్లక్ష్యం వ్యవహరిస్తోందనీ వారా పిటిషన్ లో పేర్కొన్నారు.
న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకూ అమరావతి చేసిన పోరాటం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలలో ప్రభుత్వ నిర్వాకం పట్ల ఆగ్రహావేశాలు వెల్లువెత్తేలా చేసిన సంగతి తెలిసిందే. ఆ తరువాత హైకోర్టు తన తీర్పులో ప్రభుత్వ వైఖరిని తప్పు పట్టింది. అమరావతి రైతుల పక్షానే న్యాయం ఉందని విస్పష్ట తీర్పు ఇచ్చింది. హై కోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కు వెళతామని ఏపీ సర్కార్ లీకులు ఇచ్చినప్పటికీ ఆ దిశగా ఇప్పటి వరకూ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు.
పైపెచ్చు కోర్టు తీర్పు మేరకు పనులు చేయకుండా ధిక్కార ధోరణితో వ్యవహరిస్తోంది. ప్రభుత్వ తీరు వల్ల వందల కోట్ల రూపాయల సంపద నాశనం అవుతోందని అమరావతి రైతులు ఆరోపిస్తున్నారు. ల్యాండ్ పూలింగ్ ద్వారా అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులతో గత ప్రభుత్వం పలు హామీలు ఇచ్చి ఒప్పందం కుదుర్చుకుంది. పైసా నష్ట పరిహారం కోరకుండా రాష్ట్ర రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులను వైకాపా సర్కార్ నిలువునా ముంచేసింది.
గత ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం ప్రకారం చేయాల్సిన పనులను చేయలేదు సరికదా, రైతులకు కనీసం కౌలు కూడా ఇవ్వకుండా తాత్సారం చేసింది. దానికి తోడు రాజధానిని పట్టించుకోకుండా మూడు రాజధానులంటూ మూడు ముక్కలాటకు తెరతీసింది. దీనిని వ్యతిరేకిస్తూ అమరావతి రైతులు చారిత్రాత్మక ఆందోళన చేపట్టారు. న్యాయపోరాటంలో విజయం సాధించారు.
గత ప్రభుత్వ ఒప్పందం ప్రకారం రైతుల కు ప్రయోజనాలు చేకూర్చాల్సిందేనని కోర్టు తీర్పు ఇచ్చింది. అమరావతిని నిర్మించాల్సిందేనని తన తీర్పులో హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే కోర్టు తీర్పు తరువాత కూడా జగన్ సర్కార్ మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నామని చెబుతో అమరావతిని నిర్లక్ష్యం చేస్తోంది.దీనిని సవాల్ చేస్తూ అమరావతి రైతులు దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై సుప్రీం కోర్టు త్వరలో విచారణ చేపట్టనుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/amarawati-farmers-file-pitition-in-supreme-against-jagan-sarkar-39-141538.html
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.