Publish Date:Mar 28, 2026
అమరావతి రాజధానిగా ఏకగ్రీవ తీర్మానం సంగతి సరే.. రేపు జగన్ వచ్చినా? ఈ ప్రాంతాన్ని రాజధానిగా హోదా మార్చడానికి వీల్లేదా? అంతగా ఈ చట్టంలో, ఈ తీర్మానంలో ఏముంది? అమరావతి విషయంలో కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కేవలం ఒక సాధారణ తీర్మానం కాదు. ఇది ఒక చట్టబద్ధమైన రక్షణ కవచం అంటూ లీగల్ షీల్డ్. సపోజ్.. ఫర్ సపోజ్ వచ్చే ఎన్నికలలో జగన్ పార్టీ విజయం సాధించి అధికారంలోకి వచ్చినా, మరెవరైనా అధికారంలోకి వచ్చినా కూడా ఏమీ చేయలేనంతగా ఈ తీర్మానం ఒక మాస్టర్ ప్లాన్ అంటున్నారు. ఇంతకీ అదేంటి?
ఈ తీర్మానంలో ప్రధానంగా ప్రస్తావించిన సెక్షన్ 5 సవరణ అత్యంత కీలకం. 2014 ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ ఐదు ప్రకారం.. హైదరాబాద్ పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంది. ఆ తర్వాత ఏపీకి కొత్త రాజధాని ఉండాలని ఉంది. కానీ, దాని పేరు అమరావతి అని ఎక్కడా స్పష్టంగా లేదు. ఈ చట్టానికి సవరణ చేసి.. ఆంధ్రప్రదేశ్ రాజధాని అనే దగ్గర అమరావతి అనే పదాన్ని చేర్చాలని.. కేంద్రాన్ని కోరుతూ.. అసెంబ్లీ శనివారం (మార్చి 28) తీర్మానం చేసింది. ఒక్కసారి పార్లమెంటు ఈ సవరణను ఆమోదిస్తే, అమరావతి అనేది కేవలం రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే తీసుకునే నిర్ణయం కాబోదు.. ఇది కేంద్ర చట్టంలో ఒక భాగం అవుతుంది.
సాధారణంగా రాజధాని ఎక్కడా ఉండాలనేది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకోవచ్చు. గతంలో జగన్ మూడు రాజధానుల బిల్లు తెచ్చినట్టు..అయితే ఒక సారి అమరావతి రాజథాని అని కేంద్ర ప్రభుత్వం రికగ్నైజేషన్ యాక్ట్ లోకి వెళ్తే.. దాన్ని మార్చాలంటే మళ్లీ పార్లమెంటు ఆమోదం కావల్సిందే. ఒక వేళ జగన్ వచ్చి మళ్లీ మూడు రాజధాని బిల్లు తెచ్చినా అది కేంద్ర చట్టానికి విరుద్ధం అవుతుంది. మళ్లీ కేసులు గట్రా అయ్యి కాలయాపన జరిగి.. ఎటూ గాకుండా పోతుంది. అచ్చెన్నాయుడు అన్నట్టు 2019లో జరిగినట్టు 2029లో గానీ జగన్ వస్తే.. ఇక ఆంధ్రప్రజల అవస్థ మళ్లీ మొదటికే వస్తుందన్నది గుర్తుంచుకోవాలి.
ఇంతకీ అమరావతి అంటే ఏమిటి? ఆ నిర్వచనం ఎలాంటిదని గమనిస్తే.. ఇది ఒక ఊరు కాదు.. రాజధాని అభివృద్ధి సాకార సంస్థ.. పరిధిలో నోటిఫై చేసిన ప్రాంతం. దీన్నే అమరావతిగా గుర్తించాలని ఈ తీర్మానంలో కోరారు. ఇందువల్ల రాజధాని విస్తీర్ణంపై కూడా చట్టబద్ధమైన క్లారిటీ వచ్చే అవకాశముంది. గతంలో హైకోర్టు తీర్పు ఇస్తూ.. రాజధానిని మార్చే అధికారం అసెంబ్లీకి లేదని చెప్పింది. ఇప్పుడీ తీర్మానం ద్వారా కేంద్రం చట్టం చేస్తే.. ఆ తీర్పునకు మరింత బలం చేకూరుతుంది. ఇందువల్ల భవిష్యత్తులో ఏ ప్రభుత్వం వచ్చినా రాజధానిని అంగుళం కూడా కదిలించలేదు. ఇదీ ఏపీ సీఎం చంద్రబాబు ధీమా.
ఈ తీర్మానం లక్ష్యం ఒక్కటే. రాజకీయ అస్తిరత నుంచి రాజధానిని కాపాడడం. ఒక వేళ జగన్ మళ్లీ అధికారంలోకి వచ్చి మూడు రాజధానుల పాట మొదలెట్టినా ఫలితం ఉండదు. అందుకే అసెంబ్లీలో అమరావతిని ఏపీ ఏకైక శాశ్వత రాజధానిగా చేసిన తీర్మానానికి అంత ప్రాముఖ్యత.మంత్రి లోకేష్ చెప్పినట్లు ఈ బిల్లును పార్లమెంటు ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లోనే ఆమోదానికి ప్రవేశ పెట్టి ఆమోదిస్తే.. ఇక ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి శాశ్వతం అవుతుంది. రాజథాని కోసం భూములిచ్చిన రైతుల త్యాగానికి సార్థకత చేకూరుతుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/amaravati---permanent-capital-of-andhra-pradesh-25-216344.html
టీవీకే అధినేత విజయ్కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైనదిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూటమి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవకాశం వచ్చినా వారు వదిలిపెట్టినట్టే కనిపించదు. మొన్న కోట వినుత ఘటన, నిన్న అరవ శ్రీధర్ వ్యవహారం, ఇవాళ వర్మ ఇష్యూ.. ఇలా సమయం దొరికినపుడల్లా ఆయా అంశాలను బాగా హైలెట్ చేసి.. కూటమిలో ఏదో ఒక చిచ్చు రాజేయాలని చూస్తోంది వైసీపీ అధినాయకత్వం.
అతి కొద్ది మంది నేతలు జగన్ ప్రకటనను సమర్దిస్తూ.. అనుకూల ప్రకటనలు చేస్తుండగా.. మెజారిటీ లీడర్, క్యాడర్ మాత్రం జగన్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్రబాబు ఫొటోలేదని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే దొరబాబు జోక్యం చేసుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వర్మ దురుసు వ్యాఖ్యలపై పార్టీలో అంతర్గతంగా చర్చించిన అధిష్టానం.. వర్మ వ్యవహారాన్ని తప్పుబట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.