అల అమ‌రావ‌తిపుర‌మున‌.. మే 2న‌..సెకండ్ రిలీజ్

Publish Date:May 1, 2025

Advertisement

మ‌ళ్లీ మోడీ చేతుల మీదుగా ప్రారంభం

ప‌త్రిక‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ మిస్సింగ్

అమ‌రావ‌తి పునః ప్రారంభోత్స‌వానికి ప‌వ‌న్ క‌ళ్యాణ్ కి ప్రాధాన్య‌త‌ లేదు.. అందుకే ఆహ్వాన ప‌త్రంలో ఆయ‌న పేరు వేయ‌లేదు.. అన్న కోణంలో వైసీపీ తెగ ఫీల‌వుతోంది. ఈ దిశ‌గా కూట‌మిలో చీలిక‌లు తెచ్చే య‌త్నం ఒకింత జోరుగానే తెలుస్తోంది.. అందుకే ర‌క‌ర‌కాల మీమ్స్ త‌యారు చేసి.. త‌ద్వారా కూట‌మిలో వారికి వారు కొట్టుకు చ‌చ్చే ఎత్తుగ‌డ వేస్తోంది.  ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ చెప్పిన‌ట్టు కూట‌మి కనుక ఇదే ఒర‌వ‌డితో త‌మ‌ బంధాన్ని  కొన‌సాగిస్తే.. మళ్లీ  కూడా ప్ర‌భుత్వం వారిదే అవుతుంది. దీంతో కూట‌మిలో ఎలాగైనా  స‌రే చీలిక‌లు తేవాల‌న్న కృత నిశ్చ‌యంతో ఉంది వైసీపీ.  ఈ దిశ‌గా ఆ పార్టీ చేయ‌ని విశ్వ ప్ర‌య‌త్నం లేదు.

మొన్న ప‌వ‌న్ కేర‌ళ, త‌మిళ‌నాడు తీర్ధ‌యాత్ర‌ల‌కు వెళ్లిన‌పుడు కూడా ఇంతే. ప‌వ‌న్ ఉప ముఖ్య‌మంత్రిగా అంటీ ముట్ట‌న‌ట్టు ఉంటున్నారు. ఆయ‌న్ను తీసి  ప‌క్క‌న పెట్టేశారు. వ‌చ్చే రోజుల్లో లోకేషే డిప్యూటీ సీఎం కాబోతున్నారు.  కాబ‌ట్టి ప‌వ‌న్ అలిగి వెళ్లిపోయారంటూ త‌మ‌కు తాము ఎన్నెన్నో క‌ల‌లు క‌న్నారు. ఊహాగానాల‌ను వ్యాప్తి చేసే  య‌త్నం చేశారు.  తీరా  యాత్ర నుంచి వ‌చ్చిన ప‌వ‌న్ ఎన్టీఆర్ ట్ర‌స్ట్ కార్య‌క్ర‌మానికి హాజ‌రై యాభై ల‌క్ష‌ల విరాళం కూడా ఇచ్చారు. దీంతో అవాక్క‌వ‌డం ఫ్యాను పార్టీ నేత‌ల వంత‌య్యింది.

క‌ట్ చేస్తే ఇప్పుడు మ‌రో గొడ‌వ‌. ప‌వ‌న్ పేరు అమ‌రావ‌తి ఆహ్వాన ప‌త్రంలో లేదు కాబ‌ట్టి ఇక ఆయ‌న ప్రాధాన్య‌త త‌గ్గిపోయింది. ఆయ‌న్ను ఎక్క‌డ ఉంచాలో అక్క‌డ ఉంచే య‌త్నం చేస్తున్నారంటూ మీమ్స్ చేస్తున్నారు. రెడీ సినిమాలో బ్ర‌హ్మానందం క్లిప్పింగు వాడి.. నానా హంగామా చేస్తున్నారు. దీని కార‌ణంగా కూట‌మిలో ఎలాగైనా ఒక గ్యాప్ క్రియేట్ చేయాల‌నుకుంటున్నారు. ఏతా వాతా వైసీపీ వాళ్లు ఈ అంశంలో లాగే లాజిక్ ఏంటంటే.. బీజేపీ, టీడీపీ క‌ల‌వ‌డానికి మూల కార‌కుడు.. కూట‌మి మూల పురుషుడు.. ప‌వ‌నే క‌దా? మ‌రి ప‌వ‌న్ కి ఆహ్వాన ప‌త్రిక‌లో ప్రాధాన్య‌త లేకుంటే ఎలా? అన్న‌ది వీరి ప్ర‌శ్న‌. 

