అమరావతి రాజధాని కోసం ఎందాకైనా..!

Publish Date:Aug 18, 2022

Advertisement

ఆంధ్రప్రదేశ్ ప్రజా రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ ఆ ప్రాంత రైతులు అలుపు, సొలుపు, విసుగు, విరామం లేకుండా ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే. రాజధాని ప్రాంత రైతులు, మహిళలు ఉద్యమం చేపట్టి సెప్టెంబర్ 12 నాటికి వెయ్యి రోజులు పూర్తవుతుంది. తమ ఉద్యమం వెయ్యి రోజులు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా అమరావతి ప్రాంత రైతులు మరో మహా పాదయాత్రకు సిద్ధం అవుతున్నారు.

ఇంతకు ముందు వారు న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో ఏపీ హైకోర్టు నుంచి తిరుమల వరకు పాదయాత్రను విజయవంతంగా పూర్తి చేసిన సంగతి విదితమే. జగన్   నేతృత్వంలో వైసీపీ ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు, ఆటంకాలు సృష్టించినా.. నిబంధనలు, నిర్బంధాలు పెట్టినా మొక్కవోని దీక్షతో రాజధాని ప్రాంత రైతులు తొలి మహా పాదయాత్రను విజయవంతంగా ముగించారు. తొలిదశలో చేపట్టిన న్యాయస్థానం టూ దేవస్థానం మహా పాదయాత్రకు విశేష స్పందన వచ్చింది.

అదే స్ఫూర్తితో.. అమరావతినే ఏపీ రాజధానిగా కొనసాగించాలనే డిమాండ్ తో ఇప్పుడు రైతులు మళ్లీ మరో మహా పాదయాత్రకు శ్రీకారం చుడుతుండడం గమనార్హం. అమరావతి పరిధి వెంకటపాలెంలో టీటీడీ నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం నుంచి పాద్రయాత్ర ప్రారంభించి శ్రీకాకుళం జిల్లా అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి సన్నిధికి చేరుకోవడంతో మలి దశ మహా పాదయాత్రను ముగిస్తారు. రెండు నెలలు కొనసాగే ఈ మహా పాదయాత్ర సందర్భంగా కృష్ణా, ఉభయ గోదావరి, విశాఖపట్నం జిల్లాల్లోని అనేక గ్రామాలు, పలు పుణ్యక్షేత్రాల మీదుగా శ్రీకాకుళం జిల్లా అరసవిల్లి వరకు యాత్ర కొనసాగేలా రూట్ మ్యాప్ ను ఉద్యమిస్తున్న రైతు సంఘాల జేఏసీ సిద్ధం చేసింది.  తుళ్లూరు సాయిబాబా కల్యాణ మండపంలో భేటీ అయిన రైతు సంఘాల జేఏసీ మలి దశ పాదయాత్ర ప్రారంభించే సెప్టెంబర్ 12కు ముందు రోజున దీక్షా శిబిరంలో హోమం నిర్వహించాలని నిర్ణయించింది. రాజధానిగా అమరావతినే నిర్ణీత కాలంలోగా అభివృద్ధి చేయాలని హైకోర్టు తీర్పు చెప్పినా ముడు ముక్కలాటకు వైసీపీ సర్కార్ తెర దించకుండా కొత్త జిత్తులు, ఎత్తులతో ముందుకు సాగుతున్నది.

కోర్టు తీర్పుతోనైనా జగన్ సర్కార్ కు జ్ఞానోదయం కలుగుతుందని ఉద్యమిస్తున్న అమరావతి ప్రాంత రైతులు ఆశించారు. అయినా.. ప్రభుత్వం పాత పాటే పాడుతుండడాన్ని రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతే అని ఏపీ సర్కార్ బేషరతుగా ప్రకటించే వరకు తమ ఉద్యమాన్ని విరమించేది లేదని పోరాట కమిటీ తెగేసి చెప్పింది. ఈ క్రమలోనే రైతులు, రైతు కూలీలు, మహిళలు పాల్గొనే మరో మహా పాదయాత్రకు రైతు సంఘాల జేఏసీ  సిద్ధం అవుతోంది. ఈ మహా పాద యాత్రలో అమరావతి రైతులకు తెలంగాణ రైతులు, హైదరాబాద్ వాసులు కూడా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తారని చెబుతున్నారు.

కాగా.. మహా పాదయాత్రకు అందరూ సహకరించాలని, అవసరమైన ఆర్థిక వనరులు సమకూర్చేందుకు రాష్ట్రంలోని రైతులు ముందుకు రావాలని అమరావతి రైతుల జేఏసీ విజ్ఞప్తి చేసింది. రాజధాని ఐక్య కార్యాచరణ సమితి, అమరావతి పరిరక్షణ సమితి నేతలు, లీగల్ కమిటీ, మహిళా ఐక్య కార్యాచరణ సమితి, దళిత ఐక్య కార్యాచరణ నేతలు, దీక్షా శిబిరాల నిర్వాహకులు, రైతులు, మహిళలు అమరావతి టూ అరసవిల్లి మహా పాదయాత్ర నిర్వహించేందుకు నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ ఆ ప్రాంత రైతులు చేస్తున్న ఎన్నో ఉద్యమాలు, ఆందోళనలతో దిగిరాని వైసీపీ సర్కార్ కు తాజాగా తలపెట్టిన మరో మహా పాదయాత్రతోనైనా జ్ఞానోదయం అవుతుందనే ఆశాభావం వ్యక్తం అవుతోంది. ఇప్పటికై జగన్  తన మొండి పంతాన్ని వీడి అమరావతినే రాజధానిగా ప్రకటించాలని కోరుతున్నారు.

By
en-us Political News

  
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.