Publish Date:Jan 25, 2025
ఆంధ్రుల కలల రాజధాని అమరావతి మూడేళ్లలో పూర్తి కానుంది. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ మునిసిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ చెప్పారు. శుక్రవారం (జనవరి 24) మీడియాతో మాట్లాడిన ఆయన పనులకు ఈ నెలాఖరులోగా టెండల్లు పిలుస్తామనీ, ఫిబ్రవరి రెండో వారానికల్లా పనులు ప్రారంభమౌతాయనీ చెప్పరు. అమరావతి నిర్మాణ పనులు మూడేళ్లలో పూర్తవుతాయని పునరు ద్ఘాటించిన మంత్రి నారాయణ.. న్యాయపరమైన అంశాల కారణంగా కొంత జాప్యం జరిగిందన్నారు.
మీడియాతో మాట్లాడడానికి ముందు రాజధాని ప్రాంతంలో విస్తృతంగా పర్యటించిన మంత్రి నారాయణ నేలపాడు సమీపంలో అడ్మినిస్ట్రేటివ్ టవర్లను పరిశీలించారు. ఇప్పటికే 40 పనులకు టెండర్లు పిలవడం జరిగిందని వెల్లడించారు. జగన్ ప్రభుత్వం అమరావతిని నిర్వీర్యం చేయడమే కాకుండా ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక అమరావతి పనులు చకచకా జరుగుతాయనీ, అందుకు కూటమి ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందనీ చెప్పిన ఆయన అమరావతి ప్రపంచంలోని 5 అత్యుత్తమ రాజధానుల్లో ఒకటిగా నిలుస్తుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. 2014 నుంచి 2019 వరకూ అధికారంలో ఉన్న తమ ప్రభుత్వం 4053 అపార్ట్ మెంట్ల నిర్మాణాన్ని ప్రారంభించిందన్న నారాయణ.. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం వాటన్నిటి పనులనూ ఉద్దేశపూర్వకంగా నిలిపివేసిందని విమర్శించారు.
250 మీటర్ల ఎత్తులో అసెంబ్లీ నిర్మాణం చేపడతామనీ, అసెంబ్లీ సమావేశాలు లేని సమయంలో ఆ ప్రదేశాన్ని పర్యటక ప్రాంతంగా ఉపయోగపడేలా తీర్చిదిద్దాలని ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పారు. రాష్ట్ర స్థాయి అధికారులంతా ఒకే ప్రాంతంలో నివాసం ఉండేలా ఐదు అడ్మినిస్ట్రేటివ్ టవర్ల నిర్మాణం చేపట్టనున్నట్లు నారాయణ వివరించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/amarawathi-complete-in-three-years-39-191858.html
ప్రజాధనం దుబారాను నియంత్రించాల్సిన బ్యూరోకాట్లు, అఖిల భారత సర్వీసు అధికారులైన ఐఏఎస్ లు ఆ దిశగా ఎటువంటి ప్రయత్నం చేయకుండా కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తూ.. ఏలిన వారు అంటే అధికారంలో ఉన్న వారి అడుగులకు మడుగులొత్తుతూ.. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేయడం అధికార దుర్వినియోగమే ఔతుందన్నారు.
మెజారిటీ ఉందికదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే అంగీకరించేది లేదన్నారు. మోడీ సర్కార్ పేదల పట్ల కక్ష సాధింపుధోరణితో వ్యవహరిస్తోందనీ, అందుకే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తోందనీ విమర్శించారు.
సీమ లిఫ్ట్ పై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సీమకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనీ, తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి సీమ లిఫ్ట్ పై చేసిన వ్యాఖ్యల ఆధారంగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలోని ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) ప్రధాన కార్యాలయాంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించడం కలకలం రేపింది. కాగా ఈడీ దాడులపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయన పుట్టిన రోజు సందర్భంగా బహిరంగంగా జంతువులను వధించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు వైసీపీ కార్యకర్తలపై జంతు హింస చట్టం కింద కేసులు నమోదైన సంగతి విదితమే. ఇప్పుడు జగన్ తాజాగా ఈ కేసులు ఎదుర్కొంటున్న తన పార్టీ మద్దతుదారులకు పార్టీ లీగల్ సెల్ అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ నెల 16న పోలింగ్ స్టేషన్ల వివరాలతోపాటు ఫొటోతో కూడిన ఓటర్ల తుది జాబితాను ఆయా వార్డుల్లోని పోలింగ్ స్టేషన్ల వారీగా ప్రచురించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే జనాభా ప్రాతిపదికన వార్డులు, డివిజన్లు, ఆయా మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల రిజర్వేషన్లను ఖరారు చేయనున్నట్లు తెలిపారు.
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సవాల్ విసిరారు
ప్రజాసమస్యలపై అధికారులతో చర్చిస్తారు. క్షేత్ర స్థాయిలో పరిశీలన కూడా చేస్తారు.
ఆయన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో శుక్రవారం జరగనున్న సంక్రాంతి సంబరాల్లో పవన్ కల్యాణ్ స్థానికులతో కలిసి పాల్గొంటారు.
ఈ భేటీలో చంద్రబాబు అమరావతి చట్టబద్దత, పోలవరం, బడ్జెట్ కేటాయింపులు, ఉపాధి హామీ పథకంలో వెసలుబాటు వంటి పలు అంశాలను ప్రస్తావించారు. వాటితో బాటుగా కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో టీడీపీకి ఒక బెర్తు సైతం డిమాండ్ చేశారు.
తెలుగువన్ ఎండి రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ లు తాజాగా వ్యవస్థల పతనం, అందుకు కారణాలపై తమ ఆవేదనను సూటిగా ఎలాంటి శషబిషలూ లేకుండా వ్యక్త పరిచారు.
మోకిల నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ కారు మీర్జాగూడ వద్ద అదుపు తప్పి తొలుత డివైడర్ ను ఆ తరువాత చెట్టును ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతులు, క్షతగాత్రులు అందరూ విద్యార్థులే.
ఇటీవల అనారోగ్యంతో మరణించిన టీడీపీ నేత అప్పలనాయుడు కుటుంబాన్ని మంత్రి లోకేష్ పరామర్శించారు.
ఐదేళ్ల పాటు ఢిల్లీలో చక్రం తిప్పారు. కవిత ఎడ్యుకేటెడ్ కావడం, హిందీ కూడా బాగానే మాట్లాడగలగడంతో జాతీయ స్థాయి ప్రతినిథిగా ఉండేవారు. అయితే కవిత రెండో సారి ఎంపీగా గెలవలేక పోయారు