ఇక్క‌డే కాదు ఎక్క‌డ ఏ చిన్న ఛాన్స్ దొరికినా స‌రే ప‌వ‌న్ ని బ‌య‌ట‌కు లాగి ఆయ‌న్ను గానీ, ఆయ‌న అభిమాన గ‌ణాన్ని కానీ, ఆయ‌న సైనికుల‌ను కానీ.. టెంప్ట్ చేయాలి. వారి మ‌నోభావాల‌ను దారుణంగా రెచ్చ‌గొట్టాలి అన్న‌ది ఒక టార్గెట్ గా పెట్టుకున్నారులా ఉంది చూస్తుంటే.  అందుకే నిన్న మొన్న వైసీపీ హంగామా చేసిన గో మ‌ర‌ణాల విష‌యంలో అయితేనేమీ, శ్రీ కూర్మం తాబేళ్ల విష‌యంలో అయితేనేమీ.. ప‌వ‌నానంద స్వామి ఏమై పోయాడు? ఏడీ ఆయ‌న స‌నాత‌న ధ‌ర్మ ప‌రిర‌క్ష‌ణ అంటూ నానా హంగామా చేస్తున్నారు.

అయితే ఇక్క‌డ వైసీపీ సోష‌ల్ మీడియా కార్య‌క‌ర్త‌లు తెలుసుకోవ‌ల్సిన విష‌య‌మేంటంటే ప‌వ‌న్ త‌న‌కు తాను ఎప్పుడో ప్రొటోకాల్ అంశంలో ఒక నిర్ణ‌యానికి వ‌చ్చి ఉన్నారు. ఈ విష‌యంలో మ‌న‌కున్న ఆధారాలు ఏంటంటే..  మొన్న జ‌గ‌న్ మోహ‌న రెడ్డి ప్ర‌త్యేక హోదా కావాల‌ని డిమాండ్ చేస్తున్న స‌మ‌యాన‌.. ఆయ‌న ఒక మాట అన్నారు. నాకు మోడీతో సాన్నిహిత్యం ఉండొచ్చుగాక‌.. కానీ ప్రొటోకాల్ అనేది ఒక‌టి ఉంటుంది. దాని ప్ర‌కారం అక్క‌డ త‌న‌కు స్థానం కేటాయిస్తారు. ఉప ముఖ్య‌మంత్రి అన్న‌ది అంత  గొప్ప ప‌ద‌వి కాదు. రాజ్యాంగ బ‌ద్ధ‌మైన‌ది అంత‌క‌న్నా కాదు. అది కూట‌మి  ప్ర‌భుత్వంలో నెంబ‌ర్ టూ పొజిష్ అయి ఉండొచ్చుగాక‌.. కానీ దానికి విశాల దృక్ప‌థంతో చూస్తే ఉన్న విలువ వేరు. మొద‌ట ప్ర‌ధాని, త‌ర్వాత స్పీక‌ర్, కేంద్ర మంత్రులు, ముఖ్య‌మంత్రులు మంత్రులు ఇలా ఉంటుంది. అంతే కానీ, నా సీటు తీసుకెళ్లి ప్ర‌ధాని ప‌క్క‌న  వేయ‌లేద‌ని  తాను ఎలా బాద ప‌డ‌కూడ‌దో జ‌గ‌న్ కూడా స‌రిగ్గా అలాగే బాధ ప‌డ‌కూడ‌ద‌ని ఆయ‌న కుండ బ‌ద్ధ‌లు కొట్టారు. ఈ క్ర‌మంలో చూస్తే ప‌వ‌న్ కి పిచ్చ క్లారిటీ ఉంద‌న్న మాట‌.  ప‌వ‌న్ ప్రొటో కాల్ విష‌యంలో ఇంత స్ప‌ష్ట‌మైన విజ‌న్ క‌లిగి ఉన్నా కూడా వైసీపీ నేత‌లు ఇంకా అదే భ్ర‌మ‌తో.. పిచ్చి ఆశ కొద్దీ.. కూట‌మిలో చీలిక తెద్దామ‌న్న విశ్వ ప్ర‌య‌త్నాలైతే మాన‌డం లేదు. నిజంగా రాజ‌ధాని విష‌యంలో చింతించాల్సిన అంశాలేంటి? అన్న‌ది ఆలోచించాలి. చిత్త‌శుద్ధి ఉంటే.. త‌మ‌కు కూడా రాజ‌ధాని ప‌ట్ల ఒక స్థిర అభిప్రాయం ఏర్ప‌డింద‌ని ప్ర‌క‌టించాలి. ఎందుకంటే మూడు ప్రాంతాల ప్ర‌జ‌లు రాజ‌ధాని ఇక్క‌డే ఉండాల‌ని డిసైడ్ అయ్యారు కాబ‌ట్టే వారు కూట‌మికి 164 సీట్ల ఆధిక్యం క‌ట్ట‌బెట్టార‌ని గుర్తించాలి.  అలా చేయ‌కుండా పిల్లి ఉట్టి గానీతెగి కింద ప‌డితే ఆ పాల‌న్నీ తాగొచ్చ‌న్న భ్ర‌మ‌లో ఉండి ఎలా శాపాలు పెట్టుకుంటూ ఉంటుందో, అలా వైసీపీ  కూట‌మి ప్ర‌భుత్వంలో విబేధాలు లేకున్నా ఏదో లా సృష్టించి వాటి ద్వారా ల‌బ్ధి పొందాల‌ని చూడ్డం దారుణంగా భావిస్తున్నారు ఆంధ్రులు. మ‌రి చూడాలి వైసీపీ  వైఖ‌రి ఇక‌నైనా మారుతుందా లేదా అన్నది.

By
en-us Political News

  
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మరోసారి హరీష్ రావుపై హాట్ కామెంట్స్ చేశారు.
కొత్త సంవత్సరం చేతినిండా, నోటి నిండా పని పెట్టనుంది. ఎందుకంటే ఈ ఏడాది పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలన్నీతమతమ వ్యూహాలు, ఎత్తుగడలకు పని చెప్పనున్నాయి. పెద్ద రాష్ట్రాలుగా ఉన్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల అసెంబ్లీలకు 2026 తొలి అర్ధ భాగంలోనే ఎన్నికలు జరగనున్నాయి.
అందె శ్రీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందనీ, ఇందుకోసం చట్టపరమైన మద్దతు అవసరమని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో 1994పబ్లిక్ సర్వీస్ కమిషన్ చట్టంలోని నిబంధనలు సవరించాల్సి ఉందని తెలిపారు. అందె శ్రీ కుమారుడికి ఉద్యోగ అవకాశం కల్పించడం కోసం చేసిన సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టామన్నారు.
దేశంలో మోడీ పాలన అంతమవ్వాలంటే.. పొరుగు దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్‌లలో జరిగిన ఉద్యమాల వంటివి ఇక్కడ కూడా రావాలని ఆయన అన్నారు.
ఏపీలో వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ రాష్ట్రంలో ప్రజలు తమకు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేస్తే.. తెలంగాణలో ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులను దీటుగా ఎదుర్కోవడంలో వైఫల్యం కారణంగా బాయ్ కాట్ చేస్తున్నదన్న చర్చ జరుగుతోంంది.
ఇంత కాలం కల్వకుంట్ల కవిత తన విమర్శలను హరీష్ రావు, సంతోష్, జగదీశ్వరరెడ్డి వంటి నాయకులకే పరిమితం చేసిన కవిత ఇప్పుడు బీఆర్ఎస్ అధినాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు, సవాళ్లు సంధిస్తున్నారు. తాజా చిట్ చాట్ లో ఆమె తన తండ్రి కేసీఆర్ నే నేరుగా నిలదీశారు. కేసీఆర్ అసెంబ్లీకి డుమ్మా కొడితే రాష్ట్రంలో బీఆర్ఎస్ ఇక ఖతమేనన్నారు. అయినా ఎటువంటి తప్పూ చేయకపోతే కేసీఆర్ సభకు ఎందుకు రావడం లేదని నిలదీశారు.
గత కొంత కాలంగా తన స్వంత కుమారుడు, కుమార్తెల మధ్య పంచాయతీని పరిష్కరించే విషయంలో విఫలమైన ఆయన ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మధ్య జలపంచాయతీలు, కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు గుప్పిస్తున్నారని ఎద్దేవా చేశారు. రానున్న రోజులలో బీఆర్ఎస్ కనుమరుగైపోవడం ఖాయమని తాను భావిస్తున్నట్లు చెప్పారు.
స్థానిక ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరుడు సతీష్ రెడ్డి గాలి జనార్ధన్ రెడ్డిపై రెండు రౌండ్లు కాల్పులు జరపగా, ప్రతిగా గాలి జనార్దన్ రెడ్డి అనుచరులు కూడా ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ మరణించాడు.
తనను పార్టీ నుంచి బయటకు గెంటేసిన బీఆర్ఎస్ కు చుక్కలు చూపిస్తానని హెచ్చరించారు. బీఆర్ఎస్ హయాంలో అవినీతి జరిగిందని ఇప్పటికే బాహాటంగా విమర్శలు గుప్పిస్తూ వచ్చిన కల్వకుంట్ల కవిత ఈ సారి కేటీఆర్ రాజకీయాలను ఎండగట్టారు. తన సోదరుడు కేటీఆర్ కంటే పార్టీ కోసం తానే ఎక్కువగా కష్టపడ్డాన విస్పష్టంగా తేల్చేశారు.
శివాజీ చేసిన వివాదాస్పద కామెంట్లపై నాగబాబు కౌంటర్ ఒకింత ఘాటుగా ఉంది. అందులో సందేహం లేదు. అయితే మామూలుగా అయితే నాగబాబు కౌంటర్ వివాదాస్పదం అయ్యే అవకాశం లేదు. కానీ శివాజీ వ్యాఖ్యలపై మెగా ఫ్యాన్స్ ఒకింత సానుకూలత వ్యక్తం చేయడంతో నాగబాబును వివాదంలోకి లాగారు. సోషల్ మీడియా వేదికగా నాగబాబుపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.
ఇక కుటుంబ వారసత్వం రేహాన్ వాద్రాకు అప్పగించడానికి రాహుల్ రెడీ అయిపోయారనడానికి సూచనగా.. రేహాన్ వాద్రా పేరు చివర గాంధీని కూడా ఇటీవలే అధికారికంగా చెర్చారు. ఔను రేహాన్ ఇంటి పేరును వాద్రా గాంధీగా ప్రికాంక వాద్రా అధికారికంగా మార్పించారు.
ఆలయ ప్రాంగణంలో గానీ, మీడియా ముందు గానీ రాజకీయ వ్యాఖ్యలు చేసే వారిపై, వాటిని ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్న హెచ్చరికలు సైతం జారీ చేసింది. తిరుమలగిరిపై కేవలం “గోవింద నామస్మరణ” మాత్రమే ఉండాలన్నది టీటీడీ భావన.
అసెంబ్లీ, మండలిలో పార్టీ గళాన్ని బలంగా వినిపించేందుకు సీనియర్ నేతలకు బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేతలుగా బాధ్యతలు అప్పగించారు. ఈ నియామకాల ద్వారా అటు అసెంబ్లీలో, ఇటు మండలిలో అధికార పక్షాన్ని దీటుగా ఎదుర్కోవాలని దిశానిర్దేశం చేసినట్లయింది. అయితే అలా నియమించిన ఉప నేతలలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు పేరు లేదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